ఆంధ్రప్రదేశ్
దుర్గగుడి ఈవో బదిలీ?
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
విజయవాడ, ఆగస్టు 20: దుర్గగుడి ఈవో కోటేశ్వరమ్మ బదిలీ కానున్నారు. ఆ స్థానంలో అన్నవరం దేవస్థానంలో కార్యనిర్వాహణాధికారిగా పని చేస్తున్న సురేష్ బాబును నియమించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. దసరా ఉత్సవాల ముందు ఈ బదిలీ ప్రచారం ఆలయవర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈవో కోటేశ్వరమ్మను బదిలీ చేసేందుకు కొంతమంది దేవదాయ శాఖ మంత్రిపై ఒత్తిడి తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. దసరా ఉత్సవాల సందర్భంగా అనేక కాంట్రాక్టులను అస్మదీయులకు కట్టబెట్టేందుకు వీలుగా ఈ బదిలీ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. దుర్గగుడి ఈవోగా బాధ్యతలు స్వీకరించాక అనసరపు వ్యయంపై దృష్టి సారించారు. 2017లో దసరా ఉత్సవాలకు దాదాపు 16 కోట్ల రూపాయలు ఖర్చు కాగా, 2018లో దానిని దాదాపు 10 కోట్ల రూపాయల మేరకు తగ్గించారు. ఫిక్స్డ్ డిపాజిట్లు గణనీయంగా ఆమె హయంలో పెరిగాయని, ఉత్సవాల సమయంలో జాపికల వ్యవహారంలో అక్రమాలకు కూడా తెరదించారని గుర్తు చేస్తున్నారు. దసరా సమయంలో కాంట్రాక్టులను తమ వర్గీయులకు కట్టబెట్టేందుకు వీలుగా ఈవోను బదిలీ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. నిజాయితీ కలిగిన అధికారిపై ఉత్సవాల ముందు బదిలీ వేటు సరికాదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.