-
విజయవాడ (క్రైం), ఏప్రిల్ 13: రాష్ట్రంలో రవాణా లారీలు రోడ్డెక్కనున్నాయి.
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: చమురు, సహజవాయు కార్పొరేషన్ (ఓఎన్జీసీ) తన ఉత్పత్తిలో
-
బెంగళూరు, ఏప్రిల్ 13: కరోనా వైరస్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తీవ్రంగా దెబ్బతీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
బిజినెస్
సెనె్సక్స్ 171 పాయింట్లు పతనం * 7,500 పాయింట్ల దిగువకు నిఫ్టీ
న్యూఢిల్లీ: విజయ్ మాల్యా విదేశాలకు వెళ్లిపోయాడని బుధవారం కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలియజేసింది. ప్రభుత్వరంగ బ్యాంకులకు 9,000 కోట్ల రూపాయలకుపైగా బకాయిపడిన మాల్యాపై బాధిత బ్యాంకర్లు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించినది తెలిసిందే. ఉద్దేశపూర్వకంగా రుణాల ఎగవేతకు మాల్యా పాల్పడుతున్నారని, అరెస్టు చేసి, పాస్పోర్టును స్వాధీనం చేసుకోవాలని ఎస్బిఐసహా 13 బ్యాంకులు సుప్రీంలో పిటిషన్ వేశాయి.
హైదరాబాద్: దేశ వ్యాప్తంగా గ్రామీణ బ్యాంక్ ఉద్యోగులు రెండు రోజుల పాటు సమ్మెకు దిగుతున్నారు. ఈ నెల 10, 11 తేదీల్లో సమ్మెకు పిలుపునిచ్చినట్లు ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్ అధికారుల జాతీయ సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఎస్ వెంకటేశ్వరరెడ్డి తెలియజేశారు.
న్యూఢిల్లీ: కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాటా విక్రయానికి సంస్థాగత మదుపరుల నుంచి విశేష స్పందన లభించింది. ప్రభుత్వరంగ బీమా సంస్థ ఎల్ఐసి తదితర సంస్థాగత మదుపరులు 1,887 కోట్ల రూపాయల విలువైన బిడ్లను దాఖలు చేశారు. 1,165 కోట్ల రూపాయల విలువైన 5 శాతం వాటాను కేంద్ర ప్రభుత్వం.. అమ్మకానికి పెట్టినది తెలిసిందే.
న్యూఢిల్లీ: భారత్లో సంస్కరణలు మందగించనున్నాయని, వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2016-17)గాను గత నెల 29న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన సాధారణ వార్షిక బడ్జెట్ ఇందుకు నిదర్శనమని గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ దిగ్గజం మోర్గాన్ స్టాన్లీ వ్యాఖ్యానించింది. దేశ ఆర్థికాభివృద్ధిని పరుగులు పెట్టించగల సంస్కరణలేవీ ఉండవని మరోమారు బడ్జెట్ తేల్చి చెప్పిందని బుధవారం పేర్కొంది.
విశాఖపట్నం: దేశంలోని మేజర్ పోర్టులను ప్రైవేటీకరించే కుట్ర జరుగుతోందని మేజర్ పోర్ట్స్ వర్కర్స్ ఫెడరేషన్ జాతీయ సమన్వయ కమిటీ ఆరోపించింది. పోర్టుల ప్రైవేటీకరణ అంశంలో ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు దేశంలోని 11 మేజర్ పోర్టుల్లో కార్మికులకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఐదు ఫెడరేషన్ల సమన్వయ కమిటీ సమావేశాలు గత రెండు రోజులుగా విశాఖలో జరుగుతున్నాయి.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం లో 1,200 కోట్ల రూపాయల వ్యయంతో సుజ్లాన్ గ్రూప్ 3 వేల మెగావాట్ల విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి కనబర్చింది. ముంబయిలో ఒక రోజు పర్యటనలో భాగంగా తెలంగాణ పంచాయతీరాజ్, ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్.. సుజ్లాన్ గ్రూప్ సిఎండి తులసి తంతితో సమావేశమయ్యారు.
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) ఈ ఏప్రిల్ 5న ద్రవ్యసమీక్ష జరపనున్న క్రమంలో అప్పుడైనా, దానికి ముందైనా కీలక వడ్డీరేట్లను పావు శాతం చొప్పున తగ్గించే అవకాశాలున్నాయని బ్యాంక్ ఆఫ్ అమెరికా మెర్రిల్ లించ్ నివేదిక బుధవారం అభిప్రాయపడింది.
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకుల మొండి బకాయిలు ఈ ఆర్థిక సంవత్సరం (2015-16) తొలి తొమ్మిది నెలల్లో (ఏప్రిల్-డిసెంబర్) దాదాపు లక్ష కోట్ల రూపాయలు పెరిగాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. ప్రభుత్వరంగ బ్యాంకుల నిరర్థక ఆస్తులు 2015 మార్చి నాటికి 5.43 శాతంగా ఉంటే, డిసెంబర్ నాటికి 7.30 శాతానికి చేరాయన్నారు. ఈ మేరకు మంగళవారం రాజ్యసభకు ఓ లిఖితపూర్వక సమాధానంగా జైట్లి తెలిపారు.
న్యూఢిల్లీ: గెలాక్సీ ఎస్7, గెలాక్సీ ఎస్7 ఎడ్జ్ స్మార్ట్ఫోన్లు భారతీయ మార్కెట్లో ఈ నెలాఖరుకల్లా అందుబాటులోకి వస్తాయని సామ్సంగ్ మంగళవారం తెలిపింది. రూ. 48,900 నుంచి రూ. 56,900 వరకు వీటి ధరలుంటాయని సామ్సంగ్ ఇండియా మొబైల్ బిజినెస్ డైరెక్టర్ మను శర్మ ఇక్కడ విలేఖరులకు తెలిపారు. ఎస్7.. 5.1 అంగుళాల డిస్ప్లే, 3,000 ఎమ్ఎహెచ్ బ్యాటరీతో వస్తుండగా, ఎస్7 ఎడ్జ్..