S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

01/08/2018 - 23:58

ముందు ఊహించినట్లే పార్లమెంటు శీతాకాల సమావేశాలు కూడా అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య జరిగిన గొడవలు, గందరగోళం మూలంగా కొట్టుకుపోయాయి. అధికార, ప్రతిపక్షాలు పార్లమెంటు శీతాకాల సమావేశాలను తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునేందుకు ప్రయత్నించటం శోచనీయం.

01/02/2018 - 00:28

రాజకీయాలకు సంబంధించి గత ఏడాది కీలక ఘట్టాలకు సాక్షిగా నిలిచింది. పదునైన రాజకీయ వ్యూహాలు, ఎత్తుగడలు, యుద్ధాలతో రాజకీయ రంగం రగిలిపోయింది. ఆ రాజకీయ పరిణామాలు కొత్త సంవత్సరంలోనూ ప్రభావం చూపనున్నాయి. దేశ ప్రథమ పౌరుడు.. రాష్టప్రతి ఎన్నిక, ఆ తరువాత రాజ్యసభ అధ్యక్షుడు, ఉపరాష్టప్రతి ఎన్నికలతో ఏడు రాష్ట్రాల శాసన సభల ఎన్నికలు జరిగాయి. గుజరాత్‌లో బి.జె.పి ఆరోసారి అధికారంలోకి వచ్చింది.

12/25/2017 - 23:10

అధికార, ప్రతిపక్ష పక్షాల నాయకులు తమ పార్టీల రాజకీయ లబ్ది కోసం పార్లమెంటు పరువుప్రతిష్ఠలను మంటగలుపుతున్నారు. శీతాకాల సమావేశాలు కూడా రాజకీయాలకు బలై సమయం వృధా అయిపోతోంది. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమై ఆరు రోజులు కావస్తున్నా ఏ ఒక్క రోజు కూడా లోక్‌సభ, రాజ్యసభ సక్రమంగా పనిచేయలేదు. లోక్‌సభ మధ్యాహ్నం సమయంలో కొంత మేరకు జరుగుతున్నప్పటికీ రాజ్యసభలో మాత్రం ఎలాంటి పని జరగటం లేదు.

12/19/2017 - 01:12

రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టటంతో కాంగ్రెస్‌లో కొత్త శకం ప్రారంభమైంది. రాహుల్ గాంధీ హయాంలో కాంగ్రెస్ గత వైభవాన్ని తిరిగి సాధించుకుంటుందా? ఈ ప్రశ్నకు ఇప్పుడిప్పుడే సమాధానం చెప్పటం కష్టం. 19 సంవత్సరాల క్రితం సోనియాగాంధీ పార్టీ అధ్యక్ష పదవి చేపట్టినప్పుడు దేశంలో, పార్టీలో ఉన్న పరిస్థితులు వేరు.

12/12/2017 - 00:58

అధికారానికి అలవాటుపడిన రాజకీయ నాయకులు హుందాగా ప్రవర్తించటం పూర్తిగా మరిచిపోయారు. ఎన్నికల సమయంలో ఈ మరుపు మరింత పెరిగి ఒకరినొకరు అత్యంత హేమమైన పద్ధతిలో విమర్శించుకునే స్థాయికి దిగజారిపోతున్నారు. గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో బి.జె.పి, కాంగ్రెస్ నాయకులు వ్యవహరిస్తున్న తీరే ఇందుకు నిదర్శనం.

12/04/2017 - 23:54

ప్రతిపక్షాలు పెద్ద నోట్ల రద్దు, జి.ఎస్.టి అమలుపై బి.జె.పిని చీల్చిచెండాడుతుంటే ఉత్తర ప్రదేశ్ పట్టణ ప్రాంత ప్రజలు స్థానిక, మున్సిపల్ ఎన్నికల్లో బి.జె.పికి పట్టం కట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు. పెద్దనోట్ల రద్దు, జి.ఎస్.టిని అమలు చేస్తున్నందుకు పట్టణ ప్రాంత ప్రజలు బి.జె.పిని ఓడిస్తారని కాంగ్రెస్ ఇతర ప్రతిపక్షాలు ఆశించాయి. అయితే యు.పి. ప్రజలు ఇందుకు భిన్నంగా బి.జె.పిని గెలిపించటం గమనించవలసిన విషయం.

11/27/2017 - 23:54

నేతి బీరకాయలలో నేయి ఎంత ఉంటుందో రాజకీయ పార్టీల్లో అంతర్గత ప్రజాస్వామ్యం కూడా అంతే ఉంటుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాదిరిగానే కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యంపై ఊకదంపుడు ఉపన్యాసాలు చాలా ఇచ్చారు, ఇంకా ఇస్తూనే ఉన్నారు. నరేంద్ర మోదీ మాదిరిగానే ఆయన కూడా పార్టీలో అంతర్గత ప్రజ్వామ్యానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వటం లేదు.

11/21/2017 - 00:50

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కశ్మీర్ సమస్యను పరిష్కరించేందుకు ఆరో మధ్యవర్తిని ఏర్పాటు చేశారు. కశ్మీర్ సమస్య పరిష్కారానికి ఇప్పటికి ఐదుగురు మధ్యవర్తులు ప్రయత్నించి విఫలమయ్యారు. తాజాగా మధ్యవర్తిగా నియమితుడైన ఇంటలిజెన్స్ బ్యూరో మాజీ డైరక్టర్ దినేశ్వర్ శర్మ ప్రస్తుతం కశ్మీర్‌లో వివిధ గ్రూపులు, సంస్థల ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నారు.

11/06/2017 - 23:12

ఎన్నికల ప్రచారంలో రాజకీయ నాయకుల అబద్ధాలకు అంతులేకుండా పోతోంది. ఆచరణయోగ్యం కాని అర్థంపర్థం లేని హామీలు ఇవ్వడం, పథకాలు అమలు చేస్తామని చెప్పటం, ప్రత్యర్థులపై ఇష్టం వచ్చినట్లు నిరాధార ఆరోపణలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టి మాయ చేసి ఓట్లు దండుకునేందుకు ప్రయత్నించటం మామూలైపోయింది. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కూడా ఇదే ధోరణి కనిపిస్తోంది.

10/30/2017 - 22:13

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి కాంగ్రెస్ ప్రతిష్ఠను నిలబెట్టకపోతే రాహుల్ గాంధీ నాయకత్వం ప్రశ్నార్థకం అవుతుంది. డిసెంబర్ 9, 14 తేదీల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురాగలిగితే రాహుల్ గాంధీ కాంగ్రెస్‌తోపాటు జాతీయ స్థాయి నాయకుడిగా నిలిచిపోతారు.

Pages