ఆంధ్రప్రదేశ్‌

టీటీడీ పాలక మండలిని రద్దు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, సెప్టెంబర్ 21: ప్రతిష్టాత్మకమైన టీటీడీ బోర్డుకు జగన్ ప్రభుత్వం జంబో పాలక మండలిని ఏర్పాటు చేయడం పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఆనంద్ సూర్య అభ్యంతరం వ్యక్తంచేశారు. ప్రపంచ దేశాల్లోనే అగ్ర పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతూ కోట్లాది మంది హిందువుల మనోభావాలకు స్ఫూర్తిగా నిలిచే ఈ పవిత్ర పుణ్యక్షేత్రం పవిత్రతను, ఆగమశాస్త్రం విలువలను మంటగొలిపే విధంగా ముఖ్యమంత్రి చర్యలు ఉన్నాయని శనివారం ఒక ప్రకటనలో ఆనందసూర్య విమర్శించారు. అంతేకాకుండా అన్యమతస్థులు శ్రీవారి ఏడుకొండల పవిత్రతకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్న విషయం ఇప్పటికే అనేక సందర్భాల్లో తేటతెల్లమైందన్నారు. ఈ జంబో పాలకమండలిని వెంటనే రద్దు చేసి, పీఠాధిపతులతోను, రాష్ట్రంలో ఉన్న రాష్టస్థ్రాయి అర్చక, బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులతోను దేవాలయ పాలకమండలిలను ఏర్పాటు చేయాలని డిమాండ్‌చేశారు. ముఖ్యంగా హిందువుల మనోభావాలు కాపాడే దిశగా స్వరూపానందేంద్ర స్వామి వారు దృష్టి సారించాలని కోరారు.