ఆంధ్రప్రదేశ్‌

శౌర్యచక్ర అవార్డు గ్రహీతలకు నగదు మంజూరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 14: శౌర్యచక్ర అవార్డులు అందుకున్న గ్రేహౌండ్స్‌కు చెందిన ఇద్దరు ఉద్యోగులకు ఎట్టకేలకు నగదు పారితోషికాన్ని రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. విధి నిర్వహణలో అత్యుత్తమ ధైర్యసాహసాలు కనబరిచినందుకు గ్రేహౌండ్స్ విభాగంలో అసిస్టెంట్ అస్సాల్ట్ కమాండర్ పి.త్రినాథరావు, సీనియర్ కమాండో సిహెచ్.జి.వి.రామచంద్రరావులు 2017లో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవంలో శౌర్యచక్ర పురస్కారాన్ని రాష్టప్రతి చేతుల మీదుగా అందుకున్నారు. త్రినాథరావు స్వస్థలం శ్రీకాకుళం జిల్లా మెట్టకివలస కాగా, రామచంద్రరావు స్వస్థలం తూర్పు గోదావరి జిల్లా రంప ఎర్రంపాలెం. ఈ పురస్కారానికి ఎంపికైన వీరద్దరికీ రాష్ట్ర ప్రభుత్వం ఆరు లక్షల రూపాయల చొప్పున నగర పారితోషికాన్ని అందచేయాల్సి ఉంది. ఈ ఏడాది మార్చిలో నగదు చెల్లింపునకు ఉత్తర్వులు జారీ చేసింది. నిధుల కొరత కారణంగా ఆ బిల్లులను తిరస్కరిస్తునట్లు పే అండ్ అక్కౌంట్స్ అధికారులు జూలైలో తెలిపారు. అయితే గత నెల 20న 12 లక్షల రూపాయలను చెల్లించేందుకు వీలుగా బడ్జెట్ రిలీజ్ ఆర్డరును జారీ చేసింది. ఈ మేరకు వారిద్దరికీ నగదు చెల్లింపునకు చర్యలు తీసుకోవాల్సిందిగా గ్రేహౌండ్స్ అదనపు డీజీపీని ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను సోమవారం జారీ చేసింది.