ఆంధ్రప్రదేశ్‌

వైసీపీ కార్యకర్తలకే ‘భరోసా’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, అక్టోబర్ 14: అధికారంలోకి రాకముందు చెప్పిన మాటలకు, పదవిలోకి వచ్చాక చేస్తున్న పనులకు పొంతన లేకుండా, ప్రతి పథకంలోనూ సొంత పార్టీ కార్యకర్తలకే మేలు జరిగేలా జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తోందని టీడీపీ ఎమ్మెల్సీలు ఆరోపించారు. సోమవారం గుంటూరులోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన విలేఖర్ల సమావేశంలో ఎమ్మెల్సీలు చిక్కాల రామచంద్రరావు, నాగ జగదీశ్వరరావు, చెంగలరాయలు మాట్లాడుతూ రైతులను కూడా వర్గాలుగా విభజించడం జగన్‌కే చెల్లిందన్నారు. కొత్తగా అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం రుణమాఫీ అమలును పరిశీలిస్తున్నామని అసెంబ్లీ సాక్షిగా చెప్పి, కచ్చితంగా అమలు చేస్తామని హైకోర్టు ఎదుట అంగీకరించి, తరువాత అందుకు సంబంధించి గత ప్రభుత్వం ఇచ్చిన జీవో 38ని రద్దు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. రైతుల విషయంలో ఉదారంగా వ్యవహరించాల్సిన ప్రభుత్వం భరోసా పేరుతో వారిని మరింత మోసం చేసిందన్నారు.