ఆంధ్రప్రదేశ్
రాఘవేంద్రుని సన్నిధిలో సుప్రీం కోర్టు న్యాయమూర్తి రస్తోగి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 10 October 2019
మంత్రాలయం, అక్టోబర్ 9: మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి దర్శనార్థం సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ అజయ్ రస్తోగి బుధవారం సతీసమేతంగా వచ్చారు. వారికి మఠం ధార్మిక అధికారి శ్రీపతి ఆచార్, సహాయ మేనేజర్ ఐపీ నరసింహమూర్తి స్వాగతం పలికారు. వారు ముందుగా గ్రామ దేవత శ్రీమంచాలమ్మను దర్శించుకుని హారతి ఇచ్చారు. అనంతరం శ్రీ రాఘవేంద్రస్వామి మూల బృందావనాన్ని దర్శించుకుని హారతి ఇచ్చి మొక్కులు తీర్చుకున్నారు. శ్రీ రాఘవేంద్ర స్వామి రచించిన శ్రీమన్మ్యాయ సుధాపరిమళ గ్రంథాలతో పాటు వివిధ గ్రాంథాల గురించి పీఠాధిపతి ఆయనకు వివరించారు.