ఆంధ్రప్రదేశ్‌

దళతులపై వైసీపీ ఎమర్జెన్సీ విధించిందా?: జవహర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, అక్టోబర్ 16: రాష్ట్ర ప్రభుత్వం దళితుల భావ, వాక్ స్వేచ్ఛను హరించేలా చర్యలు తీసుకుంటూ, వారిపై ఎమర్జెన్సీ విధించినట్లుగా వ్యవహరిస్తోందని టీడీపీ నేత, మాజీ మంత్రి కెఎస్ జవహర్ ఆరోపించారు. గుంటూరులోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం జగన్మోహన్‌రెడ్డి బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగి రెండు వందల రోజులు దాటినా కేసులో సరైన విచారణ జరగలేదని, హత్య కేసు గురించి వర్ల రామయ్య కంటే ముందు మాట్లాడిన వైసీపీ నేతలు విజయసాయిరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిలను మినహాయించి టీడీపీ నేత వర్ల రామయ్యకు నోటీసులు ఇవ్వటం కక్ష సాధింపు చర్యల్లో భాగమేనన్నారు.