S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

02/27/2020 - 05:18

క్రైస్ట్‌చర్చి, ఫిబ్రవరి 26: గత ఏడాది అల్ నూర్ మసీదులో ప్రార్థనలకు వచ్చిన ముస్లింలపై ఓ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపి ఇప్పటికి సుమారు ఏడాది కావస్తున్నప్పటికీ సదరు మసీదు వద్ద కనీస భద్రతా ఏర్పాట్లు కూడా లేకపోవడం అందరినీ ఆందోళనకు గురి చేస్తున్నది. అధికారుల నిర్లక్ష్యం అడుగడుగునా కనిపిస్తున్నది.

02/27/2020 - 04:57

సింగపూర్, ఫిబ్రవరి 26: చైనా నుంచి వచ్చిన ఓ వ్యక్తిపై సింగపూర్ అధికారులు కేసు నమోదు చేశారు. కరోనా వైరస్ సోకినప్పటికీ తాను ఆరోగ్యంగా ఉన్నానని తప్పుడు సమాచారం ఇచ్చినందుకు సింగపూర్ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. అతనితో పాటు భార్యను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సదరు వ్యక్తి నుంచి కోవిడ్ వైరస్ ఇతర ప్రయాణికులకు, అతను సందర్శించిన ప్రాంతాల్లోని ఎవరికైనా ఈ వ్యాధి సోకిందా?

02/26/2020 - 00:09

న్యూయార్క్: అంగారక గ్రహాన్ని మరింత లోతుగా అధ్యయనం చేయడంలో అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా)కు చెందిన ఇన్‌సైట్ ల్యాండర్ ఎప్పటికప్పుడు పురోగతి సాధిస్తోంది.

02/25/2020 - 23:23

న్యూయార్క్, ఫిబ్రవరి 25: 21వ శతాబ్ద సవాళ్లను ఎదుర్కొని అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలంటే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిని అవసరానుగుణంగా సంస్కరించాల్సిన అగత్యం ఎంతో ఉందని భారత్ ఉద్ఘాటించింది. ఐక్యరాజ్య సమితి వంటి అంతర్జాతీయ సంస్థల విశ్వసనీయత పెరగాలంటే ఈ సంస్కరణలు అనివార్యమని భారత్ తేల్చిచెప్పింది.

02/20/2020 - 03:31

బీజింగ్, ఫిబ్రవరి 19: ఓ పక్క కరోనా వైరస్‌తో సతమతమవుతుంటే మీడియాలు వస్తున్న కథనాలు అంతర్జాతీయ సమాజంలో చులకన చేసేలా ఉంటున్నాయని చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యంగా విదేశీ మీడియా వార్తలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. దీనిలో భాగంగా అమెరికా పత్రిక ‘వాల్‌స్ట్రీట్ జర్నల్’కు చెందిన ముగ్గురు రిపోర్టర్లపై వేటు వేసింది. జర్నలిస్టులుగా వారికున్న గుర్తింపును చైనా ప్రభుత్వం బుధవారం రద్దుచేసింది.

02/20/2020 - 01:23

వియేనె్షన్(లావోస్): ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కోవిడ్-19 వైరస్ మహమ్మారి ముప్పునుంచి బయటపడేందుకు చైనా ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. దీనిలో భాగంగా చైనా దౌత్యవేత్తల బృందం బుధవారం లావోస్ చేసుకుని ఆగ్నేయాసియా దేశాలతో సమావేశమయ్యారు. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి ఆదేశాల ప్రతినిధులతో విందు సమావేశం ఏర్పాటు చేసి కరోనాపై విస్తృతంగా చర్చించారు. లావోస్ రాజధాని వియేనె్షన్‌లో సహచర దేశాలతో ఆయన భేటీ అయ్యారు.

02/20/2020 - 01:21

కొలంబో, ఫిబ్రవరి 19: యుద్ధ నేరాల జవాబుదారీతనానికి సంబంధించి ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి తీర్మానానికి సహకరించే అంశం నుంచి శ్రీలంక వైదొలుగుతోందని ఆ దేశ ప్రధాన మంత్రి మహీంద రాజపక్సే బుధవారం ఇక్కడ ప్రకటించారు.

02/20/2020 - 01:17

వాషింగ్టన్, ఫిబ్రవరి 19: తమ దేశంతో వాణిజ్య రంగంలో భారత్ అనుసరిస్తున్న వైఖరి నిరాశాజనంగా ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈనెల 24, 25 తేదీల్లో ట్రంప్ భారతదేశంలో పర్యటించనున్న విషయం తెలిసిందే. వాణిజ్య రంగంలో భారీ ఎత్తున ద్వైపాక్షిక సంబంధాలు కుదురుతాయని అంటున్నారు.

02/17/2020 - 02:35

వాషింగ్టన్: భారత్, అమెరికా మధ్య సంబంధాలు దృఢమయినవని అమెరికాకు చెందిన ఒక ఉన్నత స్థాయి దౌత్యవేత్త పేర్కొన్నారు. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ నెలలో భారత్‌లో అధికారికంగా పర్యటిస్తున్నారు.

02/16/2020 - 05:05

వాషింగ్టన్, ఫిబ్రవరి 15: ప్రజాధరణపై ఫేస్‌బుక్ నిర్వహించిన ఓ సర్వేలో తనకు నెం.1 స్థానం దక్కడం చాలా గొప్ప గౌరవంగా భావిస్తున్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ప్రజాధరణ నేతలపై సోషల్ నెట్‌వర్కింగ్ ఫేస్‌బుక్ సైట్ నిర్వహించిన సర్వేలో ట్రంప్‌కు మొదటి స్థానం, భారత నరేంద్ర మోదీకి ద్వితీయ స్థానం కల్పించింది. దీనిపై ట్రంప్ స్పందిస్తూ హర్షం వ్యక్తం చేశారు.

Pages