ఆంధ్రప్రదేశ్‌

36 గంటల్లో అల్పపీడనం : కోస్తాకు వర్ష సూచన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఆగస్టు 23: వాయువ్య బంగాళాతంలో ఒడిశా, పశ్చిమబంగ తీరాన్ని ఆనుకుని 1.5 కిమీ నుంచి 4.5 కిమీ వరకూ ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది రాగల 36 గంటల్లో అల్పపీడనంగా బలపడనుందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు శుక్రవారం రాత్రి తెలిపారు. దీనికి అనుబంధంగా ఒడిశా నుంచి కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతోందన్నారు. వీటి ప్రభావంతో రాగల 24 గంటలో కోస్తాంధ్ర, ఒడిశాల్లో ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని, ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. తీరం వెంబడి పశ్చిన దిశ నుంచి గంటకు 15 నుంచి 20 కిమీ వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు.