S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వినమరుగైన

03/29/2018 - 22:14

‘‘కృతియొక జెబ్బులింబలె శరీర పటుత్వము నాహరింప, శే
షితమగు నస్థిపంజరము జీవలవంబున నూగులాడగా
బ్రతికియుఁ జచ్చియున్న ముదివగ్గు మహమ్మదుగారి ఖడ్గదే
వతకు రుచించునా పరిభవ వ్యధ యింతట నంతరించునా?
ముత్యముల కిక్కయైన సముద్రమునను
పెక్కుమారులు ముస్కలు వేసినాడ;
భాగ్యహీనుండ, ముత్యమ్ము పడయనైతి
వనథి నను మ్రింగ నోరు విచ్చినది తుదకు’’

03/28/2018 - 22:12

మాతృభూమిక మరవని విశ్వమానవ దృష్టి. సంప్రదయ సంస్కారం వదలని ఆధునిక సృష్టి. ఆస్తికత్వాన్ని తిరస్కరించని హేతువాదం. ద్వేషపూరితం కాని ఆగ్రహ ప్రకటన అన్నీ కలిసి మహాకవి జాషువా.

03/27/2018 - 22:09

చివురులెత్తి పాడుకున్నారు. అంత గొప్ప వంశాన్ని పోషించిన రాజ పరంపరకు ప్రతినిధిగా నిలచిన సూర్యారావుకి తన ప్రథమ పుస్తకాన్ని అంకితం చేయడం ప్రశంసనీయమే. కాని జఠిల గ్రాంథికవాది అయిన శ్రీ సూర్యారావు, కృష్ణశాస్ర్తీ నవ్య కవితాంశువులను చూడలేకపోయాడు. అంకితమందలేదు. ఎవరినీ సత్కరించలేదు. పైగా కొద్దికాలం తర్వాత సంస్థానం ఇస్తూన్న గౌరవ మాసవేతనం కూడా ఆపుచేశాడు.

03/26/2018 - 22:26

ధన, కనక, వస్తు వాహనాలు ఎలా వస్తాయో, ఎలా వెళతాయో! కొబ్బరికాయలో నీళ్ళ బాపతు అనుకున్నారు. వౌనంగా తారకం నవ్వి ఊరుకున్నారు.
‘‘పోనీ ఎంతవుతుందో నేనిస్తాను. కృష్ణశాస్ర్తీ కవితా సంపుటిని ప్రచురించమను’’ అన్నారు బ్రహ్మర్షి.

03/25/2018 - 21:34

20వ శతాబ్ది ప్రారంభ దశలో ఉజ్వల కవిత్వమేదీ రాలేదు. 1909లో గురజాడ అప్పారావు కన్యాశుల్కాన్ని సమగ్రంగా పునర్నిర్మాణం చేసి ద్వితీయ ముద్రణ ప్రచురించారు. అది ఆంధ్ర జాతికి మహోజ్వల నాటకమై సర్వతోముఖంగా జీవిత వాస్తవికతకు ప్రతిబింబించింది. జాతికి మహత్తర బహుకృతిగా భాసించింది. అది మాత్రమే గురజాడ సాహిత్య ప్రతినిధిగా మిగిలితే గొప్ప నాటక కర్తగానే కీర్తించేవాళ్ళం. మహాకవి అనడానికి నిరాకరించేవాళ్ళం.

03/23/2018 - 20:30

బసవరాజు అప్పారావు గేయాలుఆయన జీవితానికి రచనల క్రమానికి రుజువులు కనపడితే ఎంత బాగుండును? రచనలచ్చైన క్రమానికీ రచించిన క్రమానికీ సంబంధం ఉందనుకోవాలా అలా వీలు కనపడదు.
పాపాయిలో పరమాత్ముణ్ణి సాక్షాత్కారం పొందిన అప్పారావుగారు వటపత్రసాయిని తాను చూచి మనందరికీ ప్రత్యక్షంగా చూపించారు.

03/22/2018 - 20:41

నల్లవాడే గొల్లపిల్లవాడే అని మాలపిల్ల సినిమాలో వినగానే ఊరూ వాడా ఆ పాట పాడింది. నట్టనడి సంద్రాన నావలో వున్నాను అన్న (బాలయోగిలో అనుకుంటాను) పాట వింటూంటే కవితమంటే ఇలా ఉంటుందని తెలిసింది. సూర్యకుమారిగారు మామిడిచెట్టును అల్లుకొన్నదీ మాధవీలతొకటి అని (గ్రామఫోన్ రికార్డో, రేడియో రికార్డింగో) పాడుతుంటే అది తాజ్‌మహల్ని గూర్చే అయినా అప్పారావుగారి గీత సంపద గురించేనేమో అనిపిస్తుంది.

03/21/2018 - 20:57

భావకవిత్వం గురజాడ ముత్యాల సరాలతోనే అవతరించిందనడం నిస్సందేహంగా సబబు. రాయప్రోలు సుబ్బారావు గారితో ఆరంభమయిందనడం పాత ఛందస్సులలో కొత్త భావాలు వెల్లివారడాన్ని బట్టి అవుననవచ్చు. కృష్ణశాస్ర్తీగారు భావకవిత్వంలో మకుటధారి కదా! ఆయన శ్రీ బసవరాజు అప్పారావుగారి గీతాలు 1955లో పునర్ముద్రణ సందర్భంగా వ్రాస్తూ ‘‘గురజాడకు అనుచరుడు’’ అంటూనే ‘‘బసవరాజు మొట్టమొదటి భావకవి.

03/20/2018 - 22:53

కనుల నొండరులను చూచుకొనుటకన్న
మనసు లన్యోన్య రంజన గొనుటకన్న
కొసరి యేమోయి’యనిపిల్చుకొనుటకన్న
చెలుల కిలమీదనేని కావలయు సుఖుడ?
భావబంధురంగా తన మణిబంధానికి చిన్నపుడు కట్టిన పట్టుతోరంవిప్పుతావా? అని మాట్లాడలేక కనులు వాల్చింది.

03/19/2018 - 21:13

-రాయప్రోలు సుబ్బారావు

Pages