ఆంధ్రప్రదేశ్‌

ప్రభుత్వ నిర్ణయం హర్షణీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ), అక్టోబర్ 15: కేంద్ర ప్రభుత్వం నిధులిచ్చే పథకాలకు తప్పని సరిగా ప్రధాన మంత్రి పేరు పెట్టాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సూచించారు. గత ప్రభుత్వంలా కాకుండా ఇప్పటి వైసీపీ ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం హర్షణీయమని మంగళవారం ట్విట్టర్‌లో తెలిపారు. ప్రధాన మంత్రి మోదీ రైతులకు అందించే కేంద్ర నిధులు 6000 రూపాయలకు రాష్ట్రం మ్యాచింగ్ గ్రాంట్ కలిపి వైఎస్‌ఆర్ భరోసా - పీఎం కిసాన్‌గా పేరు పెట్టడం హర్షణీయమన్నారు. గత సర్కారులా కాకుండా ఇకపై కేంద్రం నిధులతో అమలు చేసే వివిధ సంక్షేమ పథకాలకు ప్రధాన మంత్రి పేరు తప్పనిసరిగా జత చేయాలని కన్నా పేర్కొన్నారు.