S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

02/10/2016 - 06:44

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: భారత జిడిపి వృద్ధిరేటు వచ్చే ఆర్థిక సంవత్సరం (2016-17)లో 7.9 శాతంగా ఉండొచ్చని క్రిసిల్ రిసెర్చ్ మంగళవారం అంచనా వేసింది. అయితే ఇంతకుముందు ఈ అంచనా 8.1 శాతంగా ఉండటం గమనార్హం. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల పతనం భారత ఆర్థిక వ్యవస్థకు కలిసి వస్తోందని పేర్కొంది.

02/10/2016 - 06:44

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం కూడా నష్టాలకే పరిమితమయ్యాయి. జిడిపి గణాంకాలు ఆశాజనకంగానే ఉన్నప్పటికీ మదుపరులను ఆకర్షించలేకపోయాయి. ఫలితంగా బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 266.44 పాయింట్లు కోల్పోయి 24,020.98 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 89.05 పాయింట్లు పడిపోయి 7,298.20 వద్ద నిలిచింది.

02/10/2016 - 06:43

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రేషన్ దుకాణాలు మినీమాల్స్‌గా రూపుదిద్దనున్నట్టు పౌర సరఫరాల సంస్థ చైర్మన్ మల్లెల లింగారెడ్డి తెలిపారు. విశాఖ కలెక్టరేట్‌లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నిత్యావసర సరుకులతో పాటు పప్పులు, సబ్బులు, ఇతర వస్తువులను విక్రయించేలా వీటిని తీర్చిదిద్దనున్నట్టు చెప్పారు.

02/10/2016 - 06:42

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: భారత్‌లో వ్యాపార పరిస్థితులు మెరుగవ్వాలని పారిశ్రామికవేత్త రాజన్ భారతీ మిట్టల్ అన్నారు. ఈ క్రమంలోనే కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘మేక్ ఇన్ ఇండియా’, ‘స్టార్టప్ ఇండియా’ ప్రచారం చాలా ఎక్కువగా ఉందన్నారు.

02/10/2016 - 06:42

న్యూఢిల్లీ: నెట్ న్యూట్రాలిటీకి సోమవారం మద్దతు పలుకుతూ నిర్ణయం తీసుకున్న టెలికామ్ రెగ్యులేటర్ ట్రాయ్.. తమ నిర్ణయాన్ని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవంటూ మంగళవారం టెలికామ్ ఆపరేటర్లను హెచ్చరించింది. డేటా సర్వీసుల్లో వివక్షాపూరితమైన ధరల వ్యత్యాసాన్ని రద్దు చేసేలా కొత్త నిబంధనలుంటాయన్న ట్రాయ్..

02/09/2016 - 06:18

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: నేపాల్‌లో విద్యుత్, హెల్త్‌కేర్, రహదారుల రంగాల్లో భారత్ పెట్టుబడులు మరింతగా పెరిగే వీలుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఆ దేశ ఆర్థిక శాఖ మంత్రి బిష్ణు ప్రసాద్ పౌడెల్‌కు స్పష్టం చేశారు. సోమవారం ఇక్కడ జైట్లీని పౌడెల్ కలుసుకున్నారు. ఈ సందర్భంగా నేపాల్‌లో ఏర్పాటుచేయాలనుకుంటున్న ఓ ప్రత్యేక వౌలికాభివృద్ధి బ్యాంకుకు సాయం చేయాలని కోరారు.

02/09/2016 - 06:15

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: ఉత్పాదక, వ్యవసాయ రంగాల్లో మెరుగైన పరిస్థితుల మధ్య ఈ ఆర్థిక సంవత్సరం (2015-16) భారత జిడిపి వృద్ధిరేటు ఐదేళ్ల గరిష్ఠాన్ని తాకుతూ 7.6 శాతంగా నమోదు కావచ్చని సోమవారం కేంద్ర గణాంకాల కార్యాలయం (సిఎస్‌ఒ) అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరం (2014-15)లో దేశ జిడిపి వృద్ధిరేటు 7.2 శాతంగా నమోదైందన్న సిఎస్‌ఒ..

02/09/2016 - 06:15

మదనపల్లె, ఫిబ్రవరి 8: ప్రపంచ పటంలో భారతదేశాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా పేర్కొన్నారు. సోమవారం మదనపల్లె నీరుగట్టువారిపల్లె హనుమాన్ జంక్షన్‌లోని శ్రీ చౌడేశ్వరీ కల్యాణ మండపంలో జరిగిన చేనేత కార్మికుల సదస్సుకు నడ్డా ముఖ్య అతిథిగా హాజరైయ్యారు.

02/09/2016 - 06:13

చెన్నై: తమిళనాడు మీదుగా వెళ్లే గెయిల్ గ్యాస్ పైప్‌లైన్‌పై నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జె జయలలిత కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి జయలలిత సోమవారం ఓ లేఖను రాశారు.

02/09/2016 - 06:12

ముంబయి, ఫిబ్రవరి 8: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీగా నష్టపోయాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 329.55 పాయింట్లు పతనమై 24,287.42 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 101.85 పాయింట్లు క్షీణించి 7,387.25 వద్ద స్థిరపడింది.

Pages