జాతీయ వార్తలు

370 ఆర్టికల్‌పై రాహుల్ వైఖరి చెప్పాలి:అమిత్‌షా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు తరువాత ప్రధాని మోదీ పాకిస్థాన్‌కు గట్టి బుద్ది చెప్పారని, కశ్మీర్ భారత్ అంతర్భాగమని ప్రపంచానికి చాటిచెప్పారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా తెలిపారు. ఆయన జార్ఖండ్‌లోని జంతర్‌లో జరిగిన జన ఆశీర్వాద యాత్రలో మాట్లాడుతూ ఆర్టికల్ 370 ఆర్టికల్‌పై రాహుల్ తన వైఖరి తెలిపాలని అన్నారు. సర్జికల్ దాడులను వ్యతిరేకించారు. అలాగే వాయు దాడులను సైతం వ్యతిరేకించారు. కాబట్టి రాహుల్ ఈసారి రాష్ట్రాల్లో పర్యటన జరిపేటపుడు తన వైఖరి తెలపాలని కోరారు. ప్రజలను ఏ దిశగా నడపాలని అనుకుంటున్నారో తెలపాలని కోరారు. జన ఆశీర్వాద్ యాత్ర వల్ల రాబోయే ఎన్నికల్లో సంపూర్ణ మెజార్టీ దిశగా వెళుతున్నామని తెలిపారు.