S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

08/15/2018 - 00:08

వెనిజులా మరోసారి వార్తల్లోకెక్కింది. సోషలిస్టు దేశంగా చెప్పుకునే వెనిజులాలో ప్రజలిప్పుడు చంకకు జోలె వేసుకుని వలసలు పోతున్నారు. కేవలం సంవత్సర కాలంలోనే ఐదు లక్షల మంది పొరుగున వున్న ఈక్విడార్‌కు వెళ్ళారు. కారణం తమ దేశంలో ఆహారం దొరక్కపోవడమే, ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకడమే! పొరుగు దేశాలైన కొలంబియా, బ్రెజిల్‌కు సైతం వలసలు పెరిగినా, ఈక్విడార్‌కు తాకిడి ఎక్కువగా ఉంది.

08/11/2018 - 23:34

మన దేశం స్వాతంత్య్రం పొందిన అనంతరం- ‘అనాదిగా ఆర్థిక, సామాజిక రంగాల్లో నిర్లక్ష్యానికి గురైన’ హరిజనులు, గిరిజనుల అభ్యున్నతి కోసం 10 ఏళ్ల కాలపరిమితితో రిజర్వేషన్ల చట్టాన్ని అప్పటి కేంద్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. ఆనాడు ప్రభుత్వోద్యోగుల జీతాలు సామాన్య పౌరుల ఆదాయం మాదిరిగానే వుండేవి గనుక ఏ వర్గం ప్రజలు వ్యతిరేకించలేదు.

08/10/2018 - 22:49

వచ్చే ఏడాది ఆరంభంలో సార్వత్రిక ఎన్నికల రానున్నాయి. వివిధ సామాజిక వర్గాలు, పలు రాజకీయ పక్షాలు ఎన్నికలలో తమ వ్యూహాన్ని ఖరారు చేసుకోవడానికి అప్పుడే సమాయత్తమవుతున్నాయి. అణగారిన వర్గాలుగా ఉన్న దళితులు రాబోయే ఎన్నికల్లో ఏం చేయాలి?

08/09/2018 - 23:21

‘ప్రత్యేక హోదా’ అంశాన్ని ఏపీలోని అన్ని రాజకీయ పక్షాలూ 2019 ఎన్నికల నినాదంగా, తమ ఎజెండాగా మార్చేశాయి. ‘హోదా’ను సాధించే దిశగా కాకుండా, వోటుబ్యాంకు రాజకీయాలకు దీనిని వాడుకోవాలని యత్నించడం సబబు కాదు. ప్రత్యేక హోదా అంశం ఇపుడు నేతల ప్రసంగాలకే పరిమితమైంది. నిన్నటి వరకూ ‘హోదాను సాధించి తీరుతాం, ఢిల్లీని వణికించి తీరుతాం, మోదీ మెడలు వంచుతాం’ అంటూ రణ నినాదాలు చేసినవాళ్లు ఇపుడు పోరాటం ఊసే ఎత్తడం లేదు.

08/09/2018 - 00:02

పర్వతారోహణం అనేది కొందరికి సాహసం. ఇంకొందరికి సరదా. ఇది కొందరికి వ్యాపారాత్మకంగా మలచుకోడానికీ అవకాశంగా మారింది. దీనినే ‘కమర్షియల్ వౌంటెనీరింగ్’ అని వ్యవహరిస్తున్నారు. అయితే, ఈ వ్యాపార ధోరణే హిమాలయాలకు, ప్రపంచంలోనే ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరానికి శాపంగా మారింది. ఎవరెస్టు శిఖరారోహణం చేసే వారికి శిక్షణ శిబిరాలు నిర్వహించడం, ఎంతోమంది ఆ శిబిరాలలో పాల్గొనడం అక్కడి పర్యావరణాన్ని దెబ్బతీస్తోంది.

08/06/2018 - 23:16

నేత కార్మికులకు గత నాలుగేళ్ల కాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మొండి చెయ్యి చూపించాయి. మూడేళ్లక్రితం- చేనేతకారుల కష్టాలను చూసి ప్రధాని నరేంద్ర మోదీ ఒక్కసారిగా చలించిపోయారు. చేనేతకార్మికులను ఆదుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఫలితంగా 2015 నుండి చేనేత రంగం ప్రాధాన్యతను తెలిపేందుకు ఏటా ఆగస్టు 7న ‘జాతీయ చేనేత దినోత్సవం’గా జరుపుతున్నారు.

08/05/2018 - 01:17

అన్ని దానాల్లోకెల్లా ప్రాణదానం మిన్న అంటారు. అలాగని తమ ప్రాణాన్ని ఎవరూ దానం చేయరు. కాని ఎవరైనా వ్యక్తి ప్రాణం పోతున్న సమయంలో అతని శరీరంలోని పనికొచ్చే అవయవాలు ఇతరుల ఆరోగ్యాన్ని మెరుగుపరచి ప్రాణాలు పదిలపరుస్తాయి. ఇది అవయవ దానమైనా ప్రాణదానంతో సమానం. విధివశాత్తూ పోయే ప్రాణాలు- జీవశ్చవాలుగా బతుకుతున్న ఎందరికో జీవితం ప్రసాదిస్తాయి.

07/28/2018 - 23:35

వేల సంవత్సరాల నుంచీ, వేదకాలం నుంచీ మనుగడ సాగిస్తున్న భారతదేశానికి ఘనమైన గతం ఉన్నా, వర్తమానం తప్పదు గదా! ఇంతవరకూ ప్రపంచంలో ఎవ్వరూ ‘వేదాలు అబద్ధం’ అని కాని, అవి తమ దేశంలో పుట్టాయి’ అని గాని అనలేదు. అలాగే ఇస్లాం, క్రిష్టియానిటీలు ఈమధ్య జన్మించిన మతాలు, ధర్మాలు. కాని భారత ధర్మం, భారతీయత చరిత్రకు అందని కాలం నుంచీ ఉన్నాయి. ఇది తిరుగులేని సత్యం.

07/26/2018 - 23:13

‘తొలి శాస్తవ్రేత్త ఎవర’ని ఓ పిల్లగాడు తనతో ముచ్చటిస్తున్న పెద్దాయనను అడిగాడు. ‘ఎవరో కాదు- చిన్నారి’ అని ఆయన జవాబిచ్చాడు. దాంతో బుల్లి మెదడుకు బోధపడలేదు. ‘ప్రశ్నలు ఎవరికి వస్తాయి? పిల్లలకే కదా! మరి పిల్లవాడే శాస్తవ్రేత్త’ అని జవాబు పొందిన బుడుగు మహదానందపడిపోయాడు. చిన్నారి ప్రశ్న ను అర్థవంతంగా విశే్లషించి విజయహారం మెడలో వేసిన దార్శనికుడు ఏపీజే అబ్దుల్ కలాం.

07/25/2018 - 00:05

జార్ఖండ్‌లో ఇటీవల గిరిజనులు పతల్ ‘గడీ’ ఉద్యమాన్ని ప్రారంభించారు. ‘జల్-జంగల్-జమీన్ మావే, ఇతరులెవరికీ ఇక్కడ అధికారం లేదు. రాష్టప్రతి, ప్రధానిని సైతం గుర్తించబోము..’ అన్నది ఆ ఉద్యమ సారాంశం. ఇటీవల నలుగురు జనాన్లను కిడ్నాప్ చేసి, వారి ఆయుధాలను అపహరించి, తమ ఉద్యమం గూర్చి ప్రపంచానికి వీరు తెలియజేశారు. గ్రామ సరిహద్దుల్లో తమ ఆకాంక్షలతో కూడిన ఫలకాల (పత్తర్ కడీ)ను ప్రతిష్ఠిస్తున్నారు.

Pages