S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వీరాజీయం

12/26/2019 - 04:33

అందరికన్నా ముందు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి శ్రీమతి మమతా బెనర్జీ.. హేమంత్ సొరేన్‌కి, కాంగ్రెస్ పార్టీకి అభినందనలు పంపించింది. ‘జార్ఖండ్ ప్రజలు మహాసంఘటనకి తమ ఆశలను తీర్చే బాధ్యత అప్పగించారు. జార్ఖండ్ సోదర సోదరీమణులకి నా శుభాకాంక్షలు.. ఎన్నికలు అక్కడ సి.ఎ.ఏ., ఎన్.ఆర్.సి... వ్యతిరేక నిరసనల సమయంలో జరిగాయి. ఇది ప్రజల పక్షాన లభించిన తీర్పు..’ అంటూ ట్వీట్2చేసింది.

12/19/2019 - 00:12

పౌరసత్వ (సవరణ) చట్టం 2019ని అమలు చేయబోమని కేరళ, పశ్చిమ బెంగాల్, పంజాబ్, మధ్యప్రదేశ్, చత్తీశ్‌గఢ్ రాష్ట్రాలు ప్రకటించాయి అమలు చెయ్యాలి అన్న నిబంధన ఏమీ లేదని- ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అధికారికంగానే భారీ ఎత్తున ఉద్యమం లేవదీసింది.

12/12/2019 - 04:29

తంజావూరు జిల్లాలోని ఒక మొబైల్ షాపు యజమాని కస్టమర్లను ఆనందోత్సాహాలకు గురిచేశాడు. ఒక స్మార్ట్ ఫోన్ కొంటే కిలో ఉల్లిపాయలు ఉచితం అని ఆఫర్ ప్రకటించారు ఎస్‌టీఆర్ మొబైల్ షాపువారు. ఆశ్చర్యంగా ఉందా? ఇది వార్తే . ఉల్లిపాయల మీద జోకు కాదు. స్మార్ట్ఫును కొంటె హెడ్‌ఫోన్స్ ఉచితం... అంటారు లేదా ఒక మెమరీ కార్డు ఇస్తాము అంటారు. కాని గ్రేడ్ వన్ ఆనియన్స్ ఫ్రీ అని ప్రకటించాడా షాప్ యజమాని.

11/28/2019 - 01:52

‘ఇంతకన్నా నరకం బెటర్.. ఇదొక గ్యాస్ చాంబర్..’ అని మన దేశ రాజధాని ఢిల్లీ మహానగరం గురించి ఆవేదనతో వ్యాఖ్యానించింది మరెవ్వరో కాదు- సాక్షాత్తూ సుప్రీం కోర్టు ధర్మాసనం.

11/21/2019 - 01:26

ఆ ఘుమ ఘుమ - ఆ దివ్య పరిమళం - మరెక్కడా దొరకదు.. అందుకే ఒకప్పుడు వెంకన్న లడ్డూని - ‘మనోహరం’ అని ముద్దుగా పిలిచే వారట! అవును.. మనోహరమే.. దాని అలౌకిక పరిమళం -మరే ప్రసాదానికి ఉండదు. అందులో తాజా నెయ్యి వెయ్యడానికే -దేవస్థానం వంద కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది! తిరుపతికి పోతునప్పుడు -రైలయినా బస్సయినా -గొప్ప బరువుగా కదుల్తుంది... అవును... దాని నిండా -కొన్ని కోట్లు సంపాదించగల -తల నీలాలుంటాయి..

11/13/2019 - 22:59

పంచపాండవులలో- భీమార్జున నకులసహదేవుల లాగ -బుద్ధిగా అలా గా కూర్చుంటే -ధర్మరాజులాగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి నిరంజన్ గోగోయ్ వేయి పేజీలకు మించిన -తీర్పును -భారతీ యుల ఎద జల్లిన పన్నీరులాగా -చదివి పండిత పామర జనరంజనం చేశారు. ఏకగ్రీవం గా వెలువడిన సర్వజన మనోవికాసమయిన ఈ తీర్పు ముఖ్యాంశాలు వింటున్న ఆబాలగోపాలంమొహాల్లో ఒక వెలుగు, ఒక భరోసా ద్యోతకమయ్యాయి.

10/24/2019 - 01:35

ప్రపంచంలో అత్యధిక ఇంటర్నెట్ వినియోగదారులున్న రెండో దేశం భారత్. ఈ సంఖ్య అమెరికా, బ్రిటన్, రష్యా, దక్షిణాఫ్రికా దేశాల మొత్తం జనాభా కంటే ఎక్కువే. వేరే చెప్పనక్కరలేదు- చైనా ప్రపంచం మొత్తం మీద ఎక్కువగా అంతర్‌‘జాలంలో’ ఇరుక్కున్న దేశం అని. భారత్‌లో 63 కోట్ల మందికి పైగా ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నారట. మన దేశంలో ఎంతమంది ఇంటర్నెట్ వాడుతున్నారో అంతే సంఖ్యలో ఇంటర్నెట్ ఊసు ఎత్తని వారు కూడా ఉన్నారు.

10/17/2019 - 00:08

తాను సారథ్యం వహిస్తున్న 50వ టెస్ట్‌మ్యాచ్‌లో ఏ క్యాప్టన్ యింతకన్నా గొప్ప విజయాన్ని, గొప్ప కితాబును కోరుకోడు. విరాట్ కోహ్లి కన్నా ఇండియాకి టెస్ట్‌మ్యాచ్‌లలో ఎక్కువసార్లు నాయకత్వం వహించినవాడు మహేంద్రసింగ్ ధోనియే. ధోని 60 టెస్ట్‌లకి నేతృత్వం వహించి 2014లో విరాట్‌కి పగ్గాలు అప్పగించాడు. మొన్నటి పూణె మ్యాచ్‌లో టీము ఇండియా జట్టు నిజంగా అరివీర భయంకరమైన జట్టు.

10/10/2019 - 02:02

గాడిద కన్నా గాడిదపాలు మిన్న- అన్నది నమ్మండి. ఇది ఆధునిక సత్యము. కొంతమంది గాడిద అనంగానే ఇలా మొహం పెడతారు. అది తప్పు. గాడిద పాలు గ్రేట్-అంతేనా? అది కుక్కలాగే ఆదికాలం నుంచి మనిషికి పర్సనల్ అసిస్టెంటు కూడా. పెట్టనికోట లాగ -కరగని అరగని చెరగని మంచు కప్పుకొని ఉన్న, హిమాలయసానువుల మీద -మనసరుకులు ఎవడు మోస్తాడు? అయితే గాడిద కేవలం సరుకులు- మురికి దుస్తులు మోయడం కన్నా చాలా గొప్పది.

10/03/2019 - 04:51

ఏనుగు తొండం ధారలు- కుండపోతగా వానలు- దారిగాసి వీరబాదుడు బాదిన వర్షం- లాంటి మాటలు మజాగానే వుంటాయి. కాని అనుభవంలో ఇవి ఎంతగా హింసిస్తున్నాయో అనే మాటలతో దసరా పం డుగ ముందుదాకా దేశవ్యాప్తంగా జనాలు దీనాతిదీనంగా బాధలు పడుతున్నారు. యూపీ, బిహార్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు- ముఖ్యంగా హైదరాబాద్, లక్నో, కలకత్తా, పాట్నా లాంటి నగరాలు కడగండ్లపాలైనాయి. శరదృతువు వచ్చింది.. అమ్మవారి పండుగలు..

Pages