S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
వినమరుగైన
ఆత్మకథలు సామాజిక జీవితాన్ని, సంస్కృతిని ప్రతిబింబిస్తాయి. చరిత్ర రచనకు ఉపయోగిస్తాయి. పాఠకులను ఉత్తేజపరుస్తాయి. ఆత్మకథ రచించినవారికీ, చదివేవారికీ కల్మష క్షీణనకు ఉపయోగపడతాయి. ఆత్మకథల్లో అబద్ధాలు, అతిశయోక్తులు, స్వోత్కర్షలు వుండగూడదు. ఉన్నది ఉన్నట్లు సుగుణాలు, దుర్గుణాలు బట్టబయలు కావాలి తనవి కాని ఇతరులవి కాని.
ఆ తొలినాటి వామపక్ష రాజకీయాల గూర్చిన ఎంతో విలువైన అంశాల గూర్చి ఈ గ్రంథం తెలియజేస్తుంది. కమ్యూనిస్టు పార్టీలో తాను చేరడానికి స్ర్తి విముక్తి అనే ఆశయం ఎలా దోహదం చేసిందీ, ఆయన మాటల్లోనే తెలుసుకొందాం.
సింగపూర్లో భారత సైనికుల తిరుగుబాటు జరిగితే, అందులో చెంచయ్యగారు పాల్గొన్నారు. బందీగా దొరికిపోయి, అక్కడి కారాగారాల్లో పడిన బాధలను గూర్చి గ్రంథంలో రాశారు. అక్కడినుండి తప్పించుకొని భారతదేశం చేరడంతో గదర్ పార్టీ ఘట్టం ముగుస్తుంది. గదర్ తిరుగుబాటు మన స్వాతంత్రోద్యమంలో మరపురాని ఒక త్యాగపూరిత, సాహసోపేత ఘటన. ఎందరో తమ ప్రాణాలను పణంగా పెట్టి, దేశం కోసం అమరులయ్యారు.
ఇక దరిశి చెంచయ్యగారి జీవిత చరిత్ర, అప్పటి మూడు ప్రధాన ఉద్యమాలనూ చర్చిస్తుంది. వాటిపై వెలుగును ప్రసరిస్తుంది. ఇక్కడ చెంచయ్య, ఒక ప్రేక్షకుడుగా ప్రక్కన నిలబడి ఘటనల గూర్చి చెప్పడంలేదు. ఆయన రుూ మూడు ఉద్యమాల్లో క్రియాశీలక పాత్రను నిర్వహించాడు. అందువల్లే, ఈ గ్రంథానికి అంత ప్రాముఖ్యత.
పిన్నలే పెద్దలైపోయె వినరు మాట
వెరతురే పెద్దలీనాడు పిన్నలకును
హద్దుమీరిన ముద్దుసేయంగ ఫలము
చూడుమో కర్మసాక్షి!యో సూర్యదేవ!
భావం: నేటి కాలంలో పిల్లలే పెద్దవాళ్లయి పోయారు. చెప్పిన మాట వినరు. పెద్దలే పిల్లలకు భయపడుతున్నారెంతగానో! హద్దుమీరిన ముద్దు చేస్తే ఫలితమిదే. కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! చూడవయ్య.
గత శతాబ్ది సగభాగం దాకా భారతదేశం వలస పాలనలో ఉండిపోయింది. జాతీయ విముక్తి ఉద్యమం దేశ స్వాతంత్య్రం కోసం పోరాడి సాధించింది. 1850 లగాయతు, ఆంధ్రదేశంలో 1947 దాకా దాదాపు నూరు సంవత్సరాలు ఆంధ్రదేశం పలు వుద్యమాలతో అట్టుడికిపోయింది.
గంగ తలపైనఁ గూర్చునె గౌరి యర్థ
భాగమై విలసిల్లెనే నాగభూష
ణా! నిరతము నీపాదాల నానుచుంటి
పాహిమాం పరమేశ్వరా! పార్వతీశ!
మీరు బలవంతంగా వెళ్లదలిస్తే- మేం కాల్చవలసి వస్తుందన్నాడు వాడు. నా పక్కన గుంపులో వున్న ఒక మహమ్మదీయ యువకుడు కాల్చు, మేమందరం సిద్ధంగానే వున్నాం అని అరిచాడు. కొన్ని క్షణాలకు వాడు తప్పుకుని దారి యిచ్చాడు.
ఇలా ఆసక్తిదాయకంగా సాగిపోయే కథనశైలితో పుస్తకం నిండా సంఘటనలు గుదిగుచ్చాడు ప్రకాశంగారు. అందుకని పాఠకులను ఉత్సుకతతో ఊపివేస్తుందీ పుస్తకం.
ఈ పుస్తకం చదివితే మనం దేశ స్వాతంత్య్ర పోరాట వీధుల్లో ప్రయాణం చేసినట్లుంటుంది. ఉప్పు సత్యాగ్రహ సమరంలో పాల్గొన్నట్లుంటుంది. గోబాక్ సైమన్ అని గొంతెత్తి అరచినట్లుంటుంది. కారాగారాల్లో కాశీనాథుని నాగేశ్వరరావుగారితోనూ, బులుసు సాంబమూర్తితోనూ, పట్ట్భాతోనూ, రాజగోపాలాచారితోనూ, అయ్యదేవర కాళేశ్వరరావుతోనూ ప్రకాశంగారు కలిసి చర్చించినట్లుంటుంది.
‘రండిరా ఎద కాల్చుకొండిరా’ అంటూ బ్రిటీష్ తుపాకీలకు రొమ్ములెదురొడ్డి ముందు సాగిన సాహసమూర్తి. ఆంధ్రకేసరి అన్న సార్థక నామధేయుడు.
నా జీవిత యాత్ర పేరిట పంతులుగారు తమ ఆత్మకథను మూడు భాగాలుగా 1940-41 వరకు రాసుకున్నారు. అనంతరం చరిత్రని ఆయనకి అత్యంత సన్నిహిత సహచరుడు తెనే్నటి విశ్వనాథంగారు అనుబంధ సంపుటిగా ప్రచురించారు.