S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తరాయణం

12/29/2015 - 22:34

ఈనెల 21 నాటి సాహితిలో మృత్యుపత్రం మీద కవిత బాగుంది. బతుకు చేజారి బజారు పాలైన రైతు జీవితం గురించి చక్కగా చెప్పారు రచయత మల్లారెడ్డి గారు. అ యతే రుతువు వెళ్లిపోయాక రాలిన బంతిపూలు అన్న ప్పుడు ‘ఋతువు’ అని రాసుంటే బాగుండేది. ఈమధ్యన చాలామంది రచయతలు, పత్రికలవారు, టీవీ వారు కూడా ‘ఋ’ అక్షరాన్ని వాడటం లేదు. శబ్ద రత్నాకరం పరిశీలిస్తే ‘ఋ’తో వచ్చే పదాలు 28 ఉన్నాయ. అందులో మనం మామూలుగా వాడే పదాలు తొమ్మిది.

12/28/2015 - 22:53

ఖర్చుపెట్టే ప్రతి రూపాయకీ ముప్పయ పైసలు పన్ను రూపేణా చెల్లించి కొనాల్సిన దుస్థితి భారతీయులది. విదేశీ బ్యాంకుల్లో దాచిన వేలకోట్ల రూపాయలు నల్లధనాన్ని తీసుకొచ్చే యత్నాలు సఫలం కావడం లేదు. అదేవిధంగా విదేశాలకు అక్రమంగా తరలిపోతున్న నల్లధనాన్ని ఆపగలిగే సామర్ధ్యం కొరవడుతున్నది. పన్ను రూపేణా ప్రజలపై భారీగా ప్రజలపై భారం వేయడంలో ప్రభుత్వాలు వెనుకడుగు వెయ్యవు.

12/28/2015 - 00:43

విజయవాడలో ఇటీవల సంభవించిన కల్తీ మద్యం మరణాలు రాష్ట్రంలో ప్రభుత్వం అనుసరిస్తున్న అస్తవ్యస్త విధానాలకు తార్కాణం. రెక్కాడితేకాని డొక్కాడని అమాయకులైన ఐదుగురు రైతుకూలీలు మృత్యువాత పడగా ఇరవైమంది ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిపాలయ్యారు. ఇటీవల అనంతపురంలో కలీ తమద్యం మరణాలు సంభవించడం ప్రభుత్వం వైఫల్యా నికి నిదర్శనం.

12/26/2015 - 00:05

భార్యను ఎత్తుకెళ్లిన రావణుని మీదకు దండుగా వెళ్లి, వాడిని, వాడి కొడుకులను చంపి భార్యను తెచ్చుకున్నాడు రాముడు. అది త్రేతాయుగం. తన భార్యను వేధిస్తు న్నాడని తెలిసి కీచకుడిని రహస్యంగా నర్తనశాలకు రప్పించి గుట్టు చప్పుడు కాకుండా చంపి పోయాడు భీముడు. అది ద్వాపర యుగం. మరి ఈ కలియుగంలో ఎందరో మహిళలు కీచకుల బారిన పడి, పోలీసులకు చెప్పినా ప్రయోజనం లేక వేదనతో నలిగిపోతున్నారు.

12/24/2015 - 22:41

ఈనెల 19న ‘చెన్నై పాఠాలు మనకు వినిపించవా’ అని అడుసుమిల్లి జయప్రకాశ్ గారు అమరావతిలో నిర్మిస్తున్న రాజధాని రాబోయే కాలంలో వరద ముంపుకు గురికా వచ్చునని రాశారు. మరెక్కడ నిర్మించాలి? విజయవాడ, గుంటూరు, విశాఖపట్టణంలో ప్రస్తుతం ఉన్న భవనాలు, ప్రదేశాలు సరిపోవు. కాబట్టి విశాలమైన అమరావతి భూమిని ఎంచుకుని ముప్పయవేల ఎకరాల విస్తీర్ణంలో రాజధాని నిర్మాణం మొదలుపెట్టారు.

