ఆంధ్రప్రదేశ్‌

దుర్గమ్మ హుండీ ఆదాయం రూ. 2. 85 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఇంద్రకీలాద్రి) అక్టోబర్ 14: ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీకనకదుర్గమ్మ సన్నిధిలోని హుండీలను శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్ధానం ఈవో ఎంవీ సురేష్‌బాబు ఆధ్వర్యంలో ఆలయ సిబ్బంది లెక్కించగా 2కోట్ల, 85లక్షల, 25వేల, 600 రూపాయలు లభించాయి. శ్రీ మల్లికార్జున మహామండపం 6వ అంతస్తులో సోమవారం ఉదయం ఆలయ దసరామహోత్సవాలు ముగిసిన సందర్భంగా అమ్మవారి హుండీల లెక్కింపుకార్యక్రమాన్ని నిర్వహించగా ఈ నగదుతో పాటు 520 గ్రాముల బంగారం, 14 కిలోల వెండి లభించింది. మంగళవారం కూడ హుండీల లెక్కింపుకార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆలయాధికారులు తెలిపారు.