ఆంధ్రప్రదేశ్‌

తిరుమల ఆన్‌లైన్ గదుల బుకింగ్‌కు కాషన్ డిపాజిట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, అక్టోబర్ 15: తిరుమలలో ఆన్‌లైన్‌లో గదులు బుక్ చేసుకునే యాత్రికులకు కాషన్ డిపాజిట్ విధానాన్ని 2020 జనవరి నుంచి అమల్లోకి తీసుకురానున్నట్లు టీటీడీ అదనపు ఈఓ ఏ.వి.్ధర్మారెడ్డి చెప్పారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో మంగళవారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తిరుమలలో గదులు కేటాయింపు కేంద్రాల వద్ద నగదు రహిత లావాదేవీలు క్రమంగా పెరుగుతున్నాయని చెప్పారు. శ్రీ పద్మావతి విశ్రాంతి గృహం వద్ద 97 శాతం, ఎంబీసీ వద్ద వంద శాతం స్వైపింగ్ ద్వారా లావాదేవీలు జరుగుతున్నట్లు చెప్పారు. సాధారణ గదుల కేటగిరీలో టీబీ కౌంటర్‌లో 91శాతం, సప్తగిరి విశ్రాంతి గృహాల వద్ద 62 శాతం, సూరాపురంతోట, రాంభగీచ, సిఆర్వో జనరల్ వద్ద దాదాపు 50శాతం నగదు రహిత లావాదేవీలు జరుగుతున్నాయని వివరించారు.