12/24/2015 - 04:13

ఆంధ్రప్రదేశ్- తెలంగాణ రాష్ట్ర శాసనసభలో సీట్ల సంఖ్య పెంచడం కోస అవసరమైతే రాష్ట్ర పునర్విభజన చట్టానికి సవరణలు చేస్తామని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ప్రకటించారు. పదవీ అవకాశాలు పెరుగు తాయ కాబట్టి రాజకీయ నాయకులకు ఇది శుభవార్త కావచ్చు. కానీ సామాన్య ప్రజలకు ఏమాత్రం ప్రయోజన కారి కాదు. పైగా రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలకు ఇది ఆశనిపా తం వంటిది.

12/23/2015 - 03:19

నేనిదివరలో హంపీ దర్శించడం జరిగింది. అక్కడ రాయలవారి కోటను, అనేక భవనాలను పూర్వపు ముస్లిం రాజులు ధ్వంసం చేసిన శిథిలాలు కళ్ళారా చూసాను. అక్కడ ఇప్పటికీ పోలీసు పికెటింగ్‌లోనే పరిసరాలు నడుస్తున్నాయి. ఆ ముస్లి రాజులకు తీసిపోయిన వాడు కాదీ టిప్పుసుల్తాన్. కర్నాటక ప్రభుత్వం కుహనా రాజకీయాలకు స్వస్తిచెప్పకపోతే ప్రజలే భవిష్యత్తులో వారికి గుణపాఠం చెపుతారని గమనించాలి.

12/22/2015 - 04:51

ఈనెల 18వ తేదీనాటి ఎడిటోరియల్ ఉన్నతం. హిం దూమతాన్ని వ్యతిరేకించే కుహనా రాజకీయ నాయ కులకు, కమ్యూనిస్టులకు, సెక్యులర్ వాదులుగా తమను చిత్రీకరించుకుంటూ హిందూమతం మాకు వద్దు-కులం మాత్రం మాకు ముద్దు అనే గోముఖ వ్యాఘ్రాలకి నిజంగా ఇది చెంపపెట్టు. కమ్యూనిస్టులు రహస్యంగా హిందూ దేవతల్ని ఆరాధించడం మాని బహిరంగంగా హిందూ వాదులైతే ప్రజలకు అభ్యంతరం ఉండదు.
- పట్టిసపు శేషగిరిరావు, విశాఖపట్టణం

12/22/2015 - 05:43

సౌదీ అరేబియా ఇతర దేశాలలోని మసీదులకు నిధులు సమకూర్చడమే కాకుండా, ఛాందస వాహబీ ఇస్లాంను ప్రోత్సహిస్తున్నదని జర్మనీ ఛాన్సలర్ బహిరంగంగా ప్రకటించారు. ప్రపంచంలో వహాబీ ఇస్లాం విస్తరించడానికి ప్రధాన కారణం ఇదే. అమెరికాకు ఇది తెలియంది కాదు. అమెరికా విదేశాంగ మంత్రిగా పనిచేసిన మడెలైన్ అల్‌బ్రైట్, సౌదీ రాజు ఫహద్‌తో చర్చలు జరిపినప్పుడు, ఇతర దేశాల్లోని మసీదులకు నిధులను సమకూర్చే అంశాన్ని లేవనెత్తారు.

12/19/2015 - 00:07

కాల్‌మనీ వ్యవహారంలో ‘ఎవ్వరినీ వదిలిపెట్టేది లేదు. డొక్క చించుతాం..’ వగైరా మాటలు ఏవీ ఆ అభాగ్యపు మహిళలకు ఊరటనివ్వవు. ఆమహిళలు ఎవరిపైన ఆరోపణలు చేస్తారో వాళ్ల దగ్గరినుంచి ఆ మహిళల పేర ఉత్తరాలు రాయించి తీసుకోవాలి. ‘‘ ఈమె నాకు చెల్లించవలసిన డబ్బు మొత్తం ఇప్పుడే చెల్లించేసింది. ఇకనుంచి ఒక్క పైసా కూడా ఈమె నాకు బాకీ లేదు. ఇంకా ఈమె నాకు రాసిచ్చిన ప్రోనోటు ఏది నేను ఇంకెవ్వరికీ బదిలీ చేయలేదు.

Pages