ఆంధ్రప్రదేశ్‌

ప్రజలకు మాత్రమే జవాబుదారులం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ), సెప్టెంబర్ 14: తాము ప్రజలకు మాత్రమే జవాబుదారులమని, టీడీపీ దొంగలకు మాత్రం కాదని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీనేత విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. గత టీడీపీ ప్రభు త్వం చేసిన అవినీతిని అతి త్వరలోనే బయటకు తీసుకువస్తామని శనివారం ట్విట్టర్‌లో ప్రకటించారు. టీడీపీ నేతలు, ముఖ్యంగా దేవినేని ఉమా కొద్ది రోజులు ఓపిక పడితే రివర్స్ టెండర్లు, జ్యుడిషియల్ కమిషన్ వల్ల ఫలితాలు ఎలా ఉంటాయో తెలుస్తుందన్నారు. టీడీపీ హయాంలో జరిగిన వేల కోట్ల రూపాయల దోపిడీ చిట్టాను త్వరలోనే బయటపెడతామన్నారు. రాబోయే నాలుగేళ్లలో ఏపీలో అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తామని జగన్ ఇచ్చిన మాటను ఆయన గుర్తు చేశారు.
మోదీ, షాల కంటే చంద్రబాబే ముఖ్యమా
బీజేపీలో ఈ మధ్యే చేరిన కొందరు నేతలకు మోదీ, అమిత్‌షాల కంటే చంద్రబాబే ముఖ్యమయ్యారని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడిని, కార్యదర్శులను పక్కకు నెట్టిన బాబు కోవర్టులు ఇప్పుడు ఆ పార్టీని చేతుల్లోకి తీసేసుకుంటున్నారని ఆరోపించారు. బీజేపీ నేత సుజనా చౌదరి నేతృత్యంలో మొన్న గవర్నర్‌ను కలిసిన బృందాన్ని పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుందన్నారు.
విప్లవాత్మక మార్పులకు శ్రీకారం
ఏపీలోని విద్యావ్యవస్థలో వైసీపీ ప్రభుత్వం సమూల మార్పులు తీసుకురాబోతుందని విజయసాయిరెడ్డి తెలిపారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమ్మఒడి పథకం ఎంతో మందికి చేయూతను ఇస్తుందన్నారు. గత ప్రభుత్వాలు విద్యావ్యవస్థను సర్వనాశనం చేశాయన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో భాగంగా సీఎం జగన్ విద్యాశాఖలో సంస్కరణలకు శ్రీకారం చుట్టారని చెప్పారు. రోడ్డు భద్రత, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలు ప్రతి తరగతిలో తప్పని సరి చేయనున్నట్లు ప్రకటించారు. వచ్చే విద్యాసంవత్సరం నుండి ఇవి అమల్లోకి వస్తాయని వివరించారు.

*చిత్రం... వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి