S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయన్ ఫీచర్

03/04/2020 - 00:09

జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక అధికారాలను కల్పిస్తూ వచ్చిన అధికరణం 370ని రద్దు చేయడం రాజ్యాంగపరంగా చెల్లదని సవాలు చేస్తూ దాఖలైన 22 పిటిషన్లను ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన విస్తృతస్థాయి రాజ్యాంగ ధర్మాసనానికి పంపించడానికి తగిన కారణాలు కనిపించడం లేదని జస్టిస్ ఎన్ వీ రమణ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం తేల్చి చెప్పింది.

03/03/2020 - 23:53

రానున్న 5 సం.ల పాటు ఎండలు ఎక్కువగా వుంటాయని వాతావరణ శాస్తవ్రేత్తలు ముందే ప్రకటించారు. మరి తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే సూర్యుడు తన విశ్వరూపం చూపించడం ఆరంభించాడు. విజయవాడ వాతావరణం హైద్రాబాద్ కన్నా చాలా వేడిగా వుంటుంది. అందుకే విజయవాడను బ్లేజ్‌వాడ అని కూడా అంటుంటారు. ఏప్రిల్, మే మాసాల్లో సూర్యుడు ఇక్కడ భగ్గుమంటాడు. ఉష్ణోగ్రత 50 డిగ్రీలు కూడా చేరుతుంటుంది.

03/02/2020 - 22:42

స్వదేశంలో ఎన్నికల సమయంలో సొంత పార్టీ నుండే విమర్శలు ఎదురవుతున్నా లెక్క చేయకుండా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటనలో వ్యవహరించిన తీరు గమనిస్తే ఆయన నిగూఢమైన రాజకీయ అజెండాతో వచ్చిన్నట్లు స్ఫష్టం అవుతుంది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ వ్యవహరించిన తీరు కూడా చూస్తే వారిద్దరూ కలసి మొత్తం ఆసియాలో తీవ్ర పరిణామాలకు దారితీయగల అంశంపై దృష్టి సారించినట్లు భావించవలసి వస్తున్నది.

02/27/2020 - 00:04

ఆర్థిక మాంద్యం ప్రభావం, కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో నిధులు రాకపోయినా, తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి పథకాలకు సవాళ్లను తట్టుకుని నిధులు సేకరించి అమలు చేయడం కత్తిమీద సవాలు లాంటిది. త్వరలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం 2020-21 సంవత్సరానికి వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తోంది.

02/26/2020 - 04:07

ప్రపంచంలోనే విశిష్ట ప్రజాస్వామ్య దేశంగానే కాదు, 2 వేల ఏళ్ల చరిత్ర ఉన్న న్యాయవ్యవస్థ భారత్ సొంతం. మొఘల్, డచ్, పోర్చుగీస్, ఇంగ్లీషు సంస్కృతుల సమ్మేళనం. దేశంలో సాధారణ న్యాయవ్యవస్థ రెండువేల ఏళ్లుగా పరిణామం చెందుతూ వస్తోంది. ఏళ్ల క్రితమే వ్యవస్థీకృతమైన చట్టాలు, న్యాయవ్యవస్థ, న్యాయపాలన ఉండేది, న్యాయాధికారుల సమక్షంలోనే బహిరంగంగానే విచారణ జరిగేది.

02/24/2020 - 23:47

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.యస్.జగన్‌మోహన్‌రెడ్డి యువకుడు. మాజీ ముఖ్యమంత్రి దివంగత రాజశేఖరరెడ్డిగారి తనయుడు. వై.యస్.రాజశేఖరరెడ్డిపై సానుకూల, వ్యతిరేక భావాలున్నాయి. అయితే ఇచ్చిన మాట మీద నిలబడటం, నమ్మిన వ్యక్తుల్ని ఆదరించడం అతని సహజ స్వభావం.

02/22/2020 - 22:25

మతాలు, కులాల పేరుతో ప్రజలను విభజించి సుదీర్ఘకాలం భారత్‌లో తమ పాలనను, దోపిడీని సాగించిన బ్రిటిష్ పాలకులు దేశం వదిలి 70 ఏళళు దాటినా, ఇంకా వారి మానసపుత్రుల ఆగడాలు మాత్రం ఆగడం లేదు. ప్రపంచ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా ఎటువంటి భౌగోళిక, చారిత్రక నేపథ్యం లేకుండా మతం ఆధారంగా దేశ విభజనకు పాల్పడి, సరిహద్దులలో నిత్యం విద్రోహ చర్యలు కొనసాగేటట్లు చేయడంలో బ్రిటిష్ వారు విజయం సాధించారు.

02/20/2020 - 00:29

అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థతో విరాజిల్లుతున్న భారత్ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియలో మహిళలు క్రియాశీల పాత్ర వహిస్తున్నారు. స్వాతంత్య్రం వచ్చిన తొలి నాళ్లలో మహిళలంటే కేవలం ఓటింగ్‌కు మాత్రమే పరిమితం. అక్కడక్కడా కొన్ని స్థానాల్లో సంపన్న వర్గాలకు చెందిన మహిళలకు ఆయా పార్టీలు టిక్కెట్లు ఇచ్చేవి.

02/19/2020 - 00:16

ఎన్నికలంటేనే డబ్బుతో ముడిపడిన అంశం. అధికారంలో ఉన్న పార్టీలు సంక్షేమ పథకాల పేరుతో మిగిలిన పార్టీలు హామీల పేరుతో ఓటర్లను ఎరవేస్తున్నాయి. ఎన్నికల వేళ అన్ని పార్టీలూ ఒకే బాటలో నడుస్తూ అక్రమమార్గాలను అనుసరిస్తున్నాయి. ఇంకో పక్క రాజకీయ పార్టీలు ధనవంతుల్నే అభ్యర్ధులుగా రంగంలోకి దింపుతున్నాయి. అందులో నేరచరిత్ర ఉన్న వారిని సైతం నిర్లజ్జగా గెలుపుగుర్రాల పేరిట తమ అభ్యర్థులుగా నిలుపుతున్నాయి.

02/16/2020 - 02:56

పదమూడో తారీఖు సాయంత్రం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సస్ (సీబీడీటీ) వారు విడుదల చేసిన పత్రికా ప్రకటన భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద అల్లకల్లోలం రేపింది. వాస్తవానికి ఫిబ్రవరి 6వ తారీఖున చంద్రబాబునాయుడు మాజీ ప్రైవేట్ సెక్రటరీ పెండ్యాల శ్రీనివాస్ చౌదరిపై ఇన్‌కం టాక్స్ దాడులు 6 రోజులపాటు జరిగినప్పుడే రాజకీయ చర్చలు, పలు ఊహాగానాలు మొదలయ్యాయి.

Pages