శిప్ర వాక్యం

మోదీ ఎజెండాకు విపక్షాల మోకాలడ్డు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశ సమగ్రతను కాపాడండి, విచ్ఛిన్నకర శక్తులను ఓడించండి’- అంటూ 2014 ఏప్రిల్ 14న అప్పటి యూపీఏ చైర్‌పర్సన్, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ భారత జాతికి పిలుపునిచ్చారు. వెంటనే తులసిరెడ్డి అనే కాంగ్రెస్ నాయకుడు స్పందిస్తూ, ‘తెలుగు రాష్ట్రాన్ని ముక్కలుచేసి సోనియా దేశ సమగ్రత కోసం పిలుపునివ్వటం ఏమిటి?’ అని సూటిగా ప్రశ్నించారు. అప్పట్లో దేశ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ కశ్మీరు సమస్యను ఐక్యరాజ్యసమితికి నివేదించారు. ఆయన నిర్వాకం ఫలితంగా అందాల నందనవనమైన కశ్మీరు ఇప్పటికీ రక్తం ఓడుతున్నది. ఏ క్షణంలో అయినా కశ్మీర్ ప్రాంతం పాకిస్తాన్‌లో కలిసిపోవచ్చునన్న ఆందోళన భారత ప్రజల్లో నెలకొంది.
అప్పటి నెహ్రూ నుండి ఇప్పటి సోనియా వరకు దేశసమగ్రతను కాంగ్రెస్ ప్రభువులెవ్వరూ దృష్టిలో పెట్టుకోలేదు. ప్రధానిమంత్రిగా తిరుగులేని అధికారం చెలాయిస్తున్న రోజుల్లో ఇందిరా గాంధీ పంజాబ్‌లో భింద్రేన్‌వాలా అనే విష సర్పాన్ని పాలుపోసి పెంచగా, సోనియా గాంధీ 2014లో జుమా మసీదు ఇమాం (్ఢల్లీ) బుఖారీని కలిసి, తాను ఇవ్వవలసిన హామీలు ఇచ్చి మూకుమ్మడిగా ముస్లిం ఓట్లను కొల్లగొట్టడానికి ఆయన చేత ప్రకటన చేయించారు. ఇదంతా ఉగ్రవాదాన్ని ప్రత్యక్షంగా పోషించడం కాదా?
రాజకీయాల్లో విమర్శలు, ఆరోపణలు తప్పవు. ముఖ్యంగా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ ‘వేడి’ మరీ తీవ్రంగా ఉంటుంది. దాన్ని ‘్ఫరిన్’ (విదేశీ ప్రభావంతో) హీట్‌గా మనం పరిగణించాలి. నేను విద్యార్థి దశలో ఉండగా ఆచార్య రంగా ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూను విమర్శించటం చాలా సభలల్లో విన్నాను. అలాగే మొరార్జీదేశాయ్ ఇందిరాగాంధీని విమర్శించిన సభలకు కూడా హాజరైనాను. కాని వారు వాడిన భాష చాలా ఔచితీ పూర్వకంగా, ఎంతో సభ్యతగా ఉండేది. మరి.. ఇవాళ్టి పరిస్థితి ఏమిటి? విపక్ష పార్టీల నేతల దృష్టిలో ప్రధాని నరేంద్ర మోదీ ఓ నర రూప రాక్షసుడు! ఆయన అవినీతిపరుడట. మాయావతి, వేణీప్రసాద్ వర్మ, రాహుల్ గాంధీ, చాకో వంటి కమ్యూనిస్టులు, సమాజ్‌వాదీ పార్టీ వారు ఒకరేమిటి అందరూ ఇలా తిట్లకు దిగారు. వీరంతా రాజకీయాల్లో పవిత్రులేనా? విమర్శలకు అతీతులా?? గాజు ఇళ్ళల్లో ఉన్నవారు ఇతరుల ఇళ్లమీద రాళ్లు వేస్తే ఏమవుతుందో ఈ నేతలు దేశ ప్రజలకు చెప్పాలి.
అలనాడు పుచ్చలపల్లి సుందరయ్య, వావిలాల గోపాలకృష్ణయ్య, టంగుటూరి ప్రకాశం పంతులు వంటి నాయకులు సిద్ధాంతాల ప్రాతిపదికగా రాజకీయాలు నడిపారు. ఏనాడూ వారు తమ ప్రత్యర్థులపై వ్యక్తిగత విమర్శలు చేయలేదు. పాతతరం నేతలెవరూ ఇలాంటి ‘వెర్బల్ టెర్రరిజాని’కి పా ల్పడిన దాఖలాలు లేవు. రాజకీయంగా ఎలాంటి విభేదాలున్నా ఒకప్పటి నాయకులు విలువలకు, సంప్రదాయాలకు ప్రాధాన్యత ఇచ్చారు.
