S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయన్ ఫీచర్

10/11/2019 - 22:02

మరికొద్ది రోజులలో మహారాష్టల్రో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలు దాదాపుగా ఏకపక్షంగా జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. తొలి నుండి కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా కొన సాగుతున్న ఈ రాష్ట్రంలో భాజపా ఇటీవల తిరుగులేని శక్తిగా ఎదిగింది. ఒక విధంగా అన్ని రాజకీయ పార్టీలు భాజపా ఎత్తుగడల ముందు చిత్తవుతున్నాయి. స్పష్టమైన ఆధిక్యతతో భాజ పా-శివసేన కూటమి తిరిగి అధికారంలోకి రాగలమనే ధీమాతో ఉంది.

10/10/2019 - 02:07

జాతిపిత మహాత్మా గాంధీని సొంతం చేసుకునేందుకు రాజకీయ పార్టీలు పోటీపడుతున్న తీరు గాంధేయవాదులకు సంతోషం కలిగిస్తుంది. గాంధీజీ 150 జయంతి సందర్భంగా అధికార, విపక్ష పార్టీలు పోటాపోటీగా పలు కార్యక్రమాలు నిర్వహించాయి. అందుకే గాంధీ అందరివాడు. ప్రపంచంలోని అన్ని దేశాలు, జాతులు, వర్గాలు గాంధీని సొంతం చేసుకున్నాయి.

10/06/2019 - 02:05

సంక్షేమం పేరిట కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు అమలు చేస్తున్నాయి. ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అంతకు ముందు ఎన్టీఆర్, ఆయన కంటే ముందు ఆ తర్వాత కాంగ్రెస్, తెలుగు దేశం ప్రభుత్వాలు అనేక పథకాలు అమలు చేశాయి. ఎన్టీఆర్ ప్రవేశ పెట్టిన కిలో రెండు రూపాయల బియ్యం పథకాన్ని ఆ తర్వాత- చంద్రబాబు కూడా అమలు చేశారు. ఆయన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాలు దీన్ని అమలు చేశాయి.

10/04/2019 - 21:39

ప్రపంచ దేశాలు ఇప్పుడు భారత్‌వైపు చూస్తు న్నాయి. విశ్వవ్యాప్తంగా భారత్ ప్రతిష్ఠ మరింత పెరిగిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా గుజ రాత్‌లోని సబర్మతి ఆశ్రమం సందర్శించినప్పుడు చెప్పారు. గత నెలలో అమెరికా పర్యటన సందర్భంగా, ముఖ్యంగా ఐక్యరాజ్యసమితిలో పలు దేశాల నుండి వ్యక్తమైన సానుకూల ధోరణులతో ఆయన ఈ మాట అన్నట్లు స్పష్టం అవుతోంది.

10/03/2019 - 04:55

అధికార పార్టీల్లో విధాన నిర్ణయాలపై అంతర్గత చర్చ లేకపోవడం, పార్టీ అధినేత ఏకపక్షంగా వివిధ అంశాలను ఆమోదించడం ప్రజాస్వామ్యానికి నష్టదాయకం. ఈ ప్రమాదకర ధోరణి పలు ప్రాంతీయ పార్టీల్లో బలంగా వేళ్లూనుకుంది. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ సంగతి ఇక చెప్పనక్కర్లేదు.

10/02/2019 - 02:18

వలస పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరా టాలకు 20వ శతాబ్దం ప్రసిద్ధి గాంచింది. వలస పాలనను వ్యతిరేకించి పోరాడిన అనేక మందిలో గాంధీజీ సుప్రసిద్ధులు. ఆయన మార్గం ఎందరినో ప్రభా వితం చేసింది. మార్టిన్ లూదర్ కింగ్‌కు, నెల్సన్ మండేలాకు మార్గ దర్శకమైంది. ఈ ఇద్దరి పోరాటాలు హింసాత్మకంగా ఉండి ఉంటే వాటిని అణ చివేయటం శే్వత జాత్యంహంకారులకు తేలికయ్యేది.

09/29/2019 - 02:40

‘ధనమే పెరిగి, మమతే తరిగి మనిషే ఈనాడు దానవుడైనాడు..’- ఇది ఓ సినిమా గీతం. అయినా మానవ నైజాన్ని గురించి చక్కగా రాసిన అలనాటి పాట ఇది. కాలం మారుతున్నకొద్దీ మనుషుల్లో రానురానూ మానవత్వం అడుగంటి పోతోంది. ప్రేమ, అనురాగం, వాత్సల్యం, ఆప్యాయతలు అంతరించి పోతున్నాయి. నిజంగానే మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలై పోతున్నాయి.

09/27/2019 - 21:50

భారతదేశ స్వాతంత్య్రం కోసం పలు రూపా లలో, పలువురు నేతల నేతృత్వంలో సు దీర్ఘకాలం పోరాటం జరిగింది. చివరకు మహా త్మా గాంధీ పేరుతో మనకు స్వాతంత్య్రం సిద్ధించింది. భారతీయులెవరూ అంచనా వేయలేని పరిస్థితులలో మనకు స్వాతంత్య్రం వచ్చింది. అందుకు దారితీసిన కారణాలపై భిన్నమైన వాదనలు ఉన్నాయి.

09/26/2019 - 02:23

ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో విజయ ఢంకా మో గించిన బీజేపీ వచ్చే నెలలో జరిగే మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లోనూ సత్తా చాటుకొనే అవకాశాలు కన్పిస్తున్నాయి. హర్యానాలో జాట్లు, మహారాష్టల్రో మరాఠాల మద్దతు లభించే పార్టీకి అధికారం దక్కడం ఆనవాయితీగా వస్తోంది. కాగా, ఎన్డీఏ 1990 నుంచి 2009 వరకు అనుసరించిన ఎత్తుగడలకు, 2014 తర్వాత చేస్తున్న వ్యూహాలకు మధ్య పొంతన లేదు.

09/25/2019 - 03:17

మన దేశ స్వాతంత్య్రానికి పూర్వం నుండి అ యోధ్య వివాదం జనసామాన్యంలో ఉన్నా, న్యాయస్థానాల్లో దశాబ్దాలుగా నలుగుతున్న రామజన్మభూమి సమస్యకు పరిష్కారం చూపే దిశగా సుప్రీం కోర్టు వడివడిగా అడుగులు వే స్తోంది. అయోధ్యపై వాదనలను వచ్చే నెల 18 నాటికి పూర్తి చేయాలని ఉభయ పక్షాలకూ సుప్రీం స్పష్టం చేసింది. దీంతో ఈ చిరకాల వివాదానికి తెరపడుతుందని అంతా ఎదురుచూస్తున్నారు.

Pages