S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

04/20/2016 - 06:28

న్యూఢిల్లీ, ఏప్రిల్ 19: ప్రైవేట్‌రంగ బీమా సంస్థ హెచ్‌డిఎఫ్‌సి లైఫ్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2015-16) చివరి త్రైమాసికం, ఈ జనవరి-మార్చిలో 4.2 శాతం పెరిగి 818 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2014-15) ఇదే వ్యవధిలో 786 కోట్ల రూపాయల లాభాన్ని పొందింది. ఆదాయం క్రిందటిసారితో పోల్చితే 10 శాతం వృద్ధి చెంది ఈసారి 16,313 కోట్ల రూపాయలుగా ఉంది.

04/19/2016 - 06:08

న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) దేశ జిడిపి వృద్ధిరేటు 7.7 శాతంగా నమోదు కావచ్చని సిటిగ్రూప్ అంచనా వేసింది. ప్రభుత్వ సంస్కరణలు, ద్రవ్యోల్బణం గణాంకాలు, ఆర్‌బిఐ వడ్డీరేట్ల తగ్గింపు విధానం వంటివి భారత జిడిపి వృద్ధిరేటును పురోగమించేలా చేస్తున్నాయని సోమవారం తమ నివేదికలో సిటిగ్రూప్ పేర్కొంది.

04/19/2016 - 06:08

న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) ఆగస్టు 9న జరిపే ద్రవ్యపరపతి విధాన సమీక్షలో రెపో రేటును పావు శాతం తగ్గించే అవకాశాలున్నాయని బ్యాంక్ ఆఫ్ అమెరికా మెర్రిల్ లించ్ అంచనా వేసింది. ద్రవ్యోల్బణం అదుపులో ఉండటం, పారిశ్రామికోత్పత్తి పడిపోతుండటం, ఈసారి వర్షాలు సమృద్ధిగానే కురిసే వీలుండటం మధ్య ఆర్‌బిఐ రెపో రేటును 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించవచ్చని అభిప్రాయపడింది.

04/19/2016 - 06:07

న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: టోకు ద్రవ్యోల్బణం ఇంకా మైనస్‌లోనే కొనసాగుతోంది. సోమవారం విడుదలైన గణాంకాల ప్రకారం వరుసగా 17వ నెల రుణాత్మక ధోరణిని అవలంభిస్తూ గత నెల మార్చిలో టోకు ధరల సూచీ (డబ్ల్యుపిఐ) ఆధారిత ద్రవ్యోల్బణం -0.85 శాతంగా నమోదైంది. ఫిబ్రవరిలో ఇది -0.91 శాతంగా ఉంది. నిరుడు మార్చిలోనైతే -2.33 శాతంగా ఉంది. కాగా, 2014 నవంబర్ నుంచి టోకు ద్రవ్యోల్బణం మైనస్‌లోనే కొనసాగుతోంది.

04/19/2016 - 06:06

న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: ఎగుమతులు కోలుకున్న దాఖలాలు ఇప్పట్లో కనిపించేలా లేవు. వరుసగా 16వ నెల కూడా దేశీయ ఎగుమతులు క్షీణించాయి. గత నెల మార్చిలో 5.47 శాతానికి పరిమితమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో నెలకొన్న ప్రతికూల పరిస్థితుల మధ్య పెట్రోలియం, ఇంజినీరింగ్ ఉత్పత్తుల ఎగుమతులు దిగజారాయి. దీంతో ఈ మార్చి ఎగుమతుల విలువ 22.71 బిలియన్ డాలర్లుగానే ఉండిపోయింది.

04/19/2016 - 06:05

ముంబయి, ఏప్రిల్ 18: మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎమ్‌ఎల్‌ఎ) ప్రత్యేక కోర్టు సోమవారం విజయ్ మాల్యాకు నాన్ బెయిలబుల్ వారంట్‌ను జారీ చేసింది. ప్రభుత్వరంగ బ్యాంక్ ఐడిబిఐ నుంచి కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ద్వారా తీసుకున్న రూ. 900 కోట్లకుపైగా రుణాన్ని మాల్యా ఎగవేసేందుకు పాల్పడ్డారన్న కేసులో మనీలాండరింగ్ కోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) దర్యాప్తు చేస్తున్నది తెలిసిందే.

04/19/2016 - 06:04

న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: బికె బిర్లా గ్రూప్‌నకు చెందిన ప్రతిష్ఠాత్మక సంస్థ కేశోరామ్ ఇండస్ట్రీస్‌లో భాగమైన కావెండీష్ ఇండస్ట్రీస్ లిమిటెడ్.. జెకె టైర్ అండ్ ఇండస్ట్రీస్ వశమైంది. కావెండీష్‌ను 2,195 కోట్ల రూపాయలతో జెకె టైర్ అనుబంధ సంస్థ జెకె టైర్ అండ్ జెకె ఆసియా పసిఫిక్ ప్రైవేట్ లిమిటెడ్ కొనుగోలు చేసింది. కాగా, ఈ కొనుగోలుతో కేశోరామ్ ఇండస్ట్రీస్ హరిద్వార్ టైర్ల తయారీ ప్లాంట్లు జెకె టైర్ సొంతమైయ్యాయి.

04/19/2016 - 06:03

ముంబయి, ఏప్రిల్ 18: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభా ల్లో ముగిశాయి. గత వారం వరుస మూడు రోజుల లాభాలను కొనసాగిస్తూ సూచీలు నాలుగోరోజూ లాభాల పరుగులు పెట్టాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 189.61 పాయింట్లు పుంజుకుని 25,816.36 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 64.25 పాయింట్లు అందిపుచ్చుకుని 7,914.70 వద్ద స్థిరపడింది.

04/19/2016 - 06:03

హైదరాబాద్, ఏప్రిల్ 18: హైదరాబాద్‌లో మెర్క్యూర్ హోటల్ ప్రారంభమైంది. ఈ లగ్జరీ హోటల్ బ్రాండ్.. ఫ్రాన్స్ బహుళజాతి సంస్థ ఎకార్ హోటల్స్‌కు చెందినదవగా, సోమాజిగూడలో మెర్క్యూర్ హైదరాబాద్ కెసిపి పేరిట అత్యంత విలాసవంతమైన సేవలను ఎకార్ అందించనుంది.

04/19/2016 - 06:02

ముంబయి, ఏప్రిల్ 18: దేశీయ ఐటిరంగ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2015-16) చివరి త్రైమాసికంలో గణనీయంగా పెరిగింది. జనవరి-మార్చి వ్యవధిలో 72.7 శాతం వృద్ధితో 6,413 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2014-15) జనవరి-మార్చిలో ఇది 3,713 కోట్ల రూపాయలుగానే ఉంది.

Pages