భారత ప్రధానిగా ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్ దాదాపు పది సంవత్సరాలు ‘్ధృతరాష్ట్ర’ పాత్ర పోషించారు. ఆయన పదవిలో ఉన్నన్నాళ్లూ సమర్ధుడైన ప్రధాని లేని లోపం స్పష్టంగా మనకు కన్పడింది. ప్రధాని హోదాలో ఉన్న నేత ఎవరైనా ప్రధానంగా ఎదుర్కోవలసిన తొలి సమస్య ఉగ్రవాదం. చాలాకాలంగా ఒక వైపు చైనా, మరొకవైపు పాకిస్తాన్ భారత్‌పైకి కయ్యానికి కాలు దువ్వుతున్నాయి. మన దేశంలో చిన్నాచితక పార్టీలన్నీ కలిసి వందకు పైగానే ఉండవచ్చు. వీరు పరస్పర హననానికి సిద్ధపడుతున్నారే కలిసి పనిచేయాలనే దృక్పథం లేదు.
ప్రధాని నరేంద్ర మోదీకి నేడు బయటి నుండి, లోపలి నుండి కూడా పెను సవాళ్లు ఎదురవుతున్నాయి. భాజపాలో సుష్మా స్వరాజ్, ఎల్‌కె అద్వానీ వంటి నేతలు మనస్ఫూర్తిగా ఆయనకు సహకారం అందిస్తున్నారని చెప్పలేని పరిస్థితి నెలకొంది. బయట నుండి ములాయం సింగ్ యాదవ్, నితీశ్‌కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్, అజిత్‌సింగ్, ఫరూఖ్ అబ్దుల్లా, కేజ్రీవాల్ వంటివారు మోదీని ముందుకు సాగనివ్వరు. కమ్యూనిస్టు పార్టీల వారు అదేపనిగా అల్లర్లు, ఆందోళనలు మొదలుపెడతారు. ‘్భరత్ వెలిగిపోతోంది..’ అని ప్రధానిగా ఉన్న కాలంలో అటల్ బిహారీ వాజపేయి అన్నపుడు- ‘్భరత్ వెలిసిపోతోంది..’ అని సీపీఎం నాయకుడు ఏచూరి సీతారాం విమర్శించారు. ప్రధాని ఎవరైనా భాజపా పట్ల కమ్యూనిస్టుల ధోరణి మారలేదు. అందుకే మోదీకి కేరళ, బెంగాల్, త్రిపుర ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్ వంటి ప్రాంతాల నుండి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. రాబోయే రోజుల్లో ఈ ప్ర తిఘటనను మోదీ ఎలా ఎదుర్కొంటారో చూడవలసి ఉంది. ఇక రాజకీయంగా పరాజితులైన కాంగ్రెస్ నాయకులు చేతులు ముడుచుకుని కూర్చోరు. సెక్యులరిజానికి ప్రమాదం ఏర్పడిందనే నినాదంతో దేశంలోని ముస్లిం మత శక్తులను రెచ్చగొడుతారు. ముస్లింలపై ఏదైనా చర్య తీసుకుంటే అరబ్ దేశాల నుండి చమురు సరఫరా నిలిచిపోతుంది. మోదీ వైఖరి వల్లనే చైనా, పాకిస్తాన్‌లతో భారత్‌కు యుద్ధం తప్పదని కాంగ్రెస్ నాయకులు దేశవ్యాప్తంగా ప్రజలను రెచ్చగొడతారు. మాయావతి, శరద్ పవార్, మమతా బెనర్జీ, సిద్ధరామయ్య వంటి నాయకులు భాజపాకు ఇబ్బందులు కలిగించటం సహజం. విదేశాలలో దాచిన నల్లధనాన్ని భారత్‌కు తరలిస్తే సోనియా గాంధీ సహా మిగతా ‘నల్లకుబేరులు’ ఎందుకు ఊరుకుంటారు? వీరి నుంచి మోదీ మరో తీవ్రమైన సమస్యను ఎదుర్కోవలసి వస్తుంది. ప్రాంతీయ వాదాన్ని రెచ్చగొట్టేందుకు సైతం కొందరు విపక్ష నేతలు ప్రయత్నించే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు భాజపా ఎంతోకొంత కృషి చేసింది. అలాంటప్పుడు ప్రత్యేక విదర్భ, ప్రత్యేక గూర్ఖాలాండ్, ప్రత్యేక జమ్మూ, ప్రత్యేక పూర్వాంచల్, ప్రత్యేక బుందేల్‌ఖండ్ వంటి చిన్న రాష్ట్రాల ఆవిర్భావానికి ఉద్యమాలు ఊపునందుకుంటాయి. ఏపీలో రాయలసీమను వేరుచేయాలని బైరెడ్డి రాజశేఖరరెడ్డి వంటి నాయకులు మరో ఉద్యమం మొదలుపెట్టవచ్చు. ప్రత్యేక రాష్ట్రాల ఏర్పాటు పేరిట విపక్షాలు ఆందోళనలు రగిలిస్తే ఆ పరిణామాలు మోదీకి సవాల్‌గా పరిణమించవచ్చు.
మరోవైపు చైనా ప్రేరేపిత ఉగ్రవాదాన్ని నరేంద్ర మోదీ ఎలా ఎదుర్కోగలడు? విచ్ఛిన్నమైన భారత ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి కనీసం పది సంవత్సరాలు పడుతుంది. అనే్నళ్లూ కాంగ్రెస్ వారూ, కమ్యూనిస్టులూ ఈ ప్రధానిని పదవిలో క్షేమంగా ఉండనిస్తారా? అందుకే మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాక కొన్ని ప్రాంతాల్లో ఆందోళనలు ఇంకా రగులుతూనే ఉన్నాయి. స్వపరిపాలన (సెల్ఫ్ గవర్నెన్స్), సుపరిపాలన (గుడ్ గవర్నెన్స్), స్థిర పరిపాలన (స్టేబుల్ గవర్నెన్స్).. ఈ మూడు ఈనాడు భారతదేశానికి ఎంతో అవసరం.
మతం మార్పిడులను అడ్డుకుంటే ‘మోదీ హిందూ మతోన్మాది’ అంటారు. అడ్డుకోకపోతే దేశంలో హిందువులు మైనారిటీలోపడి పోతారు. ఫలితంగా రామ రాజ్యానికి బదులు ‘రోము రాజ్యం’ వస్తుంది. అయోధ్యలో రామమందిర నిర్మాణం అంత సులభం కాదు. అలాగే, ఆర్టికల్ 370ని రద్దుచేయాలంటే పార్లమెంటులో మూడింట రెండు వంతుల మెజారిటీ కావాలి. ప్రస్తుత పరిస్థితుల్లో కామన్ సివిల్ కోడ్ కూడా సాధ్యం కాని పనే. ఆర్టికల్ మూడు ఇప్పటికే దుర్వినియోగానికి గురైంది. ఇలా ఏ రకంగా చూసినా గత ఎన్నికల ముందు భాజపా ప్రకటించిన మేనిఫెస్టోను పూర్తిస్థాయిలో అమలు చేయటం అంత సులభం కాదు. గుజరాత్ తరహా అభివృద్ధి బెంగాల్, ఝార్ఖండ్‌లలో జరిగే అవకాశాలు లేవు. కొత్త పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలు ఎవరైనా వౌలిక సదుపాయాలు, భూ సేకరణ, విద్యుత్ నీటివనరులతోపాటు భద్రత విషయాన్ని కూడా చూసుకుంటారు. అది అన్నింటికన్నా ముఖ్యం. ఆందోళనలు, నిరసనలు నిత్యకృత్యమైతే పెట్టుబడులు పెట్టేందుకు ఎవరు ముందుకొస్తారు. సీమాంధ్ర కొత్త రాజధానిని హైదరాబాద్ స్థాయిలో నిర్మించాలంటే ఐదు లక్షల కోట్ల రూపాయల నిధులు, యాభై ఏళ్ళ సమయం అవసరం. ప్రాంతీయ పార్టీల ప్రభుత్వాల నుంచి ఎదురయ్యే సవాళ్లను, డిమాండ్లను ప్రధాని ఎలా ఎదుర్కొంటారో చూడాలి. మోదీ చేతిలో మంత్రదండం ఏదీ లేదు. దేశంలోని విభిన్న ప్రాంతీయ, మత, కుల సమీకరణలు ఆయనను ముందుకు పోనివ్వవు.
*