రాష్ట్రీయం

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఇంజనీర్లు దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జి.కొండూరు, డిసెంబర్ 6: కృష్ణా జిల్లా జి కొండూరు మండల పరిధిలోని వెంకటాపురం - కుంటముక్కల గ్రామాల మధ్య వున్న వంతెన వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పొరుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు ఇంజనీర్లు దుర్మరణం పాలయ్యారు. శనివారం రాత్రి 12 గంటల సమయంలో బైక్‌పై వెళుతున్న వీరు వెంకటాపురం - కుంటముక్కల గ్రామాల మధ్య గల వంతెన వద్దకు రాగానే ప్రమాదానికి గురయ్యారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన గోబింద సజల్ పాల్ (24) అనే మెకానికల్ ఇంజనీర్, ఒరిస్సా రాష్ట్రంలోని బరంపురానికి చెందిన సాగర్ దల్ బెహర (27) అనే ఇద్దరు యువకులు కొండపల్లిలోని హెచ్‌పి కంపెనీలో ప్రాజెక్ట్ వర్క్ కోసం వచ్చారు. వీరు స్నేహితుడి దగ్గర శనివారం సాయంత్రం 6 గంటల సమయంలో ద్విచక్ర వాహనం తీసుకుని వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. వంతెన వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న వాహనాల లైట్ల ఫోకస్‌కు వంతెన మార్జిన్ గమనించలేక ప్రమాదానికి గురయ్యారు. విగతజీవులుగా పడివున్న వీరిని ఆదివారం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.