ఆంధ్రప్రదేశ్‌

సర్ట్ఫికెట్ల పరిశీలనకు మరో చాన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ : సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు కాల్ లెటర్‌లో పేర్కొన్న తేదీల్లో సర్ట్ఫికెట్ల తనిఖీకి హాజరుకాకపోయినా, ఒరిజినల్స్ చూపకపోయినా రెండో అవకాశం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు జిల్లా సెలక్షన్ కమిటీలను పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజాశంకర్ ఆదేశించారు. సచివాలయ ఉద్యోగాల నియామక రాతపరీక్ష ఫలితాలు వెల్లడించడంతో నియామకాల ప్రక్రియ వేగంగా జరుగుతోంది. ఆయా జిల్లాల్లో భర్తీచేసే పోస్టుల సంఖ్య, రిజర్వేషన్ల ఆధారంగా కలెక్టర్ నేతృత్వంలోని జిల్లా సెలక్షన్ కమిటీలు వడబోత నిర్వహించి జాబితాలు తయారు చేస్తున్నాయి. ఇప్పటికే శ్రీకాకుళం, కృష్ణా, మరో రెండు జిల్లాల్లో ఎంపికైన అభ్యర్థుల మొబైల్ ఫోన్లకు సమాచారం అందిస్తున్నారు. సర్ట్ఫికెట్ల తనిఖీకి హాజరుకాకపోయినా, ఒరిజినల్స్ తేలేకపోయినా మరో అవకాశం ఇవ్వనున్నారు.