ఆంధ్రప్రదేశ్‌

కోడెలను వాడుకుని వదిలేశారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (సిటీ) : గత ఐదేళ్ల పాటు కోడెల శివప్రసాదరావు స్పీకర్‌గా ఉన్న సమయంలో ఆయనను వాడుకుని ఎన్నికల తరువాత చంద్రబాబు వదిలేశారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి విమర్శించారు. కోడెల చనిపోయిన తరువాత ఇప్పుడు చంద్రబాబు శవరాజకీయాలు చేస్తున్నారని బుధవారం ట్విట్టర్ వేదికగా ఆరోపించారు. కోడెల మరణాన్ని రాజకీయం చేసిన చంద్రబాబు ఆయన ఆత్మకు శాంతి లేకుండా చేస్తున్నారని దుయ్యబట్టారు. నమ్మినవారు ఆపదలో తనకు అండగా నిలవలేదన్న నిస్పృహతోనే కోడెల అత్మహత్య చేసుకున్నారని ట్విట్టర్‌లో కామెంట్ చేశారు.
టీడీపీ ఓ సర్కస్ ట్రూప్!
తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు ఓ సర్కస్ ట్రూపులా మార్చారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. జనాలు పోగవగానే చంద్రబాబు తన షోను ప్రారంభిస్తున్నారని విమర్శించారు. తాను అనుకున్న ఓ చోట బాబు టెంట్ వేస్తారనీ, జనం పోగవగానే షో మొదలవుతుందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.