-
వాషింగ్టన్: చైనా కరోనా వైరస్ విషయంలో చాలా గోప్యంగా వ్యవహరించిందని, ఈ సమాచారాన
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
అంతర్జాతీయం
విశాఖపట్నం, జూన్ 11: ప్రపంచ మార్కెట్లో దేశీయ కాఫీ మార్కెట్ ఒక్కసారిగా కుదేలైంది. బ్రెజిల్, వియత్నాం, ఇండోనేసియా, కొలంబియా వంటి దేశాలు కాఫీ మార్కెట్ను శాసిస్తున్నాయి. గత కొంతకాలంగా ఈ దేశాల్లో కాఫీ పంట ఎక్కువగా దిగుబడి కావడం, వ్యాపారం ఆశించిన స్థాయిలో జరగడంతో మన దేశం నుంచి ఎగుమతి అయ్యే కాఫీకి డిమాండ్ లేకుండా పోయింది. దీంతో మన కాఫీ గురించి ఆయా దేశాలు పట్టించుకోవడంలేదు.
లండన్, జూన్ 11: బ్రిటిష్ రాణి రెండవ ఎలిజబెత్ 90వ అధికారిక పుట్టిన రోజు వేడుకలు శనివారం కన్నుల పండువగా జరిగాయి. సెంట్రల్ లండన్లో జరిగిన కలర్ పరేడ్ ఈ వేడుకలకు హైలైట్గా నిలిచింది. 1600పైగా సైనికులు, 300 గుర్రాలు హార్స్ గార్డ్స్ పరేడ్లో పాలుపంచున్నాయి.
న్యూఢిల్లీ, జూన్ 11: దక్షిణాసియా విశ్వవిద్యాలయం సొంత క్యాంపస్ ఏర్పాటుకు అయ్యే ఖర్చు మొత్తాన్ని భరించడానికి భారత్ ముందుకొచ్చింది. సార్క్ విద్యాసంస్థ తొలి స్నాతకోత్సవం శనివారం ఇక్కడ జరిగింది. సార్క్దేశాల మధ్య మైత్రి, సహకారం మరింత బలోపేతం అయ్యేందుకు భారత్ చొరవతీసుకుంటుందని కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి వికె సింగ్ స్పష్టం చేశారు. నేపాల్ ఉప ప్రధాని కమల్ థాపా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.
లండన్, జూన్ 11: బ్రిటన్లో భారత సంతతికి చెందిన మదన్లాల్ ఖోస్లా అనే వ్యక్తిని బతికి ఉండగానే అధికారులు పొరపాటున చనిపోయినట్లుగా ప్రకటించారు. మాంచెస్టర్కు చెందిన ఖోస్లా తనకు వచ్చిన ఒక లేఖను తెరచి చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు. స్థానిక కౌన్సిల్ నుంచి వచ్చిన ఆ లేఖలో తన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నట్లు ఉంది.
డమాస్కస్, జూన్ 11: సిరియా రాజధాని డమాస్కస్కు సమీపంలో గల షియా ముస్లింలకు చెందిన ఒక ప్రార్థనా మందిరం వెలుపల శనివారం ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాదులు జరిపిన జంట బాంబు దాడుల్లో 20 మంది మృతి చెందారు.
ఢాకా, జూన్ 11: బంగ్లాదేశ్లో ఇటీవలి కాలంలో మైనారిటీలపైన, లౌకిక వాద రచయితలపై జరుగుతున్న వరస దాడులకు ఫుల్స్టాప్ పెట్టడానికి శనివారం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున జరిపిన దాడుల్లో 37 మంది మిలిటెంట్లు సహా 3 వేల మందికి పైగా అనుమానితులను పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు హంతకుల్లో ఏ ఒక్కరినీ వదిలిపెట్టమని, అందరినీ శిక్షించి తీరుతామని ఆ దేశ ప్రధాని షేక్ హసీనా శనివారం స్పష్టం చేశారు.
వియన్నా, జూన్ 10: అణు సరఫరాదేశాల గ్రూపు(ఎన్ఎస్జి)లో భారత్ సభ్యత్వానికి ఓ వైపు మద్దతు పెరుగుతుంటే మరోవైపు ఇప్పటివరకు నారత్ ఈ గ్రూపులో చేరడాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్న చాలా దేశాలు సైతం తమ వైఖరిని మార్చుకుంటున్నట్లు తెలుస్తోంది.
వాషింగ్టన్, జూన్ 10: భారత్లో దాడులకు కుట్ర పనే్నందుకు ఉగ్రవాదులు పాకిస్తాన్లోని భూభాగాలను ఉపయోగించుకోకుండా చూడాలని దాయాది దేశాన్ని అమెరికా హెచ్చరించింది. పాకిస్తాన్లో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమెరికాకు తెలియజేయడంతో దాయాది దేశానికి అగ్రరాజ్యం ఈ విషయాన్ని స్పష్టం చేసిం ది.
కాలిఫోర్నియా: అంతా నిద్రిస్తున్నవేళ రాత్రి ఒంటిగంటా ఐదు నిమిషాలకు అమెరికాలోని కాలిఫోర్నియా దక్షిణ భాగంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.2గా నమోదైంది. ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లుగా సమాచారం లేదు. 30 సెకండ్ల పాటు భూమి కంపించింది. శాన్ డియాగో, లాస్ ఏంజెల్స్ సమీపంలో కూడా భూ ప్రకంపనలు వచ్చాయి
ఢాకా : బంగ్లాదేశ్లో ఇస్లామిక్ ఉగ్రవాదులు శుక్రవారం ఓ ఆశ్రమంలో స్వచ్ఛంద సేవకుడిని చంపేశారు. ఇటీవల బంగ్లాదేశ్లో హిందువులపైనా, లౌకికవాదులపైనా దారుణాలు కొనసాగుతున్నాయి. శుక్రవారం ఠాకూర్ అనుకూల్ చంద్ర సత్సంగ పరమతీర్థ హేమయెత్పుర్ధామ్ ఆశ్రమ్లో స్వచ్ఛంద సేవకుడు నిత్యరంజన్ పాండే (60)ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారని సదర్ సర్కిల్ ఏఎస్పీ సెలిమ్ ఖాన్ చెప్పారు.