S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

11/10/2019 - 00:21

భవిష్యత్ భారత నిర్మాణానికి పునాదిరాళ్ళు నేటి బాలలు. అందుకే ‘నేటి బాలలే రేపటి పౌరులు’ అంటారు. మన జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొనే మంత్రదండం విద్య అని అభివర్ణించవచ్చు. ‘అశేష ప్రజానీకంలో విద్య, విజ్ఞానం పెరిగిన మేరకే దేశం ముందుకు సాగుతుంది. మన దేశం ఇప్పటికీ వెనుకబడడానికి కారణం విద్య, విజ్ఞానం కొద్దిమంది గుత్త సొమ్ము కావడమే’ అన్నారు స్వామి వివేకానంద. ఉత్తమ పౌర సమాజ నిర్మాణం విద్య ముఖ్య లక్ష్యం.

11/08/2019 - 22:30

ఇప్పుడు మొత్తం ప్రపంచ దేశాలన్నీ సహకార వ్యవస్థ వైపు దృష్టి సారిస్తున్నాయి. మన దేశంలో నేటికీ 48 శాతంతో అతి పెద్ద పరిశ్రమగా వ్యవసాయ రంగం రాణిస్తున్నది. స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో గ్రామీణుల జనాభా 80 శాతం, పట్టణ ప్రజల జనాభా 20 శాతం వుండగా, మొత్తం జనాభాలో 70 శాతం ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవించేవారు.

11/07/2019 - 01:50

‘నా మతం సైన్సు.. దానే్న జీవితాంతం ఆరాధిస్తా..’ అని చెప్పి తుదిశ్వాస వరకూ శాస్త్రానే్వషణలో గడిపిన దార్శనికుడు సర్ సీవీ రామన్. అతని పూర్తి పేరు చంద్రశేఖర వెంకట రామన్. తమిళనాడులోని తిరుచిరాపల్లి సమీపంలోని అయ్యన్ పెటాయ్ గ్రామంలో 1888 నవంబర్ 7న చంద్రశేఖర అయ్యర్, పార్వతి అమ్మాళ్ దంపతులకు రామన్ జన్మించాడు. చిన్నతనం నుండే రామన్ విజ్ఞాన శాస్త్ర విషయాల పట్ల ఎంతో ఆసక్తిని కనబరిచేవాడు.

11/05/2019 - 03:12

స్మార్ట్ఫోన్లు, ఆధునిక ఫ్యాషన్లు, విలాసాలు, ప్రేమ వ్యవహారాలు వంటి విషయాల్లో తల్లిదండ్రులకు, టీనేజీ పిల్లలకు మధ్య తరచూ భేదాభిప్రాయాలు వస్తూ ఉంటాయి. అనునిత్యం స్మార్ట్ఫోన్లతో కాలక్షేపం చేసే టీనేజీ పిల్లల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. తల్లిదండ్రులకు, పిల్లలకు మధ్య మాటల యుద్ధం తప్పడం లేదు.

11/03/2019 - 01:55

పశ్చిమ కనుమల్లోని మంజకండి అడవుల్లో ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక మహిళతోపాటు నలుగురు మావోయిస్టులు మరణించారు. వీరు కబని దళానికి చెందిన గెరిల్లాలుగా భావిస్తున్నారు. కొందరు గాయపడి తప్పించుకుని ఉండవచ్చని పోలీసులు భావిస్తే, కేరళకు చెందిన నక్సల్స్ వ్యతిరేక ‘్థండర్ బోల్ట్’ ప్రత్యేక పోలీసులు జరిపిన ఈ దాడిలో మరణించిన రెమా, సురేష్, కార్తి, మణివాసకం తమిళనాడుకు చెందిన వారని చెబుతున్నారు.

10/31/2019 - 01:42

భారతదేశపు మట్టి, గాలి సమున్నతమైనవి. వాటిని ఏ రకంగానూ విడ దీయలేం. భారతదేశ మట్టి పూర్తి ప్రేమతో నిండినది. ఈ దేశానికి చెందామన్న భావనను గాలి మోసుకొస్తుంది. భిన్న భాషలు, భిన్న అభిరుచులు, భిన్న ఆహారపు అలవాట్లు, ఎన్నో వేషభాషలు, భిన్న సంస్కృ తులు ఉన్నప్పటికీ దేశ ప్రజలంతా సమైక్యంగానే ఉన్నారు. ఎందుకంటే ఇక్కడి ప్రజల హృదయం హిందూస్థానీ.

10/30/2019 - 02:05

కృత్రిమ మేధ (ఏఐ) నామ సంవత్సరంగా 2020ని పరిగణిస్తామని తెలంగాణ రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కె.టి.రామారావు ఇటీవల ప్రకటించారు. దీంతో ప్రజాజీవితంలో ఆర్ట్ఫిషియల్ ఇంటిలిజెన్స్ (కృత్రిమ మేధ)కు ఎంతటి ప్రాధాన్యత ఉందో తెలుస్తోంది. మారుతున్న కాలానుగుణంగా రూపాంతరం చెందాలన్న ‘సోయి’గల ఐటి మంత్రి కేటిఆర్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.

10/29/2019 - 00:14

జర్నలిజం విలువలుకోసం అహర్నిశలూ
కట్టుబడిన ‘కలం యోధుడు’
నీతి నిజాయితికి మారుపేరు
పత్రికా రంగంలో ధృవతార
విశాలాంధ్ర మాజీ ఎడిటర్
కీ.శే. శ్రీ చక్రవర్తుల రాఘవాచారిగారు
కృషి దీక్ష పట్టుదల క్రమశిక్షణ
నిజాయితీ నిబద్ధత ఆయన సుగుణాలు
ఆయన లేని లోటు తీరనిది
తెలుగు పత్రికా జగతికి ఆద్యుడు
రాఘవాచారి అందరివాడు
ఆయన కలం అందరికీ ఆదర్శం

10/29/2019 - 00:11

ఈ అనంతమైన విశ్వంలో కోటానుకోట్ల నక్షత్రాలు అందులో సూర్యుడు ఓ నక్షత్రం. దానిచుట్టూ తొమ్మిది గ్రహాలలో మన భూమి ఒకటి. ఇప్పటివరకు భూమిమీద తప్ప ఇతర గ్రహాలలో జీవం ఉన్నట్లు స్పష్టమైన సమాచారం లేదు.

10/27/2019 - 01:55

సర్ ఐజాక్ న్యూటన్, పియరీ డే ఫెర్మాట్, గోట్ ఫ్రైడ్ లెబ్నిజ్ మొదలైనవారి పేర్లు తరచుగా మనకు కలనగణితం లేడా (కేలుక్లస్)లో వినిపిస్తుంటాయి. కానీ వీరందరికంటే చాలాకాలం పూర్వమే భారతదేశపు ఖగోళ శాస్తవ్రేత్త, గణిత శాస్తజ్ఞ్రుడు అయిన జ్యేష్ఠదేవుడు కలనగణిత సూత్రాలను ప్రతిపాదించాడు. వాటన్నింటినీ, తన గురువులవద్ద నేర్చుకున్న కలనగణిత విశేషాలనూ ఆయన గ్రంథస్థం చేసారు.

Pages