S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

04/14/2016 - 22:59

ఈ మార్చి నెల చాలా విచిత్రంగా జరిగింది. ఫిబ్రవరి మాసం మధ్యలో, జెఎన్‌యు తరహాలోనే పశ్చిమ బెంగాల్ లోని జాదవ పూర్ యూనివర్సిటీ విద్యార్థులు దక్షిణ కలకత్తాలోని గన్‌పార్కు వరకు వూరేగింపు జరిపారు. కన్హయ్యకుమార్ అరెస్టుకు నిరసనగా వీరు ఈ చర్యకు దిగారు. ఈ సందర్భంగా ఆర్‌ఎస్‌ఎస్ నుంచి విముక్తి, మోదీ సర్కార్ నుంచి విముక్తి, ‘జబ్ కాశ్మీర్‌నే మాంగీ ఆజాదీ, మణిపూర్ భీ బోలే ఆజాదీ’ అంటూ నినాదాలు చేశారు.

04/14/2016 - 05:29

భీమ్‌రావ్ అంబేద్కర్ జన్మించేనాటికి భారత్‌పై ఆంగ్లేయ ప్రభుత్వపు ఉక్కుపిడికిలి బిగించి ఉంది. భారతీయ మేధావులపై ఆంగ్లేయ చరిత్రకారుల ఆలోచనా ప్రభావం కమ్ముకుంది. భారతదేశం ఒక దేశం కాదని అనేక జాతుల సమూహమని, ఒక ఉపఖండం అని వారు పేర్కొన్నారు. ఈ పరిస్థితిలో ఆంగ్లేయ పరిపాలన కారణంగా ‘‘్భరత్ ఒక నూతనంగా ఏర్పడుతున్న దేశం’’ అని ప్రముఖ కాంగ్రెస్ నాయకులు పేర్కొనడం గమనార్హం.

04/14/2016 - 05:25

ఉపాధ్యాయుడు తరగతి గదికి వెళ్లేముందు జ్ఞాన వ్యవస్థలోనే ఉంటాడు. ఉపాధ్యాయుని మెదడులో విద్యార్థి చెప్పవలసిన అంశం ఆవరించి ఉంటాయి. కొత్తగా వచ్చిన టీచర్ పాఠ్యాంశం పైననే కేంద్రీకరిస్తాడు. అనుభవంగల టీచర్ దృష్టి విద్యార్థి వయసు, విద్యార్థి నేపథ్యం, సమాజం, ఆనాటి సంఘంలో విషయాలపై జరుగుతున్న చర్చపై ఉంటుంది. ఉపాధ్యాయుని ప్రిపరేషన్ అనుభవంపై ఆధారపడి అభివృద్ధి చెందుతుంది.

04/13/2016 - 07:43

భారతదేశంలో ప్రాచీన కాలంలోను, మధ్యయుగాల్లోనూ, ఆమాటకొస్తే బ్రిటిష్ వారాక్రమించుకునే వరకూ, వివిధ రాజ్యాలు, రాజులు, చక్రవర్తులూ వుండేవారు. వారి పాలన మాటెలావున్నా వారి జీవనశైలి అతి ఆడంబరంగా వుండేది. రాజుగారు బయలుదేరితే ఏనుగు అంబారీపై కూర్చుని వెళ్ళేవారు. ఆ ఏనుగుకు ముందు ఆయుధ పాణులైన నలుగురు సైనికులు గుఱ్ఱాలమీద వెళ్ళేవారు. అలాగే వెనుక నలుగురు, వారి వెనుక గజాలు, గుఱ్ఱాలూ వెళ్ళేవి. రథాలుండేవి!

04/13/2016 - 07:42

వాతావరణ మార్పు అభివృద్ధి నిరోధక శక్తిగా మారింది. అనేక అంతర్జాతీయ సదస్సులు జరిగినా ఫలితం వుండటం లేదు. భూతాపం పెరుగుతూనే వుంది. అభివృద్ధి వలన, ముఖ్యంగా పారిశ్రామికీకరణ వల్ల వెలువడే కర్బన్ ఉద్గారాలు ప్రజలకు అనేక సమస్యలను సృష్టిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు ప్రమాద స్థాయికి చేరుకున్నాయి.

04/12/2016 - 00:18

నిత్యసత్యానే్వహణే జీవితపరమావధిగా ఎంచి, తన సర్వస్వాన్ని అందుకోసం ధారవోసి, సిద్ధి పొందిన తాపసి ప్రముఖ చారిత్రక పరిశోధకుడు సంగనభట్ల నరహరిశర్మ. కరీంనగర్ జిల్లాచరిత్రతో, ధర్మపురికి చెందిన నరహరి శర్మకు విడదీయజాలని అనుబంధం ఉంది. శాతవాహన చక్రవర్తుల తొలి రాజధానిగా గుర్తింపునొందిన కోటిలింగాల చరిత్ర వెలికితీతకు సంబంధించి నరహరి చేసిన అవిశ్రాంత కృషి అనన్య సామాన్యం.

04/11/2016 - 05:09

‘మనువు’ మానవుని మనుగడకు మార్గదర్శనం చేసిన మహనీయుడు. సనాతన ధర్మంలోని భారతీయ జీవన సత్యంలో తల్లిని మించిన దేవత మరోటి లేదనేది యుగాలను అధిగమించిన భారత జాతీయ స్వభావానికి నిదర్శనం. అక్షరాలు దిద్దంచే ఉపాధ్యాయుడి కంటే సంస్కారాలను అందించే ఆచార్యుడు పదిరెట్లు గౌరవనీయుడు. ఆచార్యుడు కంటే జన్మకు కారకుడైన తండ్రి నూరురెట్లు వందనీయుడు.

04/09/2016 - 00:10

దళిత క్రైస్తవులను షెడ్యూల్డ్ కులాల వారితో సమానంగా పరిగణిస్తూ రిజర్వేషన్లు కల్పించాలని ఆందోళన చేస్తున్నారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు అనేది రాజ్యాంగ స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధం. రాజ్యాంగ నిర్మాత డా.అంబేద్కర్ భావజాలానికి పూర్తిగా విరుద్ధం. హిందువులుగా వున్న షెడ్యూల్డ్ కులాల, ప్రజల హక్కులకు పూర్తిగా హాని కలిగించే చర్య ఇది.

04/07/2016 - 22:46

నేడున్న పరిస్థితుల్లో ఇండియా వంటి వ్యవసాయ దేశాల్లో పేదరిక నిర్మూలనకు వ్యవసాయ అభివృద్ధే మేలైన మార్గమని 2008 ప్రపంచ బ్యాంక్ నివేదిక పేర్కొంది. ఇతర ఆదాయ మార్గాలతో పోల్చితే వ్యవసాయం పేదల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడంలో రెండు రెట్లు అధిక సానుకూలమైందని ఆ నివేదిక నొక్కి చెప్పింది. గ్రామాల్లో 80 శాతం మంది పేదరికంలో మగ్గిపోతున్నారని 2012 అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

04/07/2016 - 06:30

గతంలో ఎన్నడూ లేని దుర్గతి నేటి ప్రాథమిక సెకండరీ విద్యలకు పట్టింది. ఈ తిరోగమన విధానమే ప్రైవేటు పాఠశాలల దినదినాభివృద్ధికి అవకాశం కల్గించింది. పూర్వం ప్రైవేటు పాఠశాలలు లేవు ఆనాడు పురపాలక సంఘాలు జిల్లా బోర్డులు ఎయిడెడ్ సంస్థలు పాఠశాలలు నిర్వహించేవి. ఆ పాఠశాలలన్నీ ప్రభుత్వ విధానాలు అమ లు జరిపేవి. ప్రభుత్వ ఉదాసీన విధానాలవలన 1970వ దశకం నుండి ప్రైవేటు పాశాలలు శరవేగంగా పెరిగి నేడు విశ్వరూపం దాల్చాయి.

Pages