ఆంధ్రప్రదేశ్‌

అక్రమ కేసులపై విచారణ చేపట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 14: బీజేపీ కార్యకర్తలపై నమోదు చేసిన అక్రమ కేసులపై స్వతంత్ర విచారణ జరిపేలా ఆదేశించాల్సిందిగా రాష్ట్ర గవర్నర్‌ను పార్టీ నేతలు కోరారు. ఈ మేరకు బీజేపీ నాయకులు సోమవారం గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌ను ఆయన నివాసంలో వినతిపత్రం సమర్పించారు. అనంతపురం జిల్లా ధర్మవరం వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి స్థానికంగా చేస్తున్న అరాచకాలకు, దౌర్జన్యాలకు, దాడులకు, మారణకాండకు అడ్డేలేకుండాపోయిందన్నారు. ప్రభుత్వ వనరులను దోచేస్తూ రౌడీయిజం చేస్తూ కిడ్నాప్‌లను ప్రోత్సాహిస్తూ ప్రజలను దోచుకుంటున్నారన్నారు. ఈ దుర్మార్గాలను ప్రశ్నించిన బీజేపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టించి పోలీసులచే కొట్టించి వేధిస్తున్నారని ఆరోపించారు. భౌతికదాడులకు పాల్పడి కార్యకర్తల ఇళ్లు కూల్చివేసినట్లు చెప్పారు. తనను ప్రశ్నించిన విపక్షాల నాయకులను తుదముట్టించిన చరిత్ర వెంకటరామిరెడ్డిదన్నారు.