ఆంధ్రప్రదేశ్‌

ప్రజల రుణం తీర్చుకోటానికి సీఎం జగన్ తహతహ: విజయసాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 1: రికార్డు స్థాయిలో 151 సీట్లతో తమను అధికారంలోకి తీసుకొచ్చిన ప్రజల రుణం తీర్చుకోటానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిరంతరం పరితపిస్తున్నారని వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ఆదివారం ట్విట్టర్‌లో పేర్కొన్నారు. జగన్ ఆరు మాసాల పాలనపై ఆయన స్పందిస్తూ నిరుద్యోగ యువతకు నాలుగు లక్షల ఉద్యోగాలిచ్చారని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి 52వేల మంది కార్మికులకు భరోసా కల్పించారని, ఏటా ఉద్యోగ నియామకాలు ఉంటాయంటూ నిరుద్యోగుల్లో ధైర్యం నింపారని ప్రస్తుతించారు.