S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

02/18/2016 - 08:12

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి. ట్రేడింగ్ చివర్లో నమోదైన కొనుగోళ్లతో తిరిగి లాభాలను అందుకోగలిగాయి. మంగళవారం సూచీలు భారీ నష్టాలపాలైనది తెలిసిందే. ఈ క్రమంలో అంతర్జాతీయ మార్కెట్‌లో కోలుకున్న ముడి చమురు ధరలు, తద్వారా పుంజుకున్న ఐరోపా మార్కెట్లు.. దేశీయంగా మదుపరులను ఉత్సాహపరిచాయి.

02/17/2016 - 08:14

న్యూఢిల్లీ: భారీగా పేరుకుపోయిన నిరర్థక ఆస్తులు (మొండి బకాయిలు) జనవరి-మార్చి త్రైమాసికం లాభాలను కూడా ప్రభావితం చేయనున్నాయన్న అభిప్రాయాన్ని ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య వ్యక్తం చేశారు. ఇప్పటికే అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో మొండి బకాయిల కారణంగా ఎస్‌బిఐ లాభం సగానికిపైగా పడిపోయినది తెలిసిందే.

02/17/2016 - 08:11

హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసి అభివృద్ధికి వెయ్యి కోట్లు కేటాయించాలని, సకల జనుల సమ్మె కాలాన్ని వేతనంతో కూడిన సెలవు దినంగా పరిగణించాలని ఎంప్లారుూస్ యూనియన్ ప్రతినిధులు ఎస్ బాబు, కె రాజిరెడ్డి, వి మురళీధర్, సంజీవరెడ్డి ముఖ్యమంత్రి కెసిఆర్, ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ను మంగళవారం సచివాలయంలో కలుసుకొని విజ్ఞప్తి చేశారు.

02/17/2016 - 08:11

న్యూఢిల్లీ: లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా నేతృత్వంలోని యునైటెడ్ బ్రూవరీస్ హోల్డింగ్స్ లిమిటెడ్ (యుబిహెచ్‌ఎల్)ను మంగళవారం ప్రభుత్వరంగ బ్యాంకింగ్ సంస్థ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉద్దేశపూర్వక ఎగవేతదారు (విల్‌ఫుల్ డిఫాల్టర్)గా ప్రకటించింది. ఈ మేరకు బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు బ్యాంక్ తెలిపింది. మరోవైపు ఈ నిర్ణయాన్ని సవాల్ చేసేందుకు యుబిహెచ్‌ఎల్ న్యాయవాదులను సంప్రదిస్తోంది.

02/17/2016 - 08:10

విశాఖపట్నం: రక్షణ రంగంలో జరుగుతున్న ప్రయోగాలకు కావల్సిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అండ్ రీసెర్చ్ (సమీర్) సంస్థ ఎంతగానో ఉపకరించనుందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటి విభాగం డైరెక్టర్ బిఎం బవేజా తెలియచేశారు.

02/17/2016 - 08:09

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. సోమవారం పెట్టుబడులకు ఆసక్తి కనబరిచిన మదుపరులు.. మంగళవారం మాత్రం లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. ఫలితంగా బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 362.15 పాయింట్లు పతనమై 23,191.97 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ సైతం 114.70 పాయింట్లు క్షీణించి 7,048.25 వద్ద నిలిచింది.

02/16/2016 - 02:35

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: దేశీయ మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ రింగింగ్ బెల్స్.. ఈ వారం భారత్‌లోనే అత్యంత చౌక స్మార్ట్ఫోన్‌ను మార్కెట్‌కు పరిచయం చేయనుంది. భారతీయ మొబైల్ మార్కెట్‌లో ఓ విప్లవాత్మక మార్పునకు నాంది పలుకుతూ రానున్న ఈ స్మార్ట్ఫోన్ ధర 500 రూపాయల దిగువనే. కాగా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విజన్ (‘దేశంలోని ప్రతి వ్యక్తికి భారత సాధికారికత ఫలాలు అందాలి.

02/16/2016 - 02:36

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: టోకు ధరల సూచీ (డబ్ల్యుపిఐ) ద్రవ్యోల్బణం జనవరిలోనూ మైనస్‌లోనే నమోదైంది. వరుసగా 15 నెలల నుంచి టోకు ద్రవ్యోల్బణం గణాంకాలు మైనస్‌లో నమోదవుతున్నది తెలిసిందే. ఈ క్రమంలో గత నెల కూడా మైనస్‌కే పరిమితమైంది. -0.9 శాతంగా నమోదైంది. 2014 నవంబర్ నుంచి డబ్ల్యుపిఐ సూచీ మైనస్‌లో నమోదవుతూ క్రమేణా తగ్గుతుండగా, గత నాలుగు నెలల నుంచే మైనస్‌లో కాస్త పెరుగుతూ వస్తోంది.

02/16/2016 - 02:34

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: దేశీయ ఎగుమతులు ఇంకా కోలుకోవడం లేదు. వరుసగా 14వ నెల క్షీణిస్తూ, గత నెల జనవరిలో 21 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. గత ఏడాది జనవరితో పోల్చితే ఇది 13.6 శాతం తక్కువ కావడం గమనార్హం. పెట్రోలియం, ఇంజినీరింగ్ ఉత్పత్తుల ఎగుమతులు గణనీయంగా పడిపోయాయి. మరోవైపు దిగుమతులు కూడా 11 శాతం తగ్గి 28.71 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దీంతో వాణిజ్య లోటు 7.63 బిలియన్ డాలర్లుగా ఉంది.

02/16/2016 - 02:33

హైదరాబాద్, ఫిబ్రవరి 15: ఉచిత బీమా సేవలను వినియోగించుకుంటున్న తమ వినియోగదారుల సంఖ్య 20‚లక్షలకు చేరిందని టెలినార్ ఇండియా సంస్థ తెలిపింది. ఈ మేరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ బిజినెస్ హెడ్ శ్రీనాథ్ కొటియన్ సోమవారం తెలిపారు. సురక్షా ఉచిత బీమా పేరుతో తమ వినియోగదారులకు ఈ బీమా అందిస్తున్నట్లు వెల్లడించారు. రెండు రాష్ట్రాల్లోని 265 రిటైల్ ఔట్‌లెట్ల ద్వారా ఈ బీమా సేవలను పొందవచ్చని పేర్కొన్నారు.

Pages