S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Others
‘జాతి వివక్షత అనేది ఆంగ్లేయులు వ్యాపింపచేసిన అంటువ్యాధి’అంటారు ప్రముఖ భౌతిక శాస్తవ్రేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్. 18వ శతాబ్దంలో ప్రారంభమయిన పారిశ్రామిక విప్లవం పేద, ధనిక వర్గాల మధ్య మరింత అగాధాన్ని పెంచింది. మానవ జీవితాలలో అనూహ్యమైన మార్పులు తెచ్చింది.
అక్షరానికి తూకంవేసే కాలం అదే... చలి కాలానికీ, ఎండా కాలానికీ మధ్య సంధికాలం అదే పరీక్షాకాలం వచ్చేసింది. మార్చి మొదటివారంలో ఇంటర్మీడియట్ పరీక్షలు. అవి అయిపోగానే పదో తరగతి పరీక్షలూ ఆ తర్వాత వచ్చే డిగ్రీ, పీజీ మరియు పోటీపరీక్షలు ఇలా వారు చదివిన చదువులను పరీక్షలతో కొలుస్తున్నాము.
మహిళా సాధికారత.. నడుస్తున్న చరిత్రలో సందర్భసహిత నినాదం. మహిళాసాధికారత పరిపూర్ణం కావాలి. అందుకు అవిశ్రాంత కృషితో అడుగులు వేయాలి. మహిళాలోకం ఎన్నో ఏళ్లుగా కలలుగంటున్న సుందర స్వప్నమిది. సమాజంలో సగ భాగంగా ఉన్న మహిళలు మానసికంగా, భౌతికంగా సంతోషంగా ఉన్నప్పుడే కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉంటుంది. అప్పుడే సమాజం కూడా పటిష్టవౌతుంది. ఆడపిల్ల జాతి గౌరవానికి ప్రతీక. ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు.
మొన్నటి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పాకిస్తాన్లో ‘ఔరత్ ఆజాదీ మార్చ్’ పేర పాక్ యువతులు వీధుల్లో ఊరేగింపులు నిర్వహించారు. ఆశ్చర్యం! మత రాజ్యంగా ఉన్న పాకిస్తాన్లో సంప్రదాయ, ఛాందసవాదులు ఎక్కువగా కనిపించే పాక్లో వీధుల్లో మహిళలు ప్లకార్డులు- బ్యానర్లు పట్టుకుని, పిడికిళ్ళు బిగించి నినాదాలుచేస్తూ ముందుకు సాగడం విస్మయం కలిగించింది.
అమెరికాకు చెందిన ప్రఖ్యాత సంస్థ ఫ్రీడం హౌస్ ప్రపంచ దేశాల్లో ఉన్న స్వేచ్ఛాయుత పరిస్థితులపై అధ్యయనంచేసి ఏటా నివేదిక విడుదల చేస్తుంది. ఫ్రీడం హౌస్ ఈ సంవత్సరం తాజా నివేదికను ఇటీవల వెల్లడిచేసింది. ఈ నివేదిక ద్వారా ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ ఈ యేటి ప్రపంచ స్వేచ్ఛా సూచీలో అట్టడుగున నిలిచింది.
నీతీ నిజాయితీ కలిగిన వాళ్లను, నిజమైన జర్నలిస్టులుగా, జనం తమ సంస్కారవంతుల లిస్టులో పొందుపరచుకుంటారు. అటువంటి ఉన్నత వ్యక్తిత్వం కలిగిన సంస్కారవంతులు పొత్తూరి వేంకటేశ్వరరావుగారు, మన మధ్య నుంచి నిష్క్రమించడం, అత్యంత విచారకరం. జనాభా లెక్కల కోసం ఎందరో పుడుతుంటారు, పోతుంటారు. కానీ జీవితాంతం గుర్తుంచుకోవలసిన, గురుతుల్యులైన వ్యక్తులు కొందరే వుంటారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో విశాఖపట్నం ప్రస్తుతం కీలకంగా మారింది. జనవరి, 2017లో అప్పటి ప్రతిపక్ష నాయకుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డిని విశాఖపట్నం విమానాశ్రయంలో పోలీసులు నగరంలోకి ప్రవేశించకుండా నిరోధించారు. అక్కడనే అరెస్ట్చేశారు. ప్రస్తుత ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ అప్పుడు అధికారంలో ఉంది.