S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

05/17/2016 - 06:45

గురజాడ అప్పారావుగారు విజయనగరంలో మొదట మాదన్నపేటలో ఓ పురాతన భవనంలో ఉండేవారు. అక్కడే ఆయన ఎంతగానో అభిమానించే తమ్ముడు శ్యామలరావు మరణించారు. గురజాడ ఎంతో దిగులు చెందారు. తమ్ముడు మద్రాస్‌లో ‘లా’ చదువుతూ ఇంటికి వచ్చిన తరువాత మరణించారు. అంతేకాదు ఒకరోజు ఆ ఇంటి పెంకులు ఊడి మంచంమీద పడ్డాయి. దాంతో గురజాడ వారి భార్య లక్ష్మీనరసమ్మగారు ఇల్లు మార్చాలని పట్టుబట్టారు. గురజాడకి కూడా ఇల్లు మారితే మంచిదనిపించింది.

05/16/2016 - 06:29

అందరం ఈ మట్టిలో కలసిపోవలసిందే, ముందు వెనుక అంతే, అనే మాటలు తరచు పెద్దల నోట వినిపిస్తుంటాయి. ఈ మాటలను పలు రకాలుగా వాడుతుంటారు. అవి ఎలా వున్నా నిజానికిది ప్రకృతి సహజ నియమం. జీవులన్నీ మట్టి నుండే పుడతాయి. చివరకు ఆ మట్టిలోనే కలసిపోతాయి. లక్షలాది సంవత్సరాలుగా ప్రకృతి చక్రం ఇలా తిరుగుతూ సహజ సమతుల్యతను కాపాడుకొంటుంది. నేలలో విత్తుకు నీరు, వాతావరణాలు సమపాళ్ళలో అందితే మొక్కగా మొలుస్తుంది.

05/14/2016 - 00:28

శ్రామిక శక్తి ఎక్కువగా వున్న దేశాలలో ఉపాధి కల్పన ముఖ్యం. మన దేశంలో ఎక్కువమంది శ్రామికులు వ్యవసాయం, చేనేత పైనే ఆధారపడి వున్నారు. మన చేనేత పరిశ్రమ చాలా ప్రాచీనమైనదైనా నిర్లక్ష్యతకు గురవుతూ వుంది. సుమారు కోటిన్నర మంది ఈ పరిశ్రమపై ఆధారపడి వున్నారు. దేశం మొత్తంమీద సుమారు 470 చేనేత క్లస్టర్లు (సముదాయాలు) వున్నాయి.

05/12/2016 - 23:34

వేదాలకు విద్యారణ్య భాష్యాన్ని ప్రసాదించి, దేశభక్తిని ప్రజ్వరింపజేసి, అనైక్యతను పారద్రోలి, నిర్వీర్యులైన దేశ నాయకులందరినీ కలిపి ఒక రాజకీయ శక్తిగా నడిపించిన రాజనీతి దురంధరుడు, పరిపూర్ణ వేదవిజ్ఞాన సిద్ధుడు, మాధవ మంత్రి అయిన శ్రీ విద్యారణ్యస్వామి.

05/12/2016 - 23:30

మన దేశంలోని అన్ని నగరాలలో, పట్టణాలలో జన సమ్మర్ధమైన ప్రాంతాలలో, రహదారి రోడ్లపైన వివిధ రకాలైన మతపరమైన కట్టడాలు, అడ్డంగా తిష్ఠవేసి ఉంటాయి. వీటిలో మందిరాలు, గురుద్వారాలు, సమాధులు, చర్చిలు, మసీదులు ఉన్నాయి. నేటి ఆధునిక సమాజంలోని ప్రజలు ప్రతిరోజు ఉరుకుల పరుగుల జీవితాలకు అలవాటై దూర ప్రాంతాలకు ప్రయాణించి ఉద్యోగాలు చేస్తూ తమ కుటుంబాలను పోషించుకొంటున్నారు.

05/12/2016 - 08:18

ఇతర జంతువులనుండి మనిషిని వేరుగాను, ప్రత్యేకంగానూ చూపేది మేధస్సు, సంస్కారం. ఈ సంస్కారం రెండు విధాలుగా వుంటుంది. ఒకటి- మానవతా ధర్మం! రెండవది- సామాజిక సంస్కారం! జంతువులకు మేధస్సు చాలా తక్కువ. వాటికి బుద్ధి, విచక్షణా జ్ఞానం వుండవు. శారీరక ప్రేరణతోనే (‘ఇనిస్టింక్ట్’) స్పందిస్తాయి. అలాగే వాటికి సంఘ జీవనముండదు కనుక, సామాజిక సంస్కారమూ వుండదు.

05/12/2016 - 08:19

విద్యార్థిని ఉపాధ్యాయుడు ఎంత చెక్కుతాడో దానికన్నా రెట్టింపు విద్యార్థితో చెక్కబడతాడు. విద్యార్థి ప్రతి ఉపాధ్యాయుడు చెప్పే మాటలను వినయంగా వింటాడు. కానీ ఉపాధ్యాయుడు ప్రతి ఘడియలో శల్యపరీక్షకు కూడా గురౌతాడు. తరగతి గదిలో ఉండే 40 మంది టీచర్‌ను చూస్తూ ఉంటారు. టీచర్ చెప్పిన మాటలను సంబంధిత టీచర్ ఆచరిస్తున్నారా అని తరగతి, విద్యార్థుల కళ్లు చూస్తుంటాయి.

05/11/2016 - 02:47

శ్రీఆదిశంకరులు జన్మించే నాటికి భారతదేశంలో అవైదిక మతాలైన బౌద్ధ, జైనాలు బాగా వ్యాపించి ఉన్నాయి. వైదిక మతాలలో కూడా అనేక మతాలు తమ మతమే గొప్పది అన్న అహంకారంతో ఇతర మతాల పట్ల చిన్నచూపుతో వ్యవహరించ సాగాయి. ఆదిశంకరులు భారతదేశంలోని వివిధ మతాల మధ్య సమన్వయాన్ని సాధించారు. వేద సహితమైన, సనాతన ధర్మాన్ని బలోపేతం చేసారు.

05/11/2016 - 02:38

‘‘రేఖామాత్రం సానసహతి కిల్బిషం మానవానాన్’’-మానవుల్లోని మాలిన్యాన్ని ఆయన రేఖామాత్రం కూడా సహించజాలడు-అన్నది బ్రహ్మశ్రీ తెలకపల్లె విశ్వనాథ శర్మ దుర్వాసమహాముని గురిం చి చెప్పిన మాట. మాలిన్యమంటని జీవితాన్ని స్వయంగా నిర్వహించిన శాస్తవ్రిదుడు విశ్వనాథశర్మ..ఆయన సంస్కృత నిధి, తమ సంస్కృత భాషా మాధుర్య మహానది!

05/09/2016 - 23:34

ఆయన నిజాం పాలనను చూశారు. ఆ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని చూశారు. స్వయంగా ఉద్యమంలో ఆయుధం చేపట్టి పోరాడారు. దేశానికి స్వాతంత్య్రం రావడం చూశారు. స్వయంగా చట్టసభలకు ఎన్నికై ప్రజా ప్రభుత్వంలో ప్రజలకు సేవ చేశారు. హైదరాబాద్ రాష్ట్ర అవతరణ చూశారు. ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చూశారు. ఆనాటి శాసన సభకు ఎన్నికయ్యారు. జై తెలంగాణ ఉద్యమాన్ని చూశారు.

Pages