S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Others
ప్రతులకు
H.No. 7-8-51, Plot నెం. 18, నాగార్జున సాగర్రోడ్, హస్తినాపురం, సెంట్రల్ కాలనీ, ఫేజ్ -2 హైదరాబాద్- 500079
=====================================================================
కానీ, మీకు మీరే సింహంలా మారాలని గుర్తుంచుకోండి. అలా మారాలని మీరు నిర్ణయించుకోకపోతే ఎప్పటికీ మీరు సింహంలా మారలేరు. ఈ ప్రమాదాన్ని ఎవరికివారే స్వయంగా స్వీకరించాలి. పైగా, ఇది చాలా ప్రమాదకమైన జూదం కూడా. ఎందుకంటే, మీరు సింహంలా మారితే, మీచుట్టూ మిమ్మల్ని సతాయించే శాంతిని ప్రేమించే ఒంటెల సమూహాలుంటాయి. అవి ఎప్పుడూ రాజీపడేందుకు సిద్ధంగా ఉంటాయి. ఎందుకంటే, అవి ఎప్పుడూ గందరగోళాన్ని ఇష్టపడవు.
ఒక ఊరిలో ఒక మహాపండితుండేవాడు. ఆయన అట్టాంటి ఇట్టాంటి పండితుడు కాదండోయ్. ఉడ్డోలమైన పండితుడు. నిత్య వ్యవహారాల్లో కూడా సలక్షణమైన గ్రాంథిక భాషనే వాడాలనేంత గీర్వాణ పారీణుడాయన. ఇంటావిడను ‘వంటింట్లో ఏం చేస్తున్నావు?’ అని అడగాలంటే ‘గృహిణీ! సామ్రాజ్ఞీ! మహానసమున నేమి చేయుచుంటివి?’ అని అడిగేవాడట.
జ్ఞానవృక్ష ఫలం తినడానికి ముందు ఆదాము దేవుడిలోని భాగం. వాడు ‘అలాగే’అని చెప్పగల విధేయుడే కానీ, స్వతంత్రుడు కాడు, స్వతంత్రత ‘వద్దు’అనే ద్వారంనుంచి మాత్రమే ప్రవేశిస్తుంది. అలాగే, పరాధీనత ‘అవును’అనే ద్వారంనుంచి మాత్రమే ప్రవేశిస్తుంది. కాబట్టి, ఒంటెది పరాధీనతతో ఉన్న నిస్సహాయ స్థితి.
సంసారమనే విషవృక్షానికి రెండు మధుర ఫలాలు కాస్తాయి. ఒకటి సద్గ్రంథ పఠనం, రెండు సజ్జన సల్లాపం- అని మనకు శాస్త్రం చెబుతుంది. సంసారంలో ఉంటూ ఆధ్యాత్మిక మార్గంలో సఫలీకృతులైనవారు చాలా అరుదు. బురదలో పుట్టిన కమలంలాగా, నీళ్లలో ఉండి తడి అంటని వరి ఆకులాగా అరుదైన కొందరు మాత్రమే ‘సంసారం - సత్సంగం’ కలిపి చేస్తారు. అలాంటి మహనీయుల్లో పూజ్య లక్ష్మీకాంతరావు బాబా ఒకరు.
ఉత్తరాంధ్రుల ఇలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవంగా అలరారే శ్రీ పైడితల్లి అమ్మవారు సిరిమానోత్సవం ఈ నెల 23న అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. పైడితల్లి అమ్మవారి ప్రతిరూపంగా ఆలయ ప్రధాన పూజారి బంటుపల్లి వెంకట్రావు సిరిమాను పీఠాన్ని అధిరోహిస్తారు. ఈ సిరిమానోత్సవానికి సంబంధించి ఎన్నోఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి.
పురాణాల్లో శాస్తవ్రిజ్ఞానం
డా॥ గుడిపాటి వి.ఆర్.ఆర్.ప్రసాద్ 9490947590
ఒకసారి బాబా తన భక్తులతో ‘‘నా భక్తులకోసం నేనెలా కష్టాలను భరిస్తానో చూడు. వారి కష్టములన్నీ నావే!’’అన్నారు. నిజానికి బాబా బతికున్న రోజుల్లో ఎవరికేమి కష్టమొచ్చినా బాబా దగ్గరికి వచ్చేవారు. ఆయనవారి చింతలను క్షణంలో తీర్చివేసేవాడు. ఒకసారి బాలారామ్ అనునతడు వచ్చాడు. అతనికి బాలారామ్కు చిలుము పీల్చే అలవాటు లేదు. బాబా అతనికి చిలుము ఇచ్చి పీల్చమన్నారు. బాబా మాట కాదనలేక ఇబ్బందిగానే దానిని పీల్చాడు.
త్రిమతాచార్యులలో మూడవ వారై, హనుమంతుడు, భీముడు, అనంతరం వాయుదేవునకు తృతీయ అవతారంగా భావించే మధ్వాచార్యులు ద్వైత మత బోధకులు. ఆయన సాంప్రదాయాలను పాటించే వారిని మాధ్యులు లేదా మధ్వమతస్తులు అంటారు. క్రీ.శ.1238 ఆశ్వయుజ మాస శుక్ల పక్ష దశమి (విజయదశమి) నాడు ఆయన కొంకణ - కేరళ మధ్యనున్న కనరా మండలంలోని ఉడిపి పట్టణ సమీపస్థ పాజక క్షేత్రంలో మధ్య గేహభట్ట, వేదవతి దంపతులకు జన్మించారు.