S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భాస్కర వాణి

06/07/2019 - 01:50

గత ఏడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస భారీ విజయం సాధించాక కేసీఆర్ ఓ ఆసక్తికర వ్యాఖ్య చేసారు. ‘జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు చక్రం తిప్పుతారట కదా!’- అన్న పాత్రికేయులకు సమాధానం చెప్తూ ‘చంద్రబాబు నాయుడుకు రెండు హిం దీ ముక్కలు సక్కగ మాట్లాడనీకె రాదు; ఏం చెక్రం దిప్పుతడయా? ఊకెనె దిరుగుతాది చక్రం?’’ అని వ్యంగ్యంగా అన్నారు. పాత్రికేయులు, అక్కడున్న వాళ్లంతా గొల్లున నవ్వారు. నిజమే!

03/08/2019 - 01:45

‘ధ్వనికి ప్రతిధ్వని తప్పదు. ఇది అందరికీ తెలిసిన సత్యమే. ఈ రోజు నేను ఒక వ్యక్తిపై ఎమోషన్స్ వెళ్లగక్కితే, మళ్లీ నాకు అవి ఒక రోజు తప్పవు’ - అని ఓ ప్రసిద్ధ మానసిక తత్వవేత్త అన్నారు. ఇపుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూస్తే అలాంటి ఎమోషన్స్ రెచ్చగొట్టి ఎన్నికల్లో విజయం సాధించాలని తెదేపా అధినేత, సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని సర్వే సర్వత్రా విన్పిస్తున్నమాట.

03/01/2019 - 01:41

భారత్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఆర్పీజీ గ్రూప్ అధినేత హర్షగోయెంకా సోషల్ మీడియాలో ఓ ఫొటోను ట్వీట్‌చేసాడు. అది చాలా ఆసక్తికరంగా ఉంది. గుజరాత్‌లోని మీరట్ పట్టణంలో ఓ ధనవంతుల పెళ్లి ఊరేగింపు చాలా అంగరంగ వైభవంగా సాగుతున్నది. పెళ్లికొడుకు గుర్రంపై ఎక్కి ఊరేగింపుగా వస్తున్నాడు. అయితే విచిత్రంగా ఆ పెళ్లి కుమారుడికి ఓ శవయాత్ర ఎదురయ్యింది. శవం అడ్డురావడం శకునాల్లో మంచిదంటారు.

02/15/2019 - 01:23

పృథ్వీరాజ్ చౌహాన్ మన దేశంపైకి దండెత్తి వచ్చిన మహమ్మద్ ఘోరీని పదహారుసార్లు క్షమించడం నిర్హేతుకం. పదిహేడవసారి అతనికి అవకాశం దొరికింది. దాంతో ఈ దేశంలో విదేశీ శక్తులకు సంపూర్ణంగా బీజం పడింది. ఆనాటి నుండి భారత్ అనేక యుద్ధాలను ఎదుర్కొన్నది. ఇక్కడున్న హిందూ సమాజం మతపరమైన దమనకాండను తట్టుకొని అస్తిత్వాన్ని నిలబెట్టుకొంది.

02/08/2019 - 03:15

ఓ కుమారుడు తండ్రిని- ‘నాన్నా! ఒట్టు అంటే ఏంటి?’ అని ప్రశ్నించాడట. ‘పచ్చి అబద్ధాన్ని నిజమని నమ్మించేందుకు తరతరాలుగా వాడుతున్న టెక్నిక్‌రా కన్నా!’ అన్నాట్ట ఆ తండ్రి. మన దేశంలో అబద్ధాన్ని అతికినట్లు చెప్పేందుకు ఓ వర్గం మీడియా, దాని వెనుకున్న రాజకీయ వర్గాలు పడరాని పాట్లు పడుతున్నాయి. దొంగే ‘దొంగా దొంగా!’ అని అరుస్తుంటే నోళ్లువెళ్లబెట్టి చూడటం తప్ప ఇంకేం చేయలేని దుస్థితి.

01/31/2019 - 22:55

ఇజ్రాయిల్ స్వతంత్ర దేశంగా ఏర్పడ్డాక అక్కడి ప్రజాప్రతినిధుల మొదటి సభ ఓ ఆశ్చర్యకరమైన వ్యాఖ్య చేసింది. ‘్భరత్‌కు ధన్యవాదాలు.. ప్రపంచంలోని అన్ని వర్గాలచే అత్యాచారానికి గురైన మా జాతి, ఒక్క భారత్ నుండే అలాంటి పరిస్థితి ఎదుర్కోలేదు..’ అన్న ఆ మాటను ఒక్కసారి- భారత్‌ను, హిందుత్వను ధ్వంసం చేయాలనుకొనే శక్తులు గుర్తుతెచ్చుకోవాలి.

01/24/2019 - 23:10

‘శత్రువును జయించాలంటే యుద్ధం చేయాల్సిన అవసరం లేదు; దుష్ప్రచారం చేస్తే సరిపోతుంది’ అన్న సూత్రం కొన్ని రాజకీయ పక్షాలకు బాగా వంటబట్టింది. దేశంలో సరికొత్త అనుమానాలను పుట్టించి ప్రజల్లో ఆందోళన కలిగించడం రాజకీయ వ్యూహం. కానీ, ప్రజాస్వామ్యం పరువు బజారున పడుతోందన్న విషయాన్ని వీళ్లు విస్మరించారు. వాళ్లకు అధికారం తప్ప దేశం అవసరం లేదు. ఎలాంటి ధ్వంసరచన చేసైనా గద్దెనెక్కడం అధికార దాహార్తుల అసలు లక్ష్యం.

01/18/2019 - 02:16

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు మరణించడానికి పదిరోజుల ముందు కొన్ని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చివరి రోజుల్లో తాను విడుదల చేసిన ఓ క్యాసెట్టుకు ‘జామాతా దశమగ్రహం’ అని పేరు కూడా పెట్టారు.

01/11/2019 - 01:26

నియంత అడాల్ఫ్ హిట్లర్ ప్రజల్లో తన పలుకుబడి సన్నగిల్లినప్పుడల్లా తన అనుచరులకు ‘దేశం ప్రమాదంలో ఉందని పదే పదే ప్రచారం చేయండి’ అని చెప్పేవాడట. ఒకే అబద్ధాన్ని వందలసార్లు చెప్పి కొంతమందికైనా అది నిజం అనిపించేటట్లు చేయడం హిట్లర్ విధానం. ఈ అబద్ధపు ప్రచారం ఎక్కువగా తన ముఖ్య అనుచరుడైన గోబెల్స్‌తో చేయించేవాడు. దీనికే ‘గోబెల్స్ ప్రచారం’ అని పేరు.

01/04/2019 - 01:54

సెక్యులర్ రాజనీతి వ్యవస్థలో కులం, మతం, ప్రాంతం, భాష, ఉత్తర- దక్షిణ, ఆర్య-ద్రవిడ.. ఇలా ఎన్నో విధ్వంసకర ఆయుధాలుంటాయి. వీటిని ఆ ‘సెక్యులర్ గుంపు’ ప్రత్యర్థులపై ప్రయోగిస్తుంది. నేడు ‘సెక్యులర్’ ముసుగులో బతికే అన్ని రాజకీయ వ్యవస్థలకు వేర్లు బలంగానే వున్నాయి. కళలు, సాహిత్యం, పాత్రికేయ, మేధారంగంలో వాళ్లకు ‘రెడీమేడ్ సిలబస్’ ఉంది. కానీ, జాతీయవాద దృక్పథం వున్న పార్టీలకు వాటి లోతుపాతులు తెలియవు.

Pages