S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తరాయణం

03/01/2016 - 06:30

దేశభక్తీ! మేలుకో! ధీశక్తిని మేలుకొలుపు
కానీ కాదిది కవిత! జరుగుతున్న వాస్తవికత
సగటు భారతీయుని మనసులోని వ్యధ
నవ భారత యువ సమాజామా!
భావి భారత ప్రజానీకమా!
చూస్తున్నారా? మీరంతా?
స్వతంత్ర భారత ప్రజాస్వామ్యపు వింత
ధనానికి ధర్మం దాసోహం
దానికి తోడు పదవీ వ్యామోహం
తరతరాలు అనుభవించినా తీరని అధికారదాహం

02/26/2016 - 23:49

ప్రభుత్వం ప్రాథమిక ఉన్నత పాఠశాలలు మూడు పూవులు ఆరు కాయలుగా గతంలో వికసించాయి. కాని నేడు పేరుకు మాత్రం గ్రామాల్లో రెండుమూడు ప్రాథమిక పాఠశాలలు వెలిశాయి. కాని ఫలితం శూన్యం! ప్రభుత్వానికి విపరీత నష్టం. అలాగే ఉన్నత పాఠశాలలు, మున్సిపల్ పాఠశాలలు కోకొల్లలు! కాలక్షేపానికి మాత్రం కనిపిస్తున్న వీటిని ఎవరు పట్టించుకొన్నట్లు?

02/26/2016 - 06:18

అనుక్షణం భారత్‌లో తాను పాలుపోసి పెంచిన ఉగ్రవాదుల చేత మారణకాండ ఎలా జరపాలా అని మంత్రాంగం చేసే పాకిస్థాన్‌తో చర్చలు జరిపేందుకు మన ప్రభుత్వం ఎందుకు అత్యుత్సాహం చూపుతోందో అర్ధం కావడం లేదు.

02/25/2016 - 00:22

విద్యాలయం ఒక దేవాలయం. జాతికి భవిష్యత్తు నాయకులను ఇచ్చి మానవ విలువలను, జాతి సంస్కృతిని పదిలపరచే పవిత్ర స్థలాలు. వీటిలో మత, జాతీయ, మానవతా విలువలుకు భంగపరచే ఎలాంటి కార్యక లాపాలను అనుమతించరాదు. జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసీ అని కదా వేదవాక్కు. విద్యార్థులు, అధ్యాపకులు, సహనానికి జాతీయ సమైక్యతకు పెద్దపీట వేయాలి. దేశ విచ్ఛిన్నతకు, దేశభక్తిని భంగపరచే కార్యక్రమాలను నిషిద్ధాలు.

02/24/2016 - 06:51

ఇది మినీ కవిత! కాదంటే వాస్తవికత
భారతీయ సోదరా! బహుపరాక్!
జాగో! జాగో! జగాతే రహో!
భారతీయ ప్రజాస్వామ్యం పరిహసించబడుతోంది. రాజ్యాంగం ప్రసాదించిన సేచ్ఛ రంకుతనం పాలవుతోంది.
‘‘వ్యక్తి స్వేచ్ఛ’’ అనే బంగారు జింకగా మారి
మారీచ రాక్షసులు మాయలు పన్నుతున్నారు
గాలి, వెలుతురు కోసం ఇంట్లో పెట్టిన వెంటిలేర్లు సక్య ముల పాములకూ వారసత్వపు తేళ్లకు దారిగా మారాయ

02/23/2016 - 05:39

ప్రభుత్వ ఉద్యోగస్థులు చాలామంది వడ్డీ వ్యాపారాలు చేస్తున్నారు. ఇటువంటి వారిని ఉద్యోగాలనుండి డిస్మిస్ చేయాలి. వడ్డీ వ్యాపార ప్రభుత్వ ఉద్యోగులవల్ల సామా న్య ప్రజలు బాధలు పడుతున్నారు. బాండ్ల మీద తెల్ల కాగితాల మీద, ఎప్పుడో కొంత అప్పు ఇచ్చి, ఇప్పటివరకు వడ్డీల మీద వడ్డీలు తింటున్నారు ప్రభుత్వ ఉద్యోగులు. ఇలాంటి వారిని గుర్తించి, ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి.
- రావేటి మునేంద్ర, అనంతపురం

02/22/2016 - 02:29

దీపం వుండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న సూక్తిని ఆర్టీసి తు.చ. తప్పకుండా పాటిస్తోంది. వివిధ పండుగల సందర్భంగా ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకొని పండుగ స్పెషల్ పేరుతో పల్లెవెలుగు బస్సుల్లో సైతం ఎక్స్‌ప్రెస్ చార్జీలు వసూలు చేస్తోంది. దుమ్ము, ధూళి, చెత్తాచెదారంతో నిండివున్న బస్సులను కూడా నడుపుతున్నారు.

02/19/2016 - 23:44

కాస్త కష్టపడితే కౌటిల్యుడి అర్థశాస్త్రం అర్థం చేసుకోవచ్చునేమో కాని మన ఆధునిక ప్రజాస్వామ్యపు అర్థశాస్త్రం మాత్రం సామాన్యుడికి అర్థమయ్యే పరిస్థితి ఏమాత్రం లేదు. ప్రజలే కేంద్రంగా, వారి సంక్షేమమే లక్ష్యంగా ఆర్థిక విధానాలు ఉంటాయని భావిస్తాం. ప్రజలెన్నుకున్న ప్రభుత్వమైనా, దాని శాఖలైనా పదేపదే అదే భరోసాని మాటల్లో ఇస్తాయ. వాస్తవాలు మాత్రం భిన్నంగా ఉండి గందరగోళ పరుస్తుంటాయ.

02/19/2016 - 04:52

రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ నగర ఉనికి ప్రశ్నార్థకమైందంటే అతిశయోక్తి కాదు. తెరాస నాయకులు, తెలంగాణ ప్రజలు ఈ నగరం తమ వారసత్వపు హక్కు అని, ఆంధ్రావారు కేవలం కిరాయిదారులు అనే ధోరణిలో పెత్తనం చెలాయిస్తూ, సీమాంధ్రులను మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. నిజం చెప్పాలంటే హైదరాబాద్ అభివృద్ధి సీమాంధ్రుల వల్లనే జరిగింది.

02/18/2016 - 06:57

కర్నాటక ముఖ్యమంత్రి శ్రీ సిద్దరామయ్య తనకిష్టమైతే గోవుమాంసం తింటానని, ఇప్పటివరకు తినలేదని, ఎవరూ తనను అడ్డుకోలేరని బహిరంగంగా కాంగ్రెస్ సమావేశంలో ప్రకటించటం సిగ్గుచేటు. భరతమాత బిడ్డవై హిందూ సమాజం ఎంతో పవిత్రంగా పూజించే గోమాత మాంసాన్ని ముస్లింలు ప్రీతితో తింటారని, అవసరమనుకుంటే నేను గోవుమాంసాన్ని తింటానని, ముస్లింలను సంతోషపెట్టే ప్రకటన చేసియుండవచ్చు. ఇది కూడ ఓటు బ్యాంకు రాజకీయమే!

Pages