S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
సబ్ ఫీచర్
ఏడు దశాబ్దాల భారత ప్రజాస్వామ్యం, ప్రజలే ప్రభువులుగా సామాన్య ఓటర్ల ప్రజాధికార పాలనా వ్యవస్థ లౌకిక దృక్పథం, మానవతా విలువలు, జాతీయ సమైక్యతా స్ఫూర్తి వంటి ఉన్నత రాజ్యాంగ నిర్దేశిత పవిత్ర సూత్రాల ప్రాతిపదికపై కొనసాగుతోంది.
ఫిబ్రవరి 11వ తేదీ న్యూఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. మొత్తం డెబ్బది స్థానాలున్న అసెంబ్లీలో స్పష్టమైన మెజారిటీతో ఆప్ అధికారం చేజిక్కించుకున్నది. బీజేపీ ద్వితీయ స్థానంలో ఉండగా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకొని పోయింది. ఆప్ పార్టీకి ఉభయ కమ్యూనిస్టు పార్టీలు, ముస్లింలీగ్ మాత్రమేకాక కాంగ్రెస్ పార్టీ కూడా బహిరంగంగా మద్దతునివ్వటం విశేషం.
తారేఖ్ పతాహ్ సింథ్లో పుట్టారు, పాకిస్తాన్లో చదువుకున్నారు, కెనడా పౌరసత్వం స్వీకరించి అక్కడే వుంటున్నారు. తరచూ దేశ రాజధాని ఢిల్లీకి వచ్చి వివిధ టి.వి. కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆయన ఆలోచనలు, అభిప్రాయాలు అద్భుతంగా ఉంటాయి. ఎంతో తార్కికంగా, హేతుబద్ధంగా, విజ్ఞానదాయకంగా ప్రసంగాలు చేస్తారు. గొప్ప రచయిత, టెలివిజన్ వ్యాఖ్యతగా కార్యక్రమాలు నిర్వహిస్తారు.
రాజధాని రైతుల నిరసనల పోరాటం 50 రోజులు దాటింది. రాజధాని విషయంలో ఇంకా గందరగోళం కొనసాగుతూనే వుంది. ముఖ్యమంత్రి జగన్ మాత్రం తన పని తాను చేసుకుపోతూనే వున్నాడు. ఎవరి గోల వారిదే! చంద్రబాబు మాత్రం తన కొత్త నేస్తం సీపీఐ నారాయణను వెంటేసుకొని పొలాలెంబడి, పల్లెలెంబడి ‘జగన్’పై గర్జిస్తూ చిందులు వేస్తున్నాడు. పవన్కళ్యాణ్ మాత్రం తన పాత కొత్త నేస్తం బీజేపీతో తిరిగి చెలిమికి శ్రీకారం చుట్టేశాడు.
గతంలో రాజులు- రాజ్యాల మధ్య వైరం, వైరుధ్యాలుండేవి. వర్తమాన ప్రజాస్వామ్యంలో కేంద్రం-రాష్ట్రాల మధ్య వైరం, వైరుధ్యాలు కనిపిస్తాయి. అవి స్నేహపూర్వకమైనవి, స్పర్థతో కూడినవి కావచ్చు..
పశ్చిమ బెంగాల్లో ఇప్పటి జాదవ్పూర్ యూనివర్సిటీని స్థాపించిన మహాత్ముడు చిత్తరంజన్దాస్. ఇది ప్రాథమికంగా ఉన్నత పాఠశాలగా నెలకొన్నది. ఇప్పుడు మార్క్సిస్టుల ఉసిళ్ళపుట్టగా రూపొందింది. సమస్త భారతదేశానికి మహాత్మగాంధీ ఎంత మహనీయుడో ఆనాటి బెంగాల్కు చిత్తరంజన్దాస్ అంతటి మహాత్ముడు.
కొత్త సంవత్సరం ఇంకా మొదలైందో లేదో, జెఎన్యులో చెలరేగిన హింసా వాతావరణం, దౌర్జన్యం, క్రోధం దేశహితైక ప్రయోజనాల పట్ల పూర్తి వ్యతిరేకత, చలపాదతనం, తామస దేశాన్నంతా నివ్వెరపరచాయి.
శాసన మండలి నిర్మాణాన్ని, దాని చారిత్రక నేపథ్యాన్ని ఆశయాలను మరియు అధికారాలను పరిశీలిస్తే, అది అసలు అవసరమా అన్న సందేహం ఎవరికైనా కలుగక మానదు. రాజ్యాంగం శాసన మండళ్ల భవిష్యత్తును రాష్ట్రాల శాసనసభల ఇష్టారాజ్యాలకు వదిలి వేసింది. రాజ్యాంగ నిబంధనల ప్రకారం శాసన మండలి ఉంటే రద్దుచేయాలనో లేదా శాసన మండలి లేకుంటే ఏర్పాటుచేయాలనో కోరుకునే స్వేచ్ఛ రాష్ట్రాలకు ఇవ్వబడింది.
నిజమే.. రెండు రెండు విభిన్న వక్తిత్వాలు, విశ్వాసాలు గల ఇద్దరు వ్యక్తుల మధ్య పొంతన, పోలిక కుదరదు. అలాంటిది రెండు విభిన్న రాజకీయ పార్టీల మధ్య పోలిక తీసురావడం సరికాదు. అందుకే కావచ్చు కయ్యానికి అయినా వియ్యానికి అయినా సమ ఉజ్జీ ఉండాలని అంటారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీకి కాంగ్రెస్ సమ ఉజ్జీ కాదు.. ప్రధాని నరేంద్ర మోదీకీ, రాహుల్ గాంధీకీ పోలికే లేదు.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు అన్ని కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. భారత ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ నేడు ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో భారత ప్రజల భవిష్యత్ ఎంతగానో ఆధారపడి వుంది. ఈ నేపథ్యంలో అందరి చూపు ఈ బడ్జెట్ సమావేశాల వైపు మళ్లింది. నిర్మల మదిలో ఏముందో? ఆమె వ్యూహప్రతివ్యూహాలు ఎలా వున్నాయో?