ఆంధ్రప్రదేశ్‌

ఉద్యోగ భద్రత కల్పించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 12: రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో అనేక సంవత్సరాలుగా పని చేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఏపీ మెడికల్ కాంట్రాక్టు ఎంప్లారుూస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రముఖులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఏఐటీయుసీ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు చలసాని వెంకట రామారావు, యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ మునెప్ప, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రకాష్ పుదోట శనివారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పాదయాత్ర సందర్భంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల సూపరింటెండ్లకు 15వ తేదీన వినతిపత్రాలు ఇవ్వాలని, 17న నిరసన ప్రదర్శనలు, 18న ధర్నాలు నిర్వహించాలని పిలుపు ఇచ్చారు. ఈ కార్యక్రమాలను అన్ని జిల్లా కేంద్రాల్లో, మండలాల్లో ఉన్న ఆసుపత్రుల్లో నిర్వహించాలని వారు పిలుపునిచ్చారు.