S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
వినమరుగైన
బుడుగు చదువు సంజెలు గురించి చెప్పుకొనే ముందు బుడుగు దగ్గర పనిచేసి మానేసిన పదిమంది ప్రైవేటు మాస్టార్లు గురించి చెప్పుకోవాలి. ప్రైవేటు మేష్టార్లు గురించి బుడుగు ఒక పరిశోధన చేసి ఒక ‘్థసిస్’ తయారుచేశాడు. అందులో చాలా పాయింట్లు ఉన్నాయి.
ఆధునికాంధ్ర సాహిత్యములో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సుస్థిరం చేసుకొని, చదివీ చదవగానే ఇది ‘రమణీయమయిన రచన’ అని చప్పున తెలిసిపోయేలా పాఠకుల హృదయాలలో నిలిచిపోయిన ఆహ్లాద రచయిత శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ.
తే.గీ. శ్రద్ధతో వినాయక నిమజ్జనము సేయు
వేళ గంగవెఱ్ఱెత్తుచు వెక్కసముగఁ
ద్రాగియుం దూలుచుంలోను రట్టహాస
ముగను పిచ్చి పాటలు నాట్యములు హరహరఁ
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!
లామా గోవిందమార్గాన్నిలక్ష్యాన్ని సమన్వయిస్తూ ‘రూప జగత్తును అధిగమించి రూపాతీత జగత్తును అందుకోవాలనే సాధనలో లామా గోవిందకు రూపసాధన ఏ మాత్రం అడ్డురాలేదు’ అని లోచూపు చూస్తారు. ఇట్లాగే తనా పరిచయం చేసిన కళాకారులందరి తత్త్వాన్ని వారి చిత్రాలనుండి వెలికితీస్తారు.
హల్దార్ రేఖలు సూక్ష్మం. నారీ సహజం. అవి ఖండకావ్యాలు వంటివి. హల్దార్ రేఖలలోని లాలిత్యం అబ్దుల్ రహమాన్ చుగతాయ్ రేఖలలో మనకు తిరిగి ప్రత్యక్షం అవుతాయి.
సరళరేఖలు వక్రరేఖలు ఈ రెండూ కలసి హల్దార్ చిత్రాలలో లయాత్మకంగా లాస్య నృత్యం చేస్తూ ప్రేక్షకుల హృదయవీణను మీటుతాయి. అవన్నీ గొప్ప రేఖా కావ్యాలు.
నికొలస్ రోరిచ్ చిత్రాల గురించి వివరిస్తూ రోరిచ్ రంగుల కాంతులు అధోచేతనలో ఎక్కడా గోచరించక, కేవలం ఊర్థ్వ చేతనలో మాత్రమే గోచరిస్తావి అంటారు. కళాఖండంలోవని వివిధ భాగాలు వాటి చైతన్యస్థాయిలను చెప్పబూనటం విశిష్టమయిన విమర్శనగా తోస్తుంది. కళారూపాలను వ్యక్తి సృజనగా మాత్రమే చూడక వాటి వెనుక జాతి జీవన రీతిలోని మూలాలను నిరూపిస్తారు.
సంజీవ్దేవ్ పేరు వినని సమకాలీన సంస్కృతీపరులు ఆంధ్రదేశంలో ఉండరని నా నిశ్చితాభిప్రాయం. సంజీవ్దేవ్ఘారు ఒక సమగ్ర సంస్కార చిహ్నం.
దీనిని బట్టి ఆ విషయమునకు వీరు భోజ రాజీయమును తాముగా స్రంప్రదింపలేదని, ఎవరో వ్రాసిన విషయమును ఉధృతము గావించినారని తెలియపరచుచున్నది. ఇంతకు అది ఆర్ అనగా ఏరులు, వేల మనగా సముద్ర తీరముగల దేశము అనగా తీర భూమియైన వెలనాడు. వెలనాడన్నదే అది తీర దేశము. ఆరువేల వెలనాడన్న నదీ ముఖ ద్వారముల ప్రాంతము అని అర్థము
అందొకటి కాకతీయ ప్రభువుల కుల నిర్ణయమును గూర్చి చారిత్రకుడెక్కువగా చికాకు పడవలసిన అవసరము లేదు అని ప్రారంభించి, శాసనస్థ విషయముల నుటకించుచు కొన్ని చోట్ల క్షత్రియులని, సన్నిహిత బంధువుల కారణముగ చతుర్థాన్వయ సంజాతులని తీర్పరచి, కడకు సమకాలిక శాసనములలో కొన్నింటియందు కాకతీయులు క్షత్రియులనియు, మరికొన్నిటి యందు శూద్రులనియు చెప్పబడియున్నది.
ఇట్లనుటకు కారణము కూడ, పండిత లోకములో పరంపరీణముగ పాదుకున్న అభిప్రాయమే. అది ఏమనగా తెలుగు, ఆంధ్రము ఒకే భాషకు గల పేర్లని భావించుట. కాని నిజమునకు ఈ రెండును వేర్వేరు భాషలు. ఆంధ్రము ప్రాకృతము. తెలుగు తెలంగాణమునకు చెందినది. ఈ భేదము గుర్తింపక పూర్వ పండితులెల్లరు రెంటిని ఏక భాషగా పొరపడుట ఈ అపోహకు మూలము. ఈ కారణముగనే ఆంధ్ర శబ్ద చింతామణి నన్నయ కృతముగాదని భావించుటయు జరిగినది.