S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
సబ్ ఫీచర్
సంకల్పం గట్టిగా వుంటే అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయొచ్చు అని నిరూపించింది పశ్చిమ బెంగాల్కు చెందిన సుభాషిణి మిస్ర్తి. నోట్లోకి ఐదువేళ్లు పోవటమే గగనమైన ఓ నిరుపేద మహిళ పేదల కోసం ఆసుప్రతి కట్టించి వారికి ఐదువేల రూపాయలకే ఆపరేషన్లు చేయస్తోంది. మానవతకు నిలువెత్తు నిదర్శనం. ఎందరికో స్ఫుర్తిదాయకం. మరెందరికో మార్గదర్శకం.
అతివేగంగా ఉరుకులు పరుగుల బిజీ జీవితంలో ఉక్కిరి బిక్కిరి అవుతున్న మనం రోజంతా హుషారుగా అన్ని పనులు సమర్థవంతంగా పూర్తిచేసుకోవాలనుకోవడం సమంజసమే..! కాని అలా హుషారుగా ముందుకు సాగాలంటే మనం శారీరకంగా, మానసికంగా చురుగ్గా ఉండాలి. మత్తుగా నీరసంగా వుంటే ఏ పనీ ఆసక్తిగా సంపూర్తిగా చేయడం కుదరదు. రోజంతా హుషారుగా కొనసాగాలంటే దానికి తగిన మానసిక శారీరక శక్తి అవసరం.
జంతువులను వధిస్తూ పోతుంటే కొన్నాళ్లకు అవి పూర్తిగా అంతరించిపోతాయి. జంతువధ అమానుషం అయినా దీనిని గురించి పట్టించుకున్నవారంతగా లేరు. ఇది శోచనీయం, ఆందోళనకరం అంటూ వాపోతుంది సోనాలి పురెవలి... మాటలనడంతో సరిపెట్టుకోలేదు. ఆ మాటలను చేతలలో చూపించడం కోసం నడుం బిగించింది, పోరాడింది. చివరికి విజయం సాధించింది.
శ్రీరాముడు భారతీయులకు ఆదర్శప్రాయమైన ఆరాధ్య దైవం. త్రేతాయుగంలో పవిత్ర సరయూనది ఒడ్డున గల అయోధ్యా నగరాన్ని ఇక్ష్వాకు వంశీయులు దాదాపు నలుబది మంది రఘు వంశ రాజులు పాలించారు. వారిలో మొదటిరాజు చతుర్ముఖ బ్రహ్మ, చివరివారు కుశలవులు. ఇందులో రఘు వంశానికి వన్న తెచ్చిన వారు మరీచి, కశ్యపుడు, త్రిశంకు, మాంధాత, సగరుడు, దిలీపుడు, భగీరథుడు, అంబరీషుడు, నహుషుడు, యయాతి, అజుడు, రామలక్ష్మణులు.
ప్రతిరోజూ 45 నిమిషాలు నడక నడిస్తే శరీరంలోని కొవ్వును దీర్ఘకాలం తగ్గడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా రక్తపీడనాన్ని, శ్వాసక్రియ సామర్థ్యాన్ని పెంచుతుంది. నడక వ్యాయామంపట్ల శ్వాసక్రియ పెరిగి గుండె వేగంగా రక్తాన్ని తోడి శరీర భాగాలకు పంపుతుంది. ఆ విధంగా ఆక్సిజన్ వినియోగమవుతుంది. వృద్ధాప్యంలో అనేక జబ్బులు వ్యాయామ లోపంవల్ల, అనారోగ్యకరమైన భోజనపు అలవాట్లు, మద్యపానం, ధూమపానంవల్లనే వస్తాయి.
సమాజంలో నైతిక విలువలతోపాటు, మానవ సంబంధాలు కూడా నానాటికి తగ్గిపోతున్నాయని అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నవారే. అయితే అందుకు గల కారణాలను విశే్లషించి, తదనుగుణంగా వ్యవహరించడానికి మాత్రం ఎవరూ సిద్ధంగా లేకపోవడం గమనార్హం. పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం వలన స్మార్ట్ఫోన్లు, ఇంటర్నెట్ సౌకర్యం దాదాపుగా అందరికీ అందుబాటులోకి వచ్చాయి. ఇంటర్నెట్ దాదాపుగా అందరికీ అందుబాటులోకి రావడం ఒక సంచలనమే.
కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్న తాగుడుపై మహిళల పోరాటం విజయవంతమైంది. రాజస్థాన్లోని కచ్చాబాలే అనే గ్రామం మద్య నిషేధంలో దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది. ఈ గ్రామ సర్పంచ్ సీతాదేవి లేవదీసిన ఉద్యమం విజయవంతమై అధికారులు గ్రామానికి వచ్చి మద్యం దుకాణాల మూసివేతపై ఓటింగ్ నిర్వహించాల్సి రావటం అతివల విజయంగా చెప్పవచ్చు. గ్రామం లో మద్యం దుకాణాలు ఉండాలా?వద్దా? అనే అంశంపై ఓటింగ్ నిర్వహించగా..
ఇంగ్లీషులో ఓ సామెత కూడా వుంది. ‘ది ఛైల్డ్ ఈజ్ ఫాదర్ ఆఫ్ ది మాన్’ అని. చిన్నప్పుడే పిల్లలలో దేశభక్తిని, దైవభక్తినీ, మంచిభావాలని వారి మనసుల్లోకి కథలరూపంలో ఎక్కిస్తే దేశభక్తులుగా దైవభక్తులుగా మంచి భావాలతో పెరిగిన పిల్లలు భవిష్యత్తులో తప్పటడుగులు వెయ్యరు, మంచి పౌరులుగా తయారవుతారు.
ఉగాది అనగానే గుర్తుకువచ్చేది ఉగాది పచ్చడి. జీవితంలోని ఆనంద, విషాదాలకు చిహ్నంగా పేర్కొనే ఉగాది పచ్చడికి వైద్యపరంగా కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. దీనిలోని షడ్రుచులన్నీ ఆరోగ్యదాయినులని ఆయుర్వేదం చెబుతున్నది. వేపపూవు, బెల్లం, చింతపండు, నెయ్యి, మిరియాలు, లవణ రుచులతో కూడిన ఉగాది పచ్చడి సమతులాహారానికి ప్రత్యామ్నాయంగా చెప్పుకోవచ్చు.
శాస్త్ర, సాంకేతిక యుగంలో ‘అల్ట్రామోడరన్’ జీవితాన్ని గడుపుతున్నాం. ప్రతి మనిషి చేతిలో ఒక సెల్ఫోన్, ప్రతి ఇంటా రెండో, మూడో కంప్యూటర్లు, స్మార్ట్ఫోన్లు, స్మార్ట్హోమ్లు, స్మార్ట్ సిటీలు.. ఇలా స్మార్ట్ లేనిది, కానిది ఇప్పుడు కనిపించదు. వీటన్నిటినీ ఉపయోగిస్తూ మనిషి కూడా స్మార్ట్మ్యాన్ అయిపోతున్నాడు. ఏ పనీ స్వయంగా చేసుకునే అవసరం లేకుండా ఎక్కడ కూర్చుంటే అక్కడికి, ఎక్కడ నిల్చుంటే అక్కడికి..