ఆంధ్రప్రదేశ్‌

రుణమాఫీ పేరిట మోసం చేసిన బాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, అక్టోబర్ 14: రైతు రుణమాఫీ పేరిట చంద్రబాబు నాయుడు గత ఐదేళ్లలో అన్నదాతలను తీవ్రంగా మోసం చేశారని వైసీపీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు ధ్వజమెత్తారు. సోమవారం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి నవరత్నాలను అమలు చేస్తుంటే టీడీపీ నేతలు విమర్శిస్తూ తమ స్థాయిని దిగజార్చుకుంటున్నారన్నారు. మంగళవారం నుండి రాష్ట్రంలో రైతు భరోసా పథకాన్ని ప్రభుత్వం అమలు చేయబోతుందని, ప్రతి రైతు కుటుంబంలో అనందాన్ని నింపాలన్నదే సీఎం జగన్మోహనరెడ్డి లక్ష్యమన్నారు. తనయుడు లోకేష్ ఓటమిని చూసి బాబు కుంగిపోతున్నారని, ప్రజలు గుణపాఠం చెప్పినా ఆయనలో మార్పు రాలేదన్నారు. తెలుగుదేశం పార్టీలో ఉంటే తమకు భవిష్యత్తు లేదనే ఉద్దేశంతోనే ఆ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారన్నారు. అమ్మ ఒడి పథకం ఓ బృహత్తర కార్యక్రమమన్నారు.