ఆంధ్రప్రదేశ్‌

బీజేపీ సంకల్ప యాత్రకు శ్రీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనకాపల్లి, అక్టోబర్ 16: మహాత్మాగాంధీ ఆశయాలను ప్రజల ముంగిటకు తీసుకువెళ్లే లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చేపట్టిన గాందీజీ సంకల్పయాత్ర పాయకరావుపేటలో బుధవారం ప్రారంభమైంది. పాండురంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం జెండా ఊపి కన్నా ఈ ర్యాలీ ని ప్రారంభించారు. గాంధీ ఆశయాల సాధనకు ప్రధాని నరేంద్రమోదీ చేస్తున్న కృషిని వివరిస్తూ చేపట్టిన ఈ పాదయాత్ర నామవరం మీదుగా రాత్రి ఉద్దండపురం గ్రామానికి చేరుకుంది. గ్రామస్తులతో మమేకం కావడం, భజనలతో కన్నా పార్టీ శ్రేణులను, ప్రజలను ఉత్తేజ పరిచారు. పాయకరావుపేటలో జరిగిన సభలో కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ అక్టోబర్ 2న మహాగాంధీ జయంతి సందర్భంగా సంకల్ప యాత్రలను దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో బీజేపీ చేపట్టిందన్నారు. గాంధీ ఆశయాల సాధన కోసం ప్రధాని నరేంద్రమోడీ ఇప్పటి వరకు చేసిన కృషిని, చేపట్టవలసిన భవిష్యత్తు ప్రణాళికలను ప్రజలకు వివరించడమే లక్ష్యంగా ఈ పాదయాత్ర సాగుతుందన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు పొన్నగంటి అప్పారావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో మాజీ ఎంపీ కె హరిబాబు, ఎమ్మెల్సీ మాధవ్, జిల్లా గ్రంథాయ సంస్థ మాజీ చైర్మన్ తోట నగేష్ మాట్లాడారు.
అనకాపల్లి, అక్టోబర్ 16: మహాత్మాగాంధీ ఆశయాలను ప్రజల ముంగిటకు తీసుకువెళ్లే లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చేపట్టిన గాందీజీ సంకల్పయాత్ర పాయకరావుపేటలో బుధవారం ప్రారంభమైంది. పాండురంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం జెండా ఊపి కన్నా ఈ ర్యాలీ ని ప్రారంభించారు. గాంధీ ఆశయాల సాధనకు ప్రధాని నరేంద్రమోదీ చేస్తున్న కృషిని వివరిస్తూ చేపట్టిన ఈ పాదయాత్ర నామవరం మీదుగా రాత్రి ఉద్దండపురం గ్రామానికి చేరుకుంది. గ్రామస్తులతో మమేకం కావడం, భజనలతో కన్నా పార్టీ శ్రేణులను, ప్రజలను ఉత్తేజ పరిచారు. పాయకరావుపేటలో జరిగిన సభలో కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ అక్టోబర్ 2న మహాగాంధీ జయంతి సందర్భంగా సంకల్ప యాత్రలను దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో బీజేపీ చేపట్టిందన్నారు. గాంధీ ఆశయాల సాధన కోసం ప్రధాని నరేంద్రమోడీ ఇప్పటి వరకు చేసిన కృషిని, చేపట్టవలసిన భవిష్యత్తు ప్రణాళికలను ప్రజలకు వివరించడమే లక్ష్యంగా ఈ పాదయాత్ర సాగుతుందన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు పొన్నగంటి అప్పారావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో మాజీ ఎంపీ కె హరిబాబు, ఎమ్మెల్సీ మాధవ్, జిల్లా గ్రంథాయ సంస్థ మాజీ చైర్మన్ తోట నగేష్ మాట్లాడారు.
*చిత్రం...పాయకరావుపేటలో గాంధీజీ సంకల్ప యాత్ర సందర్భంగా మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