ఆంధ్రప్రదేశ్‌

‘కోడికత్తి కేసు నిందితునికి ప్రాణహాని’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 23: వైఎస్ జగన్‌పై విశాఖ ఎయిర్‌పోర్టు ఆవరణలో వైఎస్ జగన్‌పై కోడికత్తితో దాడి చేసిన నిందితుడు శ్రీనివాసరావుకు ప్రాణహాని ఉందని రాజమహేంద్రవరం వన్‌టౌన్ పోలీసులకు అతడి సోదరుడు, న్యాయవాది ఫిర్యాదు చేశారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు అధికారులు శ్రీనివాసరావును నెల రోజులుగా వేధిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వన్‌టౌన్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదుచేసిన అనంతరం సోదరుడు సుబ్బరాజు, న్యాయవాది సలీమ్ మీడియాతో మాట్లాడారు. సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న శ్రీనివాసరావుకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. శ్రీనును కేరళ, లేదా బెంగాల్ జైలుకు తరలించాలని కోరారు. ఇప్పటికే తన క్లయింట్ శ్రీనివాసరావుపై పలుమార్లు దాడి జరిగిందని న్యాయవాది చెప్పారు.