ఆంధ్రప్రదేశ్
ఈఎస్ఐ డైరెక్టరేట్పై కార్మిక శాఖ దాడులు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 18 September 2019
విజయవాడ, సెప్టెంబర్ 18: ఈఎస్ఐ ఆసుపత్రుల్లో మందుల కొనుగోళ్లలో వందల కోట్ల కుంభకోణం జరిగినట్లుగా అధికారుల దాడుల్లో వెల్లడయింది. కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి బీ ఉదయలక్ష్మి నేతృత్వంలో ఈఎస్ఐ డైరెక్టరేట్లో అధికారులు బుధవారం ప్రారంభించిన దాడుల్లో ఈ కుంభకోణం వెలుగుచూసింది. అయితే ఇంకా తనిఖీలు కొనసాగుతున్నందున ఏ మేరకు కుంభకోణం జరిగింది ఇప్పుడే చెప్పలేమని ఉన్నతాధికారులు చెబుతున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం మందులు సరఫరా చేయకుండానే కోట్లాది రూపాయలను దోచుకున్నట్లుగా ప్రాథమిక పరిశీలనలో వెల్లడైంది. మందులతోపాటు వైద్య సామగ్రి కొనుగోళ్లలో కూడా అక్రమాలు జరిగినట్లు తెలుస్తోంది.