ఆంధ్రప్రదేశ్‌

పరువు హత్యలను నివారించాలి: సీపీఐ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 14: సాక్షాత్తు ఒక దళిత మహిళ రాష్ట్ర హోంమంత్రిగా ఉన్నప్పటికీ దళితులకు, మైనార్టీలకు రక్షణ కరవవ్వడం బాధాకరమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే పరువు హత్యలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు చేపట్టాలంటూ సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు రాసిన లేఖలో రామకృష్ణ పేర్కొన్నారు. ఇటీవల మానవత్వాన్ని మంట గలిపే రీతిలో పరువు హత్యలు జరుగుతున్నాయని, చిత్తూరు జిల్లా పలమనేరు ఊసరపెంట గ్రామంలో జరిగిన కుల దురహంకార హత్యను మరువక ముందే కుప్పం నియోజకర్గంలోని రెడ్లపల్లి గ్రామంలో మరో పరువు హత్య జరిగిందన్నారు.