ఆంధ్రప్రదేశ్‌

పాత ధరే నయం..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, డిసెంబర్ 1: కొత్త ప్రభుత్వం కొత్త ఇసుక విధానంలో వినియోగదారులకు ఇసుక ధర సరళంగా ఉంటుందని ఆశిస్తే అందుకు భిన్నంగా కొత్త విధానంలో పాత ధరే నయం అన్నట్టుగా తయారైంది. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం పక్కదారి పట్టడం వల్లే ధర పెరిగిపోయిందని తెలుస్తోంది. ధర పెరిగిన దామాషాలో ఆదాయం కూడా ప్రభుత్వానికి దక్కుతుందనుకుంటే ఒకింత సరిపెట్టుకోవచ్చని, కానీ అక్రమ విధానంలో పెరిగిన ఆదాయం కాస్తా పక్కదారి పడుతోందని తెలుస్తోంది. ట్రాన్స్‌పోర్టు మాయాజాలంలో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం కాస్తా పక్కదారి పడుతోందని తెలుస్తోంది. ఓపెన్ ర్యాంపులుగా ఉన్న కాటవరం, వంగలపూడి రీచ్‌ల నుంచి భారీస్థాయిలో ఇసుక రవాణా జరుగుతోంది. ఈ రెండు రీచ్‌ల నుంచి నిత్యం లక్షలాది టన్నుల ఇసుక విశాఖకు రవాణా జరుగుతోంది. ఇసుకను స్టాక్ పాయింట్‌కు టెండర్లు లేకుండా లేకుండానే జీవోలో నిర్దేశించిన రేట్లకు నామినేషన్ పద్ధతిపై ఈ ర్యాంపుల నుంచి విశాఖకు ట్రాన్స్‌పోర్టు నడుస్తున్నట్టు తెలుస్తోంది. కడప జిల్లాకు చెందిన కొంతమందికి ఈ ట్రాన్స్‌పోర్టు అప్పగించినట్టు తెలుస్తోంది. రావులపాలెంకు చెందిన వారు సబ్ లీజుకు తీసుకున్నట్టు తెలిసింది. రావులపాలెంకు చెందిన వారు మరో ఆరుగురికి సబ్‌లీజు ఇచ్చినట్టు తెలియవచ్చింది. ఇలా ఈ ర్యాంపుల నుంచి విశాఖ తరలించే ఇసుక ట్రాన్స్‌పోర్టు మూడు చేతులు మీదుగా సాగుతున్నట్టు తెలుస్తోంది. ఒక టన్ను ఇసుకకు ఒక కిలో మీటర్‌కు జీవోలో రూ.4.99లు ట్రాన్స్‌పోర్టు ఛార్జి చొప్పున ఇచ్చారు. ఈమేరకు ఉదాహరణకు విశాఖకు ఈ ర్యాంపుల నుంచి 220 కిలోమీటర్ల దూరానికి 30 టన్నుల లారీ కిరాయి సుమారు రూ.33 వేలు అవుతోంది. ఈ ప్రాంతానికి వచ్చి విశాఖకు రిటన్ వెళ్ళే లారీకి కిరాయి సుమారు రూ.12,500 తీసుకుంటారు. అన్‌లోడ్ చార్జి రూ.1000 ఉంటుంది. ఈమేరకు రిటన్ లారీకైతే సుమారు రూ.13,500 అవుతుంది. ఈ ఛార్జీకి రవాణా చేస్తామని ముందుకొస్తున్నా వారిని కాదని రూ.33వేలు చెల్లిస్తున్నట్టుగా ఉంది. ఈమేరకు ట్రాన్స్‌పోర్టు రూపేణా సుమారు రూ.19,500 సొమ్ము ఎవరి జేబుల్లోకి వెళ్తుందోనని ఆరోపణలు వినిపిస్తున్నాయి.