ఆంధ్రప్రదేశ్‌

సర్వీసులో మరణిస్తే కుటుంబంలో ఒకరికి కండక్టర్ ఉద్యోగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 18: రెండువేల పదమూడో సంవత్సరం జనవరి ఒకటో తేదీ తర్వాత సర్వీస్‌లో మరణించిన ఆర్టీసీ సిబ్బంది కుటుంబంలో ఒకరికి కండక్టర్ ఉద్యోగం ఇవ్వనున్నట్లుగా ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ ఎన్‌వీ సురేంద్రబాబు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేర 13 జిల్లాల్లో రీజనల్ మేనేజర్‌లకు ఉత్తర్వులు వెళ్లాయి. ఇందుకు 45 ఏళ్ల లోపు ఉన్న వారు అర్హులు. అక్టోబర్ 12వ తేదీ వరకు భర్తీ ప్రక్రియ పూర్తవుంది. 26వ తేదీ వైద్య పరీక్షలు, 28వ తేదీ నుంచి జోనల్ శిక్షణ కళాశాల్లో శిక్షణ ఉంటుంది. తొలి విడతగా గత నెలలో ఆరుగురికి డ్రైవర్లు, 143 మందికి కండక్టర్ పోస్టులు రాగా రెండో విడతగా ఈ దఫా 1200 కుటుంబాలకు న్యాయం జరగనున్నది. ఈ సందర్భంగా నేషనల్ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పీవీ రమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి వై శ్రీనివాసరావు ఓ ప్రకటనలో సంస్థ ఎండీ సురేంద్రబాబుకి కృతజ్ఞతలు తెలిపారు